ఒక తెలుగు టీచరు పేపర్లు దిద్దాల్సివచ్చింది ఐదో తరగతి పిల్లలవి!
అసలే మన ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు సవ్యంగా రాకూడదని కదా రూలు! కాబట్టి వచ్చీరాని తెలుగులో ముద్దుముద్దుగా రాసారు పరీక్ష !
కరెక్షన్ ఒక ఎత్తయితే , ఆనక పేరెంట్స్ వచ్చి మార్కుల కోసం తగువులాడటం
మరీ రసవత్తర ఘట్టం !
ఇదీ ప్రశ్న : లంకాధిపతి రావణుని చంపినది ఎవరు? (3మార్కులు)
నా బోటి కుర్రాడు
"భీముడు" అని వ్రాశాడు సమాధానం.
నే కొట్టేశా. మార్కులివ్వలేదు.
తరవాత ఆ బాబు వాళ్ల తల్లిదండ్రులు వచ్చి కనీసం రెండు మార్కులైన ఇవ్వాలి.. attempt చేసాడు కదా అని వాదిస్తారు.
అసలెలా ఇస్తామండి? ఒక పదం సమాధానం ..అది తప్పు పూర్తిగా అని నేనంటే...
ఆవిడ జవాబు :
రాముడు అనే మూడక్షరాల పదానికి 3 మార్కులైతే , మా వాడు రాసింది భీముడు అంటే ఒకే అక్షరం తప్పు. ము,డు రెండూ కరెక్టైనపుడు రెండక్షరాలకు రెండు మార్కులు ఎందుకివ్వరు? చేసిన తప్పే కనిపిస్తోంది కానీ-రాసిన ఒప్పును ఒప్పుకోలేని మీరూ ఓ టీచరేనా ???
నేటి కాలం తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారు అనేందుకు ఓ చిన్న కథ.
No comments:
Post a Comment