NaReN

NaReN

Friday, April 7, 2023

తొలి శాసనంలో తెలంగాణం!!

 *తొలి శాసనంలోతెలంగాణం!!*


" తెలంగాణ " పదాన్ని తొలిసారిగా ప్రస్తావించిన "శాసనం" రాజదాని హైదరాబాదుకు సమీపంలోనే వుందన్న

విషయం చాలామందికి తెలియదు!!

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం

BHEL కంపెనీ  లింగంపల్లి దగ్గరలో గల

"తెల్లాపూర్" గ్రామంలో వున్న ఈ శాసనాన్ని

తెల్లాపూరు శాసనంగా తెలంగాణ శాసనంగా

వ్యవహరిస్తారు!!

దీన్ని వేయించింది #విశ్వకర్మ వంశస్థులైన

నాగోజు, అయ్యలోజు, వల్లభోజులు!!


ఈ శాసనాన్ని చెక్కింది ఓజు రుద్రోజు, సిరిగిరోజులు!! క్రీ.శ. 8-1-1418 నాటిది ఇది!!

24 పంక్తులు గల ఈ శాసనం దాదాపు

600 ల సంవత్సరాలనాటిది!! ఇది 1986లో

లభించింది!! ఈ శాసనము 13వ పంక్తిలో

#తెలంగాణపురం అని వున్నది!! అది రాను

రాను తెల్లాపూరు గ్రామంగా మారింది!!


*శాసనసంగ్రహం!!*


#విశ్వకర్మ వంశంలో జన్మించిన మయిలోజు

పుత్రుడు పోచోజు. ఇతని కుమారుడు నాగోజు

ఈయన కుమారుడు మల్లోజు!!

మల్లోజు  పుత్రులైన నాగోజు, అయ్యలోజు,

వల్లభోజులు  తెలంగాణాపురంలో "నడబావి"

ని ఆచంద్రార్కం వుండేలా నిర్మించారు!!

ఈ బావికి  కలు కంబాలు(రాతిస్థంబాలు)

ఏతామును నిర్మించి, నీటిని ఉత్తర కొసన

వన్న మామిడితోటకు పారేవిధంగా ఏర్పాటు

చేశారు!(ఇందులో వున్న "ఉత్తరంపుగొమ్మనం"

పెట్టించిన మామిడివనం)అనే పదప్రయోగం

వున్నది! మేము మామిడివనం పెట్టినం!

మామిండ్లు మా ఇండ్లు అనే ప్రయోగాలు

తెలంగాణాలో వాడుకలో వున్నాయి!!


మరోవ్యక్తి అయ్యలోజు అప్పటి బహమనీ

సుల్తాను తాజుద్దీను ఫిరోజు షా పట్టపురాణికి

బంగారు గాజులు, మెడలో హారాలు చేశారట!

అంటే ఆ వంశస్థులకు ఆనాటి పాలకులతో

మంచి సంభంధాలు వుండేవి అని తెలుస్తుంది!


*ప్రస్తుతం*


చుట్టూ ఇళ్ళమధ్యన కాసింత స్థలంలో

నాలుగున్నర ఎత్తైన పీఠం మీద వేప చెట్టు

కింద ఆలయాల్లో వుండే "నాగినశిల"ను

తలపిస్తూ నిలచి వుంది ఈ శాసనం!!

విశ్వకర్మ వంశస్థులు నిర్మించిన "నడబావి"

ఇప్పుడు లేదు. 


*కొసమెరుపు*


* ఒకప్పటి విశ్వకర్మ వంశస్థుల వైభవం! వారే

శాసనాలు లిఖంప జేశారంటే అక్కడి ప్రాంత

సామంత ప్రభువులైనా వుండాలి!! లేదా గ్రామ

అధికారులైనా అయివుండాలి!!


* శాసనాలు చెక్కడంలో కానీ రాగి రేకులపై

చారిత్రక అంశాలతో పాటు, పురాణగాథలను

కానీ మంత్ర,యంత్ర విషయాలను వ్రాయటం లో గాని విశ్వకర్మీయులది అందె వేసిన చేయి!!


*వారు "ఓజు" లు అని పిలువబడేవారు!!

తాళపత్ర గ్రంథాలు లిఖించటంలో కూడ

వారు నైపుణ్యమును ప్రదర్శించేవారు!!

వారు "వ్రాయసగాండ్లు"గా ప్రసిద్ధినొందారు!!


*దేవాలయ శిల్పంలో కానీ ఆగమశాస్త్రాదుల

యందుగాని వారు బహు ప్రవీణులు!!

చారిత్రక శాసన నిర్మాణకర్తలు!!విశ్వకర్మలు!!

మొత్తము భారతజాతి వారికి ఋణపడివుంది!

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE