NaReN

NaReN

Monday, September 16, 2024

ఊపిరితిత్తులలో పేరుకుపోయిన

 *꧁❈⛵ NaReN ❈⛵꧂*

    

*_🫁ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం 7 రోజుల్లో మాయం .శుభ్రం అవుతాయి🫁._*

       ❈──────🎀─────❈

*_🫁ఈ రోజు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం తొలగించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం._*


*_🫁ఊపిరితిత్తులలో కఫం మరియు శ్లేష్మం ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవటం చాలా కష్టం అవుతుంది. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి._*


*_🫁మన శరీరంలోని టాక్సిన్లను బయటకు తీయడంలో ఊపిరితిత్తులు సహాయపడతాయి. మన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి. ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. కాబట్టి ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం._*


*_🫁ప్రతి రోజు ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టే నీటిలో పసుపు,తులసి ఆకులను వేయాలి. ఉదయం సమయంలో తేనె,నిమ్మరసం గంటలో రెండు సార్లు తీసుకోవాలి. శ్వాసకు సంబందించి వ్యాయామాలు చేయాలి. అలాగే రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కేవలం వారంలో రోజుల్లోనే కఫం,శ్లేషం తగ్గి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి._*


*_🌿తులసి ఆకులలో పొటాషియం, ఐరన్, క్లోరోఫిల్, మెగ్నీషియం, కెరోటిన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ 4-5 తులసి ఆకులు తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉండటానికి తులసి తీసుకోవచ్చని ఆయుర్వేద వైధ్య నిపుణులు చెప్పుతున్నారు._*



      

Sunday, September 15, 2024

షుగర్‌ ఉన్నవారికి

షుగర్‌ ఉన్నవారికి గుమ్మడి గింజలు సంజీవిని గా పనిచేస్తాయా...?

Pumpkin seeds act as a sweetener for those with sugar.


ఇండియాలో షుగర్‌ వ్యాది ఉన్న వారి సంఖ్య దేశ జనాభ పెరిగినట్లుగా పెరుగుతుంది. ఇది ఆహారపు అలవాట్లు మరియు లైఫ్‌ స్టైల్‌ కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిన సమయంలో ఇన్సులిన్ ను అందించడం వల్ల నార్మల్ అవుతుంది. షుగర్‌ వ్యాదిగ్రస్తులు రెగ్యులర్‌ గా మందులు వాడుతూనే ఉండాలి. ఇన్సులిన్‌ శాతంను పెంచుకునేందుకు ట్యాబ్లెట్‌ లేదా ఇంజక్షన్ వేయడం అవసరం లేకుండానే కొన్ని ఆహార పదార్థాలతో షుగర్ ను కంట్రోల్‌ లో పెట్టవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.


పదే పదే ఇంజక్షన్ వేసుకునే వారికి గుమ్మడికాయ మరియు గింజలు సంజీవని గా పని చేస్తుంది అంటున్నారు. షుగర్‌ వ్యాదితో బాధ పడుతున్న వారు రెగ్యులర్‌ గా గుమ్మడి గింజలు మరియు గుమ్మడి కాయ ను తినడం వల్ల ఉపశమనం దక్కుతుంది.


రెగ్యులర్‌ గా గుమ్మడి కాయలు తినే వారు ఒకటి రెండు రోజులు ఇన్సులిన్ తీసుకోకుండా ఉండవచ్చు. ఎంత రెగ్యులర్‌ గా తింటే అంతగా షుగర్‌ వ్యాది కంట్రోల్‌ లో ఉంటుంది. తద్వార షుగర్‌ కు తీసుకునే ఇన్సులిన్‌ ను కూడా పక్కకు పెట్టవచ్చు. ఇన్సులిన్ ను ఎక్కువ వాడటం అనేది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మానసిక స్థితిని కూడా మార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇన్సులిన్‌ తగ్గించి ప్రత్యామ్నాయంగా గుమ్మడి గింజలను వినియోగిస్తే ఉత్తమం అనేది ఆయుర్వేద వైద్యుల సలహా.


షుగర్‌ లెవల్స్ పెంచడంలో గుమ్మడి గింజలు సమర్థవంతంగా పని చేస్తాయని వారు నిర్థారించారు. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా పట్టించుకునే వారు కొద్ది మంది ఉంటారు. గుమ్మడి గింజలను షుగర్‌ వ్యాది కి సంబంధించిన చికిత్స కోసం వినియోగించే వారు అతి కొద్ది మంది మాత్రమే. ముందు ముందు షుగర్‌ వ్యాదిగ్రస్తులు మరింత మంది పెరిగే అవకాశం ఉంది.  విటమిన్‌ ఏ మరియు సి లు ఇంకా పోలిక్ యాసిడ్‌, ప్రోటీన్లు ఇంకా ఐరన్ కూడా గుమ్మడి గింజల్లో ఉంటాయి కనుక అసలు లైట్ తీసుకోవద్దు.

Thursday, September 12, 2024

ఒక మెడికల్ ప్రొఫెసర్

 దయచేసి ఇది చదవండి

 చాలా ముఖ్యం!!


 "ఒక మెడికల్ కాలేజీలో, ఒక మెడికల్ ప్రొఫెసర్ఒక మెడికల్ ప్రొఫెసర్ నాల్గవ సంవత్సరం వైద్య విద్యార్థులకు మెడిసిన్ బోధిస్తున్నప్పుడు అతను ఈ క్రింది ప్రశ్న అడిగాడు:


 "వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి?"

 కొందరు సమాధానం: "తలలో కణితుల వలన కలుగుతుంది."


 అతను బదులిచ్చాడు: లేదు!

 

 ఇతరులు సూచిస్తున్నారు: "అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణాలుగా చెప్పబడింది."

 

 అతను మళ్ళీ సమాధానం చెప్పాడు: లేదు!

  

 వారి సమాధానాల ప్రతి తిరస్కరణతో, వారి సమాధానాలు సరైనవి కావు.


 మరియు అతను అత్యంత సాధారణ కారణాన్ని జాబితా చేసినప్పుడు వైద్య విద్యార్థులు ఆశ్చర్యపోయారు.


 .  అందుకు మెడికల్ ప్రొఫెసర్ చెప్పిన కారణం


 - డీహైడ్రేషన్

  

 ఇది జోక్ లాగా అనిపించవచ్చు;  కానీ అది కాదు.

 

 60 ఏళ్లు పైబడిన వారు సాధారణంగా దాహం వేయడం మానేస్తారు. 


 ఫలితంగా, వారు ద్రవాలు తాగడం మానేస్తారు.


 తమ దగ్గర ఎవరూ లేనప్పుడు, ఫ్లూయిడ్స్ తాగమని గుర్తు చేసేవారు ఎవరూ లేనప్పుడు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు.

 

 నిర్జలీకరణం తీవ్రమైనది మరియు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. 


 నిర్జలీకరణం సంభవించినట్లయితే, అది ఆకస్మిక మానసిక గందరగోళం, తక్కువ రక్తపోటు, పెరిగిన హృదయ స్పందన రేటు, ఆంజినా (ఛాతీ నొప్పి), కోమా మరియు మరణానికి కూడా కారణమవుతుంది.

  

 ద్రవాలు తాగడం మరచిపోయే ఈ అలవాటు 60 ఏళ్ల వయసులో మొదలవుతుంది. 


 మన శరీరం 50% కంటే ఎక్కువ నీటితో ఉండాలి.


 60 ఏళ్లు పైబడిన వారికి సాధారణంగా తక్కువ నీటి నిల్వలు ఉంటాయి. 


 ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో భాగం.


 కానీ మరిన్ని చిక్కులు ఉన్నాయి.  వారు డీహైడ్రేషన్‌కు గురైనప్పటికీ, వారు నీరు త్రాగడానికి ఇష్టపడరు ఎందుకంటే వారి అంతర్గత బ్యాలెన్సింగ్ మెకానిజమ్స్ అలాగే మన మెదడు ఆలోచనా సామర్థ్యం కూడా పనిచేయవు.


*ముగింపు:* 

  

 60 ఏళ్లు పైబడిన వారు డీహైడ్రేషన్‌కు గురవుతారు. 


 కారణం వారికి చిన్న నీటి సరఫరా ఉన్నందున మాత్రమే కాదు;  కానీ వారు శరీరంలో నీటి కొరత అనుభూతి లేదు ఎందుకంటే

 సులభంగా డీహైడ్రేట్, 


 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, ప్రతిచర్యలు మరియు రసాయన ప్రతిచర్యలు వారి మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తాయి.

  

 కాబట్టి ఇక్కడ రెండు హెచ్చరికలు ఉన్నాయి:


 1) వృద్ధులను ద్రవపదార్థాలు తాగేలా చేయండి.  ద్రవాలలో నీరు, పండ్ల రసాలు, టీ, కొబ్బరి నీరు, సూప్‌లు మరియు పుచ్చకాయ, సీతాఫలం, పీచెస్ మరియు పైనాపిల్ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు ఉన్నాయి;  నారింజ మరియు టాన్జేరిన్లు కూడా పని చేస్తాయి.


 ప్రధాన విషయం ఏమిటంటే ప్రతి రెండు గంటలకు, మీరు కొంత ద్రవాన్ని త్రాగాలి.


 ఇది గుర్తుంచుకో!

 

 2) కుటుంబ సభ్యులకు జాగ్రత్త: 60 ఏళ్లు పైబడిన వారికి రెగ్యులర్ ఫ్లూయిడ్స్ ఇవ్వండి.  అదే సమయంలో, వాటిని గమనించండి.

  

 *వృద్ధులు ద్రవాలను తిరస్కరిస్తున్నారని మరియు ఒక రోజు నుండి మరుసటి రోజు వరకు, వారు చిరాకు, శ్వాస ఆడకపోవడం లేదా అజాగ్రత్తగా కనిపిస్తే, ఇవి ఖచ్చితంగా నిర్జలీకరణ యొక్క నిరంతర సంకేతాలు*.


 ముసలివాళ్ళకి నీళ్ళు ఎక్కువ తాగమని ఇప్పుడేనా ??


 ఈ సమాచారాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయండి. 


 మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తమను తాము తెలుసుకోవాలి మరియు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండటానికి మీకు సహాయం చేయాలి.


 సీనియర్ సిటిజన్స్ అబ్బాయిలకు మంచి సమాచారం.👍


 *60 ఏళ్లు పైబడిన వారితో ఈ సందేశాన్ని షేర్ చేయడం ఉత్తమం*

Saturday, September 7, 2024

అప్పట్లో ఒకడుండేవాడు

 అప్పట్లో ఒకడుండేవాడు అని ఎప్పుడూ అనుకుంటారు ఆ గ్రామస్థులు.Hats off to you sir.🙏🙏


ఈ స్కూల్ నాది అని ఫీల్ అయ్యాడు.దాని కోసం ఎంత దూరమైనా వెళ్లాడు.ఎంతకైనా తెగించాడు.జీవితాన్నే పణంగా పెట్టి ఆ పాఠశాలను నిలబెట్టాడు.   🙏🙏🙏

చరిత్ర లో నిలిచిపోయిన పాఠశాల -  విలీనాన్ని ఎదిరించి పాఠశాలను గెలిపించిన ఉపాధ్యాయుడి విజయగాధ.చదవండి..


సెప్టెంబర్ 4, సవ్వడి న్యూస్ అనంతపురం బ్యూరో:


 రాష్ట్రంలోని ఒక మారుమూల కుగ్రామంలో ఉన్న పాఠశాల కోసం తన ఉద్యోగాన్నే పణంగా పెట్టి, రాష్ట్ర ప్రభుత్వానికే ఎదురునిలచాడు, తన శక్తి మించిన పోరాటం చేసి, విజయం సాధించి సంచలనం సృష్టించిన ఓ ప్రధానోపాధ్యాయుడి 'విజయగాథ' ను తెలుసుకోవడమే కాకుండా, ఆ టీచర్ నడిపిన పోరాటంతో విజయం తలవంచి దాసోహం అన్నది. ఆ కుగ్రామంలో ఆ టీచర్, ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 72 రోజుల పాటు నడిపిన పోరాటం, స్ఫూర్తి భావితరాలు సైతం గుర్తుంచుకునేంత గా నిలిచిపోయాయి. అందులోనూ అధికార పార్టీకి చెందిన ఓ మినిస్టర్ ఉన్న నియోజకవర్గంలో ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని, ప్రభుత్వమే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పాలసీ (117 GO) కు వ్యతిరేకంగా పోరాడి కేవలం ఆ ఒక్క పాఠశాలను మాత్రమే, ప్రభుత్వ పాలసీ నుంచి మినహాయించడం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలకు తాళం వేసి అవిశ్రాంత పోరాటం సలిపి అఖండ విజయం సాధించిన 'విజయగాధను, నేటి ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ఆ సంచలన సంఘటనను సవివరంగా నెమరువేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు సంచలనం సృష్టించిన ఆ ప్రధానోపాధ్యాయుడే నల్లపల్లి విజయ్ భాస్కర్, అనాటి ఆ పోరాట జ్ఞాపకాల్లోకి తొంగి చూద్దాం రండి.. అది అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఓ మారుమూల కుగ్రామం. పేరు మాయదార్లపల్లి గ్రామానికి మూడు, మూడు కిలోమీటర్ల చొప్పున 'నేలబడి తోట', 'కుంట' అనే రెండు ఆవాస గ్రామాలు ఉన్నాయి. ఆ మూడు గ్రామాలకు కలిసి మాయదార్లపల్లిలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే.. సినీ ఫక్కీలో తమ స్కూల్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన 'రియల్ హీరో' నల్లపల్లి విజయ్ భాస్కర్.. ఆ పాఠశాలలో మొత్తం వంద పాతిక కు పైగా విద్యార్థులు ఉండగా, అందులో నేలబడి తోట, కుంట గ్రామాలకు చెందిన 44 మంది విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయదార్లపల్లి పాఠశాలకు వంకలు, వాగులు దాటుకుని అడవిమార్గం గుండా నడుచుకుంటూ స్కూల్ కు వచ్చి చదువుకుంటారు. ఇలా నడుచుకుంటూ వచ్చే సమయంలో దారిలో పాములు, ఎలుగుబంట్లు, వన్యమగాలు ఎదురుపడడం ఉంటాయి, వాటికి భయపడి పాఠశాలకు వెళ్లకుండానే తిరిగి ఇంటికి వెళ్లపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక వర్షాకాలంలో అయితే వారి కష్టాలు దేవుడికే ఎరుక. పుస్తకాల బ్యాగును తలపై పెట్టుకొని, నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ పాఠశాలకు రావాల్సిఉంటుంది. ఇది క్లుప్తంగా మాయదార్లపల్లి పాఠశాల, ఆ మూడు గ్రామాల విద్యార్థులు చదువుకోవడానికి ప్రతిరోజూ పడుతున్న తిప్పలు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. గత YCP ప్రభుత్వం 'నాడు-నేడు' పనుల్లో భాగంగా శిథిలావస్థలో ఉన్న మాయదార్లపల్లి పాఠశాలను రూ.44 లక్షలతో అత్యద్భుతంగా అన్ని విధాల ఆధునీకరించింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ తోపాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం పట్టుమని పది రోజులకే అవిరైపోయింది. కారణం నూతన విద్యా విధానంలో భాగంగా ఆ ప్రభుత్వం తెచ్చిన 117 జీవోనే.. ఈ జీవో ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న 3,4,5 తరగతులను, 3 కిలోమీటర్ల లోపు ఉన్న 6,7,8 తరగతులను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేశారు. దీంతో మాయదార్లపల్లి పాఠశాలలోని 6,7,8 తరగతుల విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐసాపురం పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి, అప్పుడు అసలు సమస్య మొదలైంది.. రహదారి సరిగ్గా లేకపోవడం, బస్సు సౌకర్యం అస్సలు లేని గ్రామాలు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీనికి తోడు నేలబడి తోట, కుంట గ్రామాలకు చెందిన విద్యార్ధులు వారి గ్రామాల నుంచి మాయదార్లపల్లికి 3 కిలోమీటర్లు, అక్కడి నుంచి

ఐసాపురానికి 3 కిలోమీటర్లు మొత్తం చొప్పున 6 కిలోమీటర్లు పోవడానికి,తిరిగి రావడానికి 6 కిలోమీటర్లు నడవాలి. దీంతో దాదాపు 44 మంది విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు బడి మానేసే పరిస్థితి ఏర్పడింది. చదువు అంటే ఇష్టముండి, బాగా చదివే విద్యార్థులు బడి మానేస్తామని చెప్పడంతో ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ కలత చెందారు. వెంటనే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను,రాజకీయపార్టీనేతలనూ, విద్యార్థి సంఘాలను చైతన్య పరిచారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తమ పాఠశాల తమకు కావాలంటూ ఉద్యమానికి తెరలేపారు. రూ.40 లక్షలతో అత్యద్భుతంగా ఆధునీకరించిన ఆ పాఠశాల గేటుకి తాళం వేసి ఏకంగా గేటుకు కంప వేసేశారు. దీంతో ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా, మా పాఠశాల

మాకే కావాలంటూ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వ పాలసీకి

వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ అలుసుగా చూశారు. దీంతో విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ మరింత పట్టుదల పెరిగింది. దీనికి తోడు ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్,

ఉపాధ్యాయులు ఎండ, వాన లెక్క చేయకుండా చెట్ల కింద, ఆరుబయట పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. బసాపురానికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లేదిలేదని విద్యార్థులు సైతం పట్టుబట్టి మధ్యాహ్నభోజనం సైతం ఇంటి నుంచి తెచ్చుకున్నారు. తమ విద్యార్థులు అక్కడ ఎక్కడో ఉన్న బడికి వెళ్ళలేక, ఎక్కడ బడి మానేస్తారో అని, అలాంటప్పుడు వారు బడి మారటానికి వీల్లేదని ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ టీసీలు కూడా ఇవ్వలేదు.ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పాలసీ మారదనే సాకుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాయదార్లపల్లి విద్యార్థులకు విద్యాశాఖ కార్యాలయం నుంచి నేరుగా ఆన్ లైన్ లోనే టీసీలు ఇచ్చారు. అయినా సరే ప్రధానోపాధ్యాయుడు గానీ, విద్యార్థులు గానీ పట్టు వీడలేదు. తమ పాఠశాల తమకే కావాలంటూ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు.2022 జూలై 6న ప్రారంభమైన ఈ ఉద్యమం ఒకరోజు కాదు, వారం రోజులు కాదు ఏకంగా 72 రోజుల పాటు కొనసాగింది. ఈ ఉద్యమంలో అనేక అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే నెల 11వ తేదీన మండల విద్యాశాఖాధికారి పాఠశాలను సందర్శించి పై అధికారులకు తప్పుడు నివేదిక సమర్పించారు.. జూలై 16న

ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ కలెక్టర్ ని కలిసి ఆ పాఠశాల, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పూసగుచ్చినట్టు వివరించారు. జూలై 31న విజయవాడకు వెళ్లి అప్పటి

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ ను కలిసి పరిస్థితిని అంతా వివరించారు. ఇది అయ్యేపని కాదు ఎందుకు వృథాప్రయాస మీ పని మీరు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ 'సార్ ఎప్పటికైనా ఈ ఫైల్ మీ దగ్గరకే వస్తుంది, అప్పుడు సంతకం చేయడానికి సిద్ధంగా ఉండండి' అని తిరిగి వచ్చేశారు. ఆగస్టు 8న అప్పటి విద్యాశాఖ మంత్రి

ఆదిమూలపు సురేష్ కు కూడా కలిసి పరిస్థితిని వివరించారు. ఐనా ఫలితం శూన్యం. అదే రోజున విద్యార్థులు తమ పాఠశాల తమకే కావాలంటూ గ్రామంలోని వాల్మీకి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా జగన్ మామయ్యా మా స్కూల్ మాకే

కావాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్ట్ లు రాశారు కూడా.అంతటితో ఆగకుండా ఆగస్టు 10న హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి

లేఖలు రాశారు. దీనికి స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఉద్యమాన్ని పరిశీలించాలని న్యాయ సేవాధికార సంస్థకు బదిలీ

చేసింది. దీంతో మారుమూల గ్రామమైన మాయదార్లపల్లి పాఠశాల ఉద్యమం రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల్లో మరింత ఉత్కంఠ రేపింది. ఉద్యమానికి అప్పటి అధికార YCP మినహా మిగిలిన అన్ని పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు తమ ప్రకటించాయి.

సెప్టెంబర్ 19న కళ్యాణదుర్గం TDP నాయకులు ఉమామహేశ్వరనాయుడు అనంతపురం CPM నాయకులు రాంభూపాల్ మాయదార్లపల్లిని సందర్శించి తమ మద్దతును ప్రకటించారు. సెప్టెంబర్ 5 న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీ జయంతి కార్యక్రమాలను కూడా అరుబయట చెట్ల కిందే నిర్వహించారు. అక్టోబర్ 13న విద్యార్థులు తమ పాఠశాల తమకే కావాలంటూ మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అప్పటికీ కనీసం MRO ను కూడాచూడని ఆ మారుమూల మాయదార్లపల్లి ప్రజలు జిల్లా కలెక్టర్ ను, జాయింట్ కలెక్టర్ ను, జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు, నాలుగు మండలాల MEO  లను, RDO ను, ఇతర జిల్లా అధికారులందరినీ సెప్టెంబర్ 24 న తమ గ్రామానికి రప్పించుకున్నారు. కలెక్టర్ తోపాటు ఉన్నతాధికారులు కూడా తమ గ్రామానికి రావడంతో వారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అయితే అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, అక్కడి వాస్తవ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ కి రాసి పంపింది. ఆ తరువాత కూడా ఉద్యమాన్ని భగ్నం చేయడానికి ఆ నియోజకవర్గ మంత్రి చేయని కుట్రలు, కుతంత్రాలు లేవు.. సెప్టెంబర్ 21వ తేదీ ఆ గ్రామానికి చెందిన YCP నాయకులను పిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం తగదని, ఉద్యమాన్ని ఆపకపోతే ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అయినా విద్యార్థులు, తల్లిదండ్రులు రాజకీయాలకు అతీతంగా తమ పాఠశాల తమకే కావాలంటూ ఉద్యమాన్ని మరింత ఉదృతంగా కొనసాగించారు. బసాపురానికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి  చెప్పారు. దీంతో ఆ మంత్రి చేసిన కుట్రలు సైతం భగ్నమయ్యాయి.ఉద్యమం ఉధృతం కావడంతో చివరకు ప్రభుత్వం దిగి వచ్చి అక్టోబర్

21న విలీనం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బసాపురం పాఠకాలకు వెళ్లనందుకు ఆబ్సెంట్ వేసిన ఆ విద్యార్థులకు అటెండెన్స్ వేసి అమ్మఒడికి అర్హులని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.ప్రభుత్వ పాలసీకి

వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రంలోనే విలీనం నుంచి మినహాయింపు పొందిన పాఠశాలగా అనంతపురం జిల్లా, మాయదార్లపల్లి పాఠశాల నిలిచింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని అనంతపురం జిల్లా బెళుగుప్ప

మండలం గంగవరం పాఠశాలలో కూడా ఉద్యమం ప్రారంభమైంది.దీనికి సైతం ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ మద్దతు

ప్రకటించారు. ఆ పాఠశాలను సందర్శించి విలీనం విషయం పునరాలోచించాలని ప్రభుత్వానికి ఉపాద్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా పోరాడి విలీనంనుంచి మినహాయింపు పొందిన పాఠశాలగా మాయదార్లపల్లి పాఠశాల సంచలనం సృష్టించింది, విలీనం నుంచి మినహాయింపు పొందిన కారణంగా ప్రస్తుతం ఆ పాఠశాలకు 6 స్కూల్ అసిస్టెంట్, 2 ఎస్జీటీ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి

విజయ్ భాస్కర్ తో పాటు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ పాఠశాల ఉన్నంత కాలం వారందరూ గుర్తుండిపోతారు.



Wednesday, September 4, 2024

Wednesday, August 28, 2024

ఒక పల్లెటూరు లో ఒక హోటల్

 ఒక పల్లెటూరు లో ఒక  హోటల్ ఉంది...

అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది

వచ్చారు . అంత మంది ఒకేసారి రావడంతో  ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు.

సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు... 


అందరు హోటల్ లో

కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్

గారు వచ్చారు...


అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్

గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని

చూసాడు... చూడగానే ఎందుకో ఆ తాత అలా

చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాతా 

ఇటురా అని పిలిచాడు...


ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు... తాత

చేసానయ్య అని చెప్పాడు...


మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ

కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే

నీకు ఇష్టమా అని అడిగాడు...??


అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా

మొహం పెట్టి చెప్పాడు...


మరి ఏంటి ఏమైనా

డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే

చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...


అదేం లేదయ్యా .. నేను ఒక్కటి అడగాలి

అనుకుంటున్నా .... అడగనా అన్నాడు ...??


సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...


మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా

ఎవరైనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే

ఏం చేస్తారు ...?? అని అడిగాడు.


ఏముంది .... అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అన్నాడు ...??


అప్పుడు ఆ తాత ...

మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి

సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??


అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో

ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...


అపుడు తాత అడిగాడు ...... మీరు ఇంత మంది ఇక్కడ

భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల

మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు. అందుకే నేను అలా చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...


దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ..... ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...


అపుడు ఆ తాత అన్నాడు... మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా

కట్టిస్తారు... 


కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా  మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని

పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??


డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని

అడిగాడు...??


ఆ తాత ఇలా చెప్పాడు ..... కోట్లు ఉన్న కోటీశ్వరుడు  అయినా, దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు, దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు... కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఏదో  ఒక్కసారి అయినా మమ్మల్ని  గుర్తు చేసుకోకపోయినా వారి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటాయి  అని చెప్పాడు...


అందుకే బాబు .... ఇందాక మీరు సగం అన్నం లో

చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి

చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...


ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు కానీ సినిమా వాళ్ళు కాదు ...


మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం

భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...


ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే

మద్యపానం ఆరోగ్యానికి హానికరం...

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని

సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట

అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి

అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని

బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు...

Tuesday, August 27, 2024

Power of Positive Thinking


Research is beginning to reveal that positive thinking is about much more than just being happy or displaying an upbeat attitude. Positive thoughts can actually create real value in your life and help you build skills that last much longer than a smile.



Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE