NaReN

NaReN

Thursday, March 24, 2022

పలాస అమ్మాయి జాక్‌పాట్‌

 🔳 పలాస అమ్మాయి జాక్‌పాట్‌.. రూ.44లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

24 Mar, 2022 13:03 IST|Sakshi



సాక్షి, విశాఖపట్నం: బీటెక్‌ చదువుతుండగానే ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను చేజెక్కించుకుందో విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సింహాచలం, సుభాసితిల కుమార్తె కొంచాడ స్నేహకిరణ్‌ అనే విద్యార్థిని విశాఖపట్నంలోని అనిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.


ఈ కళాశాలలో అమెజాన్‌ సంస్థ 2021 డిసెంబర్‌లో క్యాంపస్‌ సెలక్షన్‌ నిర్వహించింది. అందులో స్నేహకిరణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.44 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. ఇదిలా ఉండగా, విద్యార్థిని తండ్రి జీడిపప్పు పరిశ్రమలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని స్నేహకిరణ్‌ నిరూపించింది. కూతురు సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE