NaReN

NaReN

Wednesday, November 22, 2023

తెలివి ఎవరి సొత్తు కాదు


       *తెలివి_ఎవరి సొత్తు కాదు*

                ➖➖➖


*'చదువుకొన్నవాడు' మాత్రమే మేధావా.....!!?    'చదువుకొననివాడు' మేధావి కాదా.........!!?*


           *దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి.*

             

                *ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు.* *అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా  సిద్ధమయ్యాడు.*


         *డిక్కీ లోని టూల్స్, స్టెప్నీ టైర్ బయటకు తీసి, ఎంతో కష్టపడి వీల్ నట్లన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ టయర్ నట్ల పైపడి అవన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. సూటు బూటు లో ఉన్న తాను వాటిని తీయలేడు, మరి ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా అటు పక్కగా ఒక వ్యక్తి అక్కడక్కడా చినిగి పోయిన, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అతడు ఈయన్ని చూసి సార్ మీరు ఎవరు, మీ కారుకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీర్ తాను ఎవరో తన హోదా ఏమిటో వివరాలు చెప్పి, టైర్ మార్చబోయే సమయంలో జరిగిన విషయం అంతా చెప్పి నీవు ఆ కాలువలోకి దిగి ఆ కాలువలో నుండి అందులో పడిపోయిన నట్లను వెతికి బయటకు తీసిస్తే మీకు ఎంత డబ్బైనా ఇస్తానని అన్నాడు.*


           *అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ....చూడండి సార్, కాలువలో దిగి నట్లను వెదికి బయటకు తీయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంతకంటే సులభమైన మార్గం ఒకటి మీకు చెబుతాను. అలా చేస్తే ఎవరూ మురికి కాలువలో దిగవలసిన అవసరం ఉండదు. అదేమంటే మీ కారుకున్న మిగతా మూడు వీల్స్ ల నుండి ఒక్కోక్క నట్టును తీసి ఈ వీల్ కు వేయండి. దానివల్ల కారును మీరు ఏ ఇబ్బందీ లేకుండా నడిపించవచ్చు.*


          *తరువాత మీరు వెళ్ళే దారిలో వచ్చే మెకానిక్ షాప్ లో మిగతా నాలుగు నట్లు కొని, వాటిని అన్ని వీల్స్ కు వేసుకుంటే సరిపోతుంది కదా. దానికోసం నేను మురికి కాలువలో దిగి మురికి, బురద అంటించుకోవడం, మీరు నాకు అడిగినంత డబ్బు ఇవ్వడం, ఇవన్నీ అవసరం లేదు కదా అన్నాడు. అంతే అది విన్న ఆ ఇంజనీరు ఇంత మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, ఏమీ చదువుకోని ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి, ఆలోచిస్తూ.... సిగ్గుతో తలదించుకొని ఉండి పోయాడు.*


 *#నీతి :-   కాబట్టి మిత్రులారా! ఏ మనిషిని పైన చూసి తక్కువ అంచనా వేయకండి, అలాగే చిన్నచూపు చూడకండి. ఎవరి మైండ్ ఎంత పదునుగా ఉంటుందో బయటకు తెలియదు కదా! మీరు గమనిస్తే "ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉన్నా, జ్ఞానాన్ని సూన్యం చేస్తున్నాయని " చెప్పవచ్చు. అన్ని తెలివితేటలు ఉన్నా మేధావులు తమ తెలివితేటలను ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియడం లేదు.*


        *మీరు గమనిస్తే "ప్రాణాలతో ఉన్న పక్షికి చీమలు ఆహరం, కానీ అదే పక్షి తాను చచ్చిన తర్వాత తాను తినే ఆ చీమలకే ఆహారం అవుతుంది ". పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు కాబట్టి ఎవరిని తక్కువగా అంచనా వేసి చులకనగా చూడకండి, అలుసుగా మాట్లాడకండి.*✍️

          

Tuesday, October 31, 2023

Self Confidence

 *💁🏻‍♂️ Self Confidence:*


*💁‍♀️ అద్భుత అస్త్రం.. ఆత్మవిశ్వాసం!*

➢➢➢➢➢➢➢➢➢➢➢➢

*ఉద్యోగం సంపాదించడంలో చెందుతున్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉండే లోపాలూ, వాటిని అధిగమించే మెలకువలు ఇవీ...*


   *ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్షతో అకడమిక్‌ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటారు కాబట్టి.. బృందచర్చ, ఇంటర్వ్యూల్లో దానికి ప్రాధాన్యం తక్కువే. వీటిలో అభ్యర్థుల తీరు, వారు విభిన్న    పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నారో పరిశీలిస్తారు. అందులో మెరుగైన ప్రదర్శన చేసినవారికే అవకాశాలు లభిస్తాయి. కొలువు కొట్టటంలో వైఫల్యం చెందుతోన్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉమ్మడిగా ఉండే లోపాలూ, వాటిని అధిగమించే మెలకువలూ తెలుసుకుందామా?*


  *సుమతి తెలివైన విద్యార్థిని. పది నుంచి పీజీ దాకా డిస్టింక్షన్‌. సుగుణకు పీజీ వరకు ప్రథమ శ్రేణి మార్కులున్నాయి. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ కలిసే చదువుకున్నారు. కార్పొరేట్‌ సంస్థ నియామక పరీక్షను ఇద్దరూ రాసి, అర్హత పొందారు. ఎంపికలో తర్వాత దశ.. బృంద చర్చ, ముఖాముఖిలోనూ పాల్గొన్నారు. ఫలితాల జాబితాలో అనూహ్యంగా సుమతి పేరు లేకుండా సుగుణ పేరుంది. ఏం జరిగి ఉంటుంది?*


   *సుమతి లాంటి ఉద్యోగార్థుల్లో.. అకడమిక్‌ పరిజ్ఞానం, అవసరమైన స్కిల్స్‌ రెండూ బాగా ఉంటాయి. కానీ గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు వచ్చేసరికి తడబడుతుంటారు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమవడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైంది.. వారిలో ఆత్మవిశ్వాసం లోపించడమే.*


   *ఏం మాట్లాడితే ఏమవుతుందోననే జంకు, భయం కొందరిదైతే, ఇంటర్వ్యూ అంటేనే ఒత్తిడికి గురై బెదిరిపోయేవాళ్లు ఇంకొందరు. సరైన సమాధానం తెలిసినప్పటికీ అది అవునో, కాదో అనే సందేహం, చొరవ తీసుకోవడంలో మీమాంస, ఆందోళన... తదితర కారణాలతో వీరంతా ఆఖరి అంకంలో వెనుదిరగాల్సివస్తోంది. ఉద్యోగానికి కావాల్సిన అన్ని యోగ్యతలూ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లోపించడంతో విఫలమవుతున్నారు. ఇంటర్వ్యూ చేసేవారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా ఉద్యోగ సాధనలో వెనుకబడుతున్నారు.*

   *సామర్థ్యాన్ని అస్త్రంగా మార్చుకుని, వందశాతం ఉపయోగిస్తేనే ఫలితమొస్తుంది. చాలామంది విషయంలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రభావవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోవడం వల్ల విజయం  దూరమవుతోంది. దీంతో విషయపరంగా కాస్త వెనుకబడినప్పటికీ, ఆత్మవిశ్వాసం సమృద్ధిగా ఉన్నవాళ్లు వీరికి దక్కాల్సిన అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కారణాలు విశ్లేషించుకోకుండా.. ఎంపిక విధానంలోనే లోపం ఉందని సమర్థించుకునేవాళ్లూ ఎక్కువే. చేసిన తప్పులు, అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుంటే, తర్వాత ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మార్గం సులువవుతుంది.*


*నమ్మకం ఉంటేనే..*


   *యద్భావం తద్భవతి. మనం ఆశించిన ఫలితమే మనకు దక్కుతుంది. నా వల్ల కాదు అనుకుంటే దాని ఫలితమూ అలాగే ఉంటుంది. నేను సాధిస్తాను.. సాధించగలను.. విజయం పొందగలను.. అనే నమ్మకంతో ముందడుగేస్తే విజయానికి దగ్గరవుతాం. ఎవరిని వాళ్లు నమ్మలేనప్పుడు ఇతరులు ఆ వ్యక్తులను నమ్ముతారని ఆశించడం వ్యర్థమే.*  

*పోల్చుకోవడం*


   *ఎక్కువమంది ఇతరులతో పోల్చుకుంటారు. వాళ్ల దగ్గర ఉన్నదాన్ని చూసి, తమ వద్ద లేదని బాధ పడతారు. దీంతో ఒత్తిడికి గురవుతారు. ఆత్మవిశ్వాసం మీద దాని ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరితోనూ పోలిక వద్దు. మీ లక్ష్యం దిశగా అడుగులేయండి. నిన్నటి మిమ్మల్ని, ఈ రోజు మీతో బేరీజు వేసుకోండి. ఇతరుల సంగతి అనవసరమని భావించండి. మీరేం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని ఆ దిశలో ముందుకు కదలండి. వేరెవరి దగ్గరో ఉన్నది మీకు సొంతం కాదు. ఒకవేళ అది మీకు అవసరమైనదైతే ప్రయత్నం చేస్తే తప్పక మీ సొంతమవుతుందని గ్రహించండి. పోల్చుకుంటే సమయం వృథాతోపాటు మీపై మీరే నమ్మకం కోల్పోవచ్చు.*


*వాస్తవికతకు దగ్గరగా..*


  *మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలు వాస్తవికతకు అనుగుణంగా ఉండాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవడం... దాన్ని అందుకోవడం అద్భుతమే. అయితే భారీ లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోలేకపోతే నిరాశ చెందుతారు. దాని ప్రభావం తర్వాత పెట్టుకునే లక్ష్యాలపైనా పడుతుంది. అందువల్ల లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విభజించుకోండి. ఒక్కో దానికి సరిపడా గడువు నిర్ణయించుకోండి. ఇలా చేయడం వల్ల సులువుగా ఒకదాని తర్వాత మరొకటి పూర్తిచేయడానికి అవకాశం కలుగుతుంది. వాస్తవికతకు అనుగుణంగా చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని అధిగమిస్తే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. దీంతో పెద్ద లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.*


*ప్రతికూలంగా..*


  *కొంతమంది వాళ్లకు సంబంధించి ప్రతి విషయాన్నీ విమర్శనాత్మక ధోరణిలో చూస్తారు, వారిపై వాళ్లే ప్రతికూలంగా ఆలోచిస్తారు. దీంతో నియంత్రణ కోల్పోతారు. మాతో ఏమీ సాధ్యం కాదు అనే పరిస్థితికి చేరుకుంటారు. ఫలితంగా ఆత్మవిశ్వాసం ఆవిరవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు ప్రేమించడాన్ని మొదలు పెట్టండి. మీపై మీకు నమ్మకం కలిగేలా వ్యవహరించండి.*


*సమర్థతపై నమ్మకం*


  *స్వశక్తిపై పూర్తి నమ్మకం ఉన్నవాళ్లే ఏదైనా సాధించగలరు. దేన్నైనా సాధించాలంటే పూర్తిస్థాయుల్లో మీ శక్తియుక్తులు, సామర్థ్యాన్ని ప్రదర్శించడం ముఖ్యం. మీపై మీకు నమ్మకం ఉండడం వల్ల సంతోషంగా ఉండటంతోపాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.*


*మీకోసం మీరు*


*మీపై మీరే పెట్టుబడి పెట్టుకోవాలి. అంటే ఉన్న సమయాన్ని మీకోసం మీరు వెచ్చించుకోవాలి. వీలైతే అదనపు సమయాన్నీ కేటాయించాలి. ఏదైనా అంశంలో ప్రావీణ్యం లేకపోతే అందులో అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి. కృషి ద్వారా సమర్థత, సమర్థతతో ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి. ఫలితంగా లక్ష్యానికి మార్గం సుగమమవుతుంది.*


*ఆ దిగులొద్దు..*


  *నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకునేవాళ్లు ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లే. ఎవరి పనులతో వాళ్లు తీరిక లేకుండా ఉంటారు. ఒకరిని ఇంకొకరు పట్టించుకోవడం అన్ని సందర్భాల్లోనూ వీలుపడదు. మీరు కూడా ప్రతిసారీ వేరేవాళ్లను పట్టించుకోవడంలేదు కదా. కాబట్టి ఇతరుల స్పందన కోసం చూడకుండా చేసే పనిని మాత్రమే మీరు ప్రేమించండి. మీ ఆలోచనలకు గుర్తింపు, గౌరవం దక్కడం లేదని దిగులు చెందకండి.*


*గతం నుంచి ప్రేరణ*


  *ఇప్పటిదాకా మీరు సాధించిన విజయాలు, అందుకు లభించిన ప్రశంసలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. వాటి నుంచి ప్రేరణ పొందండి. కొత్త లక్ష్యం దిశగా సానుకూలంగా ముందుకు వెళ్లండి. మరికొంచెం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాను అనే విశ్వాసంతో ప్రయత్నం దిశగా అడుగులేయాలి. ఒకవేళ గతంలో విఫలం చెందితే అందుకు కారణాలు తెలుసుకుని, లోపాలు అధిగమించండి. ఆ ఓటమిని మరిచిపోండి.*


*జ్ఞానమే ఆయుధం*


   *ప్రతికూల ధోరణి తగ్గించుకుని, జ్ఞానం పెంచుకోవడానికి అధ్యయనంపై దృష్టి సారించండి. విస్తృతంగా చదవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, అవగాహన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి జ్ఞానానికి మించిన ఆయుధం లేదు. ఎంత ఎక్కువ పరిజ్ఞానం ఉంటే అంత మొత్తంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపూ దక్కుతుంది.*


*భయాలతో యుద్ధం..*


  *భయమే అత్యంత క్రూరమైన శత్రువు. అది విశ్వాసాన్ని దెబ్బకొట్టి, నిస్సహాయుల్ని చేస్తుంది. లక్ష్యాలను చేరుకోకుండా వెనుక్కి లాగుతుంది. భయాల నుంచి దూరంగా పారిపోకుండా వాటితో యుద్ధం చేయాలి. భయానికి కారణాలు తెలుసుకుని, ప్రయత్నం ద్వారా అధిగమించాలి. ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇస్తే నెమ్మదిగా మన బుర్రంతా వాటితోనే నిండిపోతుంది. కాబట్టి వాటిని అక్కడితో ఆపి సానుకూలంగా ఆలోచించండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.*


*ఇవి పాటించండి!*


*➤సానుకూలంగా మాట్లాడేవాళ్లతో ఒక సమూహంగా ఏర్పడండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. ప్రతికూలంగా మాట్లాడేవారికి దూరంగా ఉండండి.*


*➤గతంలో మీకు ఎదురైన ప్రతికూల ఫలితాలను గుర్తుతెచ్చుని బాధ పడకుండా వాటిని వీలైనంత త్వరగా మర్చిపోండి. గత వైఫల్యాల ప్రభావం లేకుండా చూసుకోవడం ముఖ్యం.*


*➤మీకంటూ ఓ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో నిష్పాక్షికంగా మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోండి. ఎక్కడ వెనుకబడుతున్నారు, అందుకు కారణాలు ఏమిటి, అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా.. వీటిని విశ్లేషించుకోవాలి. అందరికంటే ఎక్కువగా మీ గురించి మీకే బాగా తెలుస్తుందని గుర్తించుకోండి.*


*➤ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం లేదా విభాగంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు. మీరు ఎందులో సమర్థులో తెలుసుకోండి. అందులో మరింత పట్టుకోసం కృషిచేయండి.*


*➤మనసుకు నచ్చిన పనినే చేయడం వల్ల నమ్మకం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు రావు. అందువల్ల మీ లక్ష్యాలు ఎప్పుడూ మీ ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. ఏమాత్రం ఇష్టంలేని వాటిని కర్తవ్యంగా భావించినప్పుడు విఫలమవ్వడమే కాకుండా, మీపై మీకు నమ్మకం పోతుంది. దాని ప్రభావం మిగిలిన అన్నింటిపైనా పడుతుంది.*


*➤ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణాలు తెలుసుకోండి. ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడలేకపోవడం మీ సమస్య అయితే ఆ భాషను నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆ విషయంలో మీకంటే మెరుగైన వ్యక్తుల సహాయం తీసుకోండి. ఇలా ప్రతి సమస్యను అధిగమించడానికి ఉండే పరిష్కారాలు తెలుసుకుని ఆచరించండి.*


*➤ఆత్మవిశ్వాసం లోపిస్తే ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అది వెలుగులోకి రాదు. అదే సమృద్ధిగా ఉంటే అవసరమైనంత ప్రతిభ లేకపోయినప్పటికీ విజయాన్ని అందుకోవచ్చని తెలుసుకోండి!*

మా లెక్కల టీచర్

 మా లెక్కల టీచర్



కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ అందరినీ యాచిస్తూ కూర్చుని ఉంది .


ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ .....

ఈ పెద్ద ఆవిడని చూసి , మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ ..... దగ్గరికి వెళ్లి విచారించగా ,


అవును నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను వదిలేసి వేరే ఊర్లో వెళ్ళిపోయారు , 

వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు 

ఇలాగ బిచ్చమెత్తుకుంటున్న ను అని  దుఃఖంతో చెప్పింది. 


వెంటనే శిష్యురాలు కళ్ళమ్మట నీళ్ళు తిరిగి ,

ఆ పెద్దావిడని ఇంటికి తీసుకునివెళ్ళి .....

భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చింది. 


తరువాత టీచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి శాశ్వతంగా భద్రత ఉంచాలని ఆలోచించింది.


 వెంటనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన పూర్వ శిష్యులు వెంటనే స్పందించి అందరూ కలిసి భద్రతా గృహంలో ఉంచారు. తల్లిని పిల్లలు వదిలేసినా శిష్యులు మాత్రం వదల్లేదు..

శిష్యులందరికీ అభివందనాలు

Wednesday, October 25, 2023

అమెరికాలో భారతీయుడు

అమెరికాలో భారతీయుడు

Its a true story in USA 


Lets read .....


ఒక భారతీయుడు లోను కోసం అమెరికన్ బ్యాంకు

లోకి వెళతాడు.... 


తనకు చాలా అత్యవసరంగా ఐదు వేల డాలర్లు అవసరముందని తాను అన్ని ప్రదేశాలలో

మిత్రుల దగ్గరా అడిగానని ఫలితం లేకుండా పోయిందనీ.... 


తన కోటి రూపాయల "ఫెరారీ " కారును తాకట్టు పెట్టుకుని

తనకు ఆ

అయిదు వేలు ఇప్పించవలసిందిగా కేవలం వారం

రోజుల్లో తిరిగి తీరుస్తానని హామీ ఇచ్చాడు...


I am going to other state 


I will return after 5 days 

Then

Immediatly I will pay


ఈ బ్యాంకు వారికి చాలా ఆశ్చర్యం వేసింది

అస్సలు వీడికేమైనా పిచ్చి లేసిందా.. 


కోటి రూపాయల

కారును అంత ఛీప్ గా మరీ

ఐదువేలకు తకట్టు పెడుతున్నాడేంటి అని చాలా

సార్లు తర్జనభర్జనలు పడ్డారంట. సరే ఏమైతే అదైందిలే...


వీడు తీర్చలేకపొతే కారు మనదవుతుంది కదా అనుకుని...


మేనేజర్ కార్ తాళాలు తీసుకుని జాగ్రత్తగా పార్కింగ్ చేసి


సార్

మీరప్పుడైనా వచ్చి డబ్బు కట్టి మీకారు

తీసుకుపోవచ్చని

చెపుతాడు....


ఒక వారం గడుస్తుంది... ఆ భారతీయుడు తిరిగి

బ్యాంకుకు వచ్చి ఐదువేల డాలర్లకు వడ్డి $15.41

డాలర్లు కట్టి కారును తీసుకువెళ్ళేందు

కు సిద్ధమవుతాడు... 


ఇంతలో ఆ యువ బ్యాంకు

మేనేజర్

ఆసక్తి చంపుకోలేక “ సార్! మీరు కోటి యాభైలక్షల

కారు ను తాకట్టు పెట్టి కేవలం ఐదువేల డాలర్లు అప్పు తీసుకున్నారు...  


మీరు గట్టిగా

ప్రయత్నిస్తే తప్పక దొరికేవి కదా.. దీనిలో మర్మమేంటి" అని

అడిగాడు...


అప్పుడు మన భారతీయుడు... 


"సార్! విమానాశ్రయంలో

పార్కింగ్ కు దాదాపు ఈ వారం రోజులకు

ఐదువందల

డాలర్లు కట్టవలసి వచ్చేది.. ..


But


నేను ఇక్కడ

మీకు కేవలం $15.41 డాలర్లు మాత్రమే చెల్లించి

వారం రోజులు కారును చాలా జాగ్రత్తగా

ఉంచుకున్నాను...


విమానాశ్రయంలొ అయితే కొంచెం భద్రత/శుభ్రత

కూడా తక్కువ... 


ఇక్కడ మీరు చాలా బాగా చూసు

కున్నారు..

ధన్యవాదములు".. 

అని చెప్పాడు...


బ్యాంకు మేనేజర్ కు నోట మాటరాలేదు..


ఈ విషయం తెలిసిన ఒబామా మన భారతీయుల తెలివి

తేటలకు హతాశుడయ్యాడట...


ఇది అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన.

Tuesday, October 3, 2023

లూటీ మాల్

లూటీ మాల్

 కూకట్ పల్లిలో లులు మాల్ ను కస్టమర్లు దోచేశారు. అదేంటి కస్టమర్లు అంత పెద్ద మాల్‌ ను దోచేయడం ఏంటని బిత్తరపోతున్నారా. మీరు విన్నది నిజమే నండోయ్‌..లులు మాల్‌ ను మంత్రి కేటీఆర్‌ నాలుగురోజుల ముందు రిబ్బన్‌ కట్ చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దీంతో జనాలు లులు మాల్‌కి మూడు రోజులకు పోటెత్తారు. ఇసుకవేస్తే రాలే విధంగా జనాలు అక్కడకు చేరుకున్నారు. కాలుపెట్టే స్థలంకూడా లేనంతగా నగర ప్రజలు లులు మాల్‌ ను చూసేందుకు ఎగబడ్డారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా లెక్కచేయలేదు. అసలు కస్టమర్లు ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. మాల్ ఉన్న వస్తువులు ఫుడ్ మొత్తాన్ని తిని పడేస్తూ వెళ్లిపోయారు. ఫుడ్డు తో పాటు కూల్ డ్రింక్స్ సీసాలు మొత్తం ఖాళీ చేసి పడేశారు. కస్టమర్ల ఆగడాలను చూసి యాజమాన్యం విస్తు పోయింది. 


ఆదివారం కావడంతో నగరంలోని ప్రజలు లులు మాల్ ను చూసేందుకు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ వున్న సెక్యూరిటీ కూడా వాళ్లను కంట్రోల్ చేయలేకపోయాడు. బైక్ లు, కార్లు కూడా పెట్టడానికి స్థలం లేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తైతే లులు మాల్ నే కస్టమర్లు విపరీతంగా వాడేసుకున్నారంటే యాజమాన్యం మాత్రం బిత్తరపోయిందంటే నమ్మండి. కస్టమర్లు దేవుళ్లు అనే సామెత ఏమోగానీ.. కస్టమర్లు చేసిన హడావుడికి మాత్రం లులు మాల్ అంతా చెత్త కుండీలా మారింది. లులు మాల్ లో ఎక్కడ చూసిన చాక్లట్ కవర్లు, ఫుడ్ కవర్లు, కూల్ డ్రింక్ తాగేసి ఖాలీ చేసిన బాటిల్లు దర్శనమివవ్వడంతో యజమాన్యం తలలు పట్టుకుంటున్నారు. వామ్మో వీల్లు కస్టమర్లు కాదు.. ఇంతలా రాక్షసంగా ప్రవర్తించారేంటని విస్తుపోయారు. ఇప్పటికైనా ఫుల్ సెక్యూరిటీ పెట్టాలని, కస్టమర్లపై నిఘా పెట్టాలని పట్టిస్టంగా ఉండాలని రూల్స్ పెట్టాలని ఆలోచనలో పడ్డారు. మరి యూఏఈ తరహా లులు మాల్ పెట్టారు సరే కానీ నగరంలోని ప్రజలు మాస్ అని పాపం తెలుసుకోలేక పోయారు. కానీ ఇప్పటి కస్టమర్లకు రూల్స్ మాత్రం లులు మాల్ వెళితే మామూలుగా ఉండదండోయ్ కాస్త జాగ్రత్త మరి.


యూఏఈకి చెందిన లులు గ్రూప్ హైదరాబాద్ లో తొలి మాల్ ను ప్రారంభించింది. కూకట్ పల్లిలో లులు మాల్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ రిబ్బను కట్ చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో లులు మాల్ ను తీర్చిదిద్దారు. 75 దేశీ, విదేశీ బ్రాండ్ స్టోర్లు ఈ మాల్ లో ఉంటాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్, ఇలా కావాల్సినవన్నీ ఒకే చోట లభిస్తాయి. సినిమా ప్రియుల కోసం ఐదు స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో 1400 మంది సినిమాలను వీక్షించవచ్చు. నిత్యావసర వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, మాంసం, ఎలక్ట్రానిక్, ఐటీ వస్తువులు, మొబైల్స్, గృహోపకరణాలు ఇలా అన్ని ఈ మాల్ లో లభిస్తాయి. అలాగే పిల్లల కోసం ఎంటర్ టైన్ మెంట్ జోన్ కూడా ఉంటుంది. దేశంలో ఇప్పటికే ఐదు నగరాల్లో లులు మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఆరో నగరమైంది. బెంగళూరు, కోయంబత్తూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో లులు స్టోర్లకు విశేష ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ లులు మాల్ ను రోజుకు 30 వేల మంది సందర్శించవచ్చు. తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులలో భాగంగా లులు మాల్ ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు కస్టమర్లు చేసిన పనికి లులు యాజమాన్యం బిత్తరపోయేలా చేసింది.

Monday, October 2, 2023

పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు బంటి.

 పరీక్షకు  ప్రిపేర్  అయ్యాడు బంటి. 


English subject  లో  

" *My Friend* "   అనే విషయం  మీద  Essay   అడుగుతారు  🤔అనుకొని  బట్టీ పట్టి  ...పరీక్షకు వెళ్ళాడు .


  ఐతే పరీక్ష లో  ....

" *My  Father*" అనే విషయం లో essay  రాయమన్నారు .

  

  బంటి *My Friend*   ఉన్న దగ్గర *My Father*   గా మార్చి ...   essay  రాసాడు .


   Essay correction  చేసిన టీచర్  ఇప్పటి వరకు    unconsious  లో ఉన్నది .

 

  బంటి  రాసిన Essay  😩😊


I AM A VERY FATHERLY PERSON.


I HAVE LOTS OF FATHERS .


SOME OF MY FATHERS ARE MALE AND SOME ARE FEMALE. 


MY MOTHER IS VERY CLOSE TO MANY OF MY FATHERS.


MY UNCLE IS ALSO MY FATHER. 


MY TRUE FATHER IS MY NEIGHBOUR. 


AND I LOVE ALL MY FATHERS BECAUSE EVERY PERSON MUST HAVE A FATHER.😜

చదవడం ఓ కళ

  చదవడం ఓ కళ


సంసార విషవృక్షానికి రెండు అమృత ఫలాలు. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం అంటుంది హితోపదేశం. మానవ నాగరికతా వికాసంలో పుస్తక పఠనం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ భాషా వ్యవహర్తల్లోనైనా వారి విద్యా సాంస్కృతిక వారసత్వాన్ని అనుసరించి భాషాభివ్యక్తి నైపుణ్యాలుంటాయి. శ్రవణం, భాషణం, పఠనం, రాత అనే నాలుగు పద్ధతులుగా ఈ నైపుణ్యాలను వర్గీకరించారు నిపుణులు.


పుస్తక పఠనం ప్రగతికి సోపానం. పుస్తకాలు చదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులుగా, తత్వవేత్తలుగా, రాజనీతిజ్ఞులుగా, సంస్కర్తలుగా రూపొందారు. ‘పుస్తకాలు బురదగుంటలో పడిఉన్న నన్ను లేవనెత్తి నా ముందు విశాలమైన ప్రపంచ దృక్పథాలను సాక్షాత్కరింపజేశాయి’ అంటారు మాక్సిం గోర్కీ. పుస్తకాలు మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేస్తాయంటారు అంబేడ్కర్‌. ‘ఒక పెద్ద బ్యాంకులోకంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది’ అన్న రాయ్‌.ఎల్‌.స్మిత అనే విఖ్యాత రచయిత మాటలు అక్షరసత్యాలు.


పుస్తకం ఒక నేస్తం. మంచి పుస్తకం మంచి మిత్రుడు. పుస్తకాలు ఎందరో మంచి మిత్రుల్ని కూడా మనకు పరిచయం చేస్తాయి. మొత్తం మానవ సమాజం ఆలోచించినవి, చేసినవి, సాధించినవి... అన్నీ పుస్తకాల పుటల్లో దర్శనమిస్తాయి. అన్నిరకాల ఆధునిక ప్రసార మాధ్యమాలకన్నా పుస్తకం గొప్పది.


పుస్తకంలో ఒక బంగారపు ఇల్లు ఇమిడి ఉంటుందనేది చైనీయుల సామెత. నువ్వు జేబులో పెట్టుకుపోగలిగిన ఉద్యానవనం పుస్తకమని అరేబియన్‌ సామెత. మంచి పుస్తకం నీటి ఊట వంటిది. ఎన్నిసార్లు తాగినా మళ్ళీ తాగడానికి ఇంకా మిగిలే ఉంటుంది. పుస్తకాలు మెదడును తెరుస్తాయి. విశాలం చేస్తాయి. శరీరానికి వ్యాయామం ఎలాగో, మెదడుకు చదువు అలాంటిది. అది మెదడు శక్తిని పెంచుతుంది.


‘మనసుంటే మార్గముంటుంది’ అనేది లోకోక్తి. అబ్రహాం లింకన్‌ పట్టుదలతో చదువుకుంటూ ఎందరికో మార్గదర్శి అయ్యాడు. చదువు అతడి జీవితాన్నే మార్చివేసింది. మహాత్మాగాంధీని రస్సెల్‌, టాల్‌స్టాయ్‌ రచనలు ప్రభావితం చేశాయి. కందుకూరి వీరేశలింగం బహుగ్రంథకర్త. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో’మని చెప్పారు. నేటి యువత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పుస్తక పఠనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పరీక్ష కోసమే చదివే చదువు నిజమైన గ్రంథపఠనం కాదు. విజ్ఞానాన్ని, వివేకాన్ని, విశ్లేషణాశక్తిని కలిగించే పుస్తకాలు చదవడం ఏ తరంలోనైనా అనివార్యం.


ఏ పుస్తకం చదవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మంచి మిత్రుణ్ని ఎంచుకున్నట్లుగా మంచి రచయితను ఎంచుకోవాలి. క్షణికానందం కలిగించే పుస్తకాలుంటాయి. కలకాలం చదివి గుర్తుంచుకోదగిన పుస్తకాలూ ఉంటాయి. శాశ్వతంగా భద్రపరచుకోదగినవీ ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు అందిస్తూ జీవితాన్ని వికసింపజేసే పుస్తకాలూ ఉంటాయి. ‘కొన్ని పుస్తకాలు రుచి చూడాలి... కొన్ని మింగేయాలి... కొన్ని నమిలి జీర్ణించుకోవాలి’ అంటాడు ఫ్రాన్సిస్‌ బేకన్‌.


పుస్తక పఠనం ఒక కళ. ఏది చదివి గుర్తుంచుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలిస్తేనే పఠనకళలో నైపుణ్యం సాధించగలుగుతారు. ‘పుస్తకం హస్త భూషణం’ అనేది పాతమాట. అది కేవలం అలంకారప్రాయం కాదు. పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, సృజనాత్మకతను పురిగొల్పుతుంది. ఆధ్యాత్మిక గ్రంథపఠనం పరమాత్మకు సన్నిహితుణ్ని చేస్తుంది!


 

Saturday, September 30, 2023

ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య

 



*👉ఈ ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట.*


*😰 మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. 

కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని...*     


*ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది*     

*ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి... 

ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... 

ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... 

ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు... 

ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత...*     

*అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే... 

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. 

ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ... 

ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. 

ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.* 


     *కాబట్టి మీలో వున్న కెవిన్ ని చంపండి..👍*

Monday, September 18, 2023

విద్యార్థి ప్రశ్నలకు కంగు తిన్న ఉపాధ్యాయులు

 *🌍SAA*

స్కూల్ అసిస్టెంట్స్ అసోషియేషన్


*విద్యార్థి ప్రశ్నలకు కంగు తిన్న ఉపాధ్యాయులు* 

మీ విద్యార్థులు మిమ్మల్ని అడిగిన ఇలాంటి ప్రశ్నలు 9493696955 వాట్సాప్ ద్వారా పంపండి.

===================


ప్రభుత్వ పాఠశాలలలో కొంతమంది విద్యార్థులు  అడిగే ప్రశ్నలు *గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని తలపిస్తాయి.*_ 


_అలా ఒక ఉపాధ్యాయుడి Service లో ఎదురైన సంఘటనల ఆధారంగా విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలు మీ ముందు:_


 _*చంద్రునిపై కాలుమోపడం* నిజమే  అని నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే... పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు._

_ఒక్క.. సతీష్ గాడు తప్ప..., నమ్మిన మిగతా పిల్లలందర్నీ వాడు జాలిగా చూశాడు. నన్నూ, పేపర్ లోని అమెరికా వాళ్లు దిగిన చంద్రమండలం బొమ్మని మార్చి మార్చి చూశాడు. కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి._ 

 

_'నీ డౌట్ ఏంట్రా... అమెరికా వాళ్లు ఖచ్చితంగా చంద్రమండలానికి వెళ్లి వచ్చారు. అదే ఈ వార్త' అన్నాను._  *“నేను నమ్మట్లేదు సార్...”* _అన్నాడు ధృడంగా..._ *“ఎందుకురా... నువ్వేమైనా చూసొచ్చావా”* _అన్నాను కోపంగా. ప్రపంచమంతా ఒప్పుకుంటుంటే... వీడేంటి అన్న అసహనం పుట్టుకొచ్చింది._    *“చంద్రమండలం మీద గాలి లేదన్నారు కదా సార్... మరి అమెరికా వాళ్ల జెండా ఎలా రెపరెపలాడుతుంది?”* _అన్నాడు. ఖంగుతిన్నాను..._


_వాడి ప్రశ్న వందలాది వేట కొడవళ్లుగా మారి... అమెరికా వైపు దూసుకెళ్తున్నట్టు... అగ్రరాజ్యాన్ని నిలదీస్తున్నట్టు... కలవర పెట్టింది. వాడి మొహంలో చిద్విలాసం._ 

*నిజమే... ఇప్పుడు నాకూ నమ్మకం కలగట్లేదు.....*

_ఇరవై ఏళ్ళలో బదిలీపై ఏ ఊరికెళ్లినా ఆ ప్రశ్నలు వెంటాడుతాయి. ప్రశ్న వేసిన ఆ పిల్లల మొహాలు మర్చిపోలేనంతగా వేటాడుతాయి._ 


_పదేళ్లకింద చర్లపల్లె స్కూల్లో అలాంటి ప్రశ్నే ఎదురైంది..._

_నాకా ప్రశ్న వేసిన నాలుగో తరగతి చదివే *రమేష్* గాడి మొహం ఇప్పటికీ మనసులోంచి చెక్కు చెదరలేదు._


_అప్పట్లో నాలుగో తరగతి తెలుగు వాచకంలో ' *'కల్పవృక్షం'* అనే పాఠం ఉండేది. తాటిచెట్టు కల్పవృక్షం లాంటిది. తాటికమ్మలు గుడిసె వేసుకోవడానికి... తాటి ముంజలు తినడానికి... తాటి దోనెలు నీరు పారించుకోవడానికి... ఇలా తాటిచెట్టులోని ప్రతీది మనిషికి పనికొస్తుంది. ఇలా అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు... అంటూ పాఠాన్ని వివరించినప్పుడు...  చెబుతున్నంత సేపూ... రమేష్ గాడి మొహం చిన్నబోయింది. వాడి కళ్ళల్లో తడి... నేను అబద్దం చెప్తున్నట్టు కోపం... నాకేమి అర్ధం కాలేదు... “రమేష్... ఏమైందిరా...” అనడిగాను._


*“మా అయ్య రోజూ తాటికల్లు తాగొచ్చి అమ్మనూ, నన్నూ, తమ్ముణ్ని బాగా కొడతాడు.. తాటిచెట్టు మంచిదెట్లయితది సార్...”*

_వాడి ప్రశ్నకి... షాక్ తిన్నాను. నన్నే కాదు... విద్యావ్యవస్థనే ప్రశ్నించినట్లుంది వాడి ప్రశ్న. నిజానికి తాటిచెట్టు పాఠంలో 'కల్లు' ప్రస్తావన ఎక్కడా రాలేదు._ *తాటిచెట్టు* *కల్పవృక్షంతో పోల్చదగిందేనా...* 

_వాడికి నేను సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి...???_


_చివరకు *“తాటికల్లు మంచిదేరా... కాకపోతే ఓ కప్పుగాని, అరకప్పు గాని తాగితే మంచిది... కానీ మీ నాన్న కుండల కొద్దీ తాగుతాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు...”* అంటూ ఇంకొంచెం విపులంగా చెప్పాను. అయినా నా సమాధానం వాణ్ణి సంతృప్తి పర్చలేదు. అంతకు మించి చెప్పడానికి నాక్కూడా ఏం తోచలేదు. వాడు అయిష్టంగానే కూచున్నాడు._


*వాడి ప్రశ్న ఇప్పటికీ ఇలా వెంటాడుతూనే వుంటుంది.*


 _సుజాత టీచర్ ఓరోజు మూడో తరగతిలో *"బాతు - బంగారు గుడ్డు"* పాఠం చెప్పింది. ఒక బాతు రోజూ బంగారు గుడ్లు పెడుతుంటే... ఆత్యాశతో దాన్ని కోసి... యజమాని భంగపడ్డాడు అనే పాఠ్యాంశాన్ని చెప్పింది._

_తీరా ఒక పిల్లాడు వేసిన ప్రశ్నకి ఆమెకు చిర్రెత్తుకొచ్చి వాడి వీపు బద్దలు చేసింది. ఇంతకీ వాడు అడిగింది ఏమిటంటే...._

*“బాతుని కోస్తే తప్పేంటి టీచర్... బాతు కడుపులో గుడ్డు తయారవుతుంది కానీ... బంగారం తయారు కాదు గదా...! అందుకే బాతుని కోసి చూశాడేమో టీచర్... యజమాని తప్పేం లేదుగా? కాదంటారా?”* _అనడిగాడు._

 

 _ఈ మధ్య మా స్కూళ్ళ లో 'నిజాయితీ పెట్టె' లు పెట్టాలని విద్యాశాఖ సూచించింది. ఏ పిల్లవాడికైనా ఏదైనా దొరికితే దాంట్లో వేయాలి. టీచర్ దాన్ని తీసి అది పోగొట్టుకున్న పిల్లలకి అందజేస్తాడు. ఇది పిల్లల్లో నిజాయితీని పెంచుతుంది. పిల్లలు కూడా ఏవి దొరికినా ఉత్సాహంగా దాంట్లో వేస్తున్నారు. మొన్నీమధ్య *'తిరుపతి* నా పెన్ను దొంగతనం చేసాడు సార్' అంటూ రాధిక అనే అమ్మాయి నాకు కంప్లయింట్ చేసింది. “అవును... వాడు పెన్ను దొంగతనం చేసాడు సార్..” అంటూ పిల్లలందరూ చెప్పారు._

_తిరుపతి గాడిని పిలిచి అడిగితే మౌనంగా ఉండిపోయాడు. వాడి బ్యాగ్ తీసి పుస్తకాలు బయట పడేసి వెతికినా దొరకలేదు. చివరికి గట్టిగా అడిగితే... నేనే తీసాను అని ఒప్పుకున్నాడు. “ఎక్కడ దాచావురా” అని అడిగితే... నిజాయితీ పెట్టిని చూపించాడు. నాకు ఆశ్చర్యమేసింది._ 


_పెట్టెని తెరచి చూస్తే... రాధిక పెన్ను అందులో ఉంది._

_“దాంట్లో ఎందుకు వేసావురా?” అనడిగాను. “రోజూ అందరికీ ఏవేవో దొరుకుతున్నాయి. పెట్టెలో వేస్తున్నారు. నాకేం దొరకట్లేదు... అందుకే పెన్ను తీసి అందులో వేసాను” అని చెప్పాడు. నాకు బుర్ర తిరిగిపోయింది. పిల్లలందరిలోను ఒకటే ప్రశ్న..._

_తిరుపతి దొంగనా... నిజాయితీ పరుడా... దొంగతనం చేసాడు కాబట్టి... దొంగే కదా సార్... అన్నారు కొందరు. పెట్టెలో వేసాడు కాబట్టి నిజాయితీ పరుడే కదాసార్... అని మరి కొందరు పిల్లలు వాదించారు. చివరికి వాడు *నిజాయితీ పరుడే* అని వాళ్లని సమాధాన పర్చడానికి ఒక పీరియడ్ అయిపోయింది. ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలకి సమాధానం దొరక్క చాలా మంది టీచర్లు సహనం కోల్పోతారు._ 


 *ముఖ్యంగా తరగతి గదిలో దొంగతనం, కులం ఈ రెండు ఉద్రిక్తతని సృష్టిస్తాయి.*


 _అలాగే కులం ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు *వేదవతి* అనే పాప గుర్తొస్తుంది. శ్రీరాములపల్లె స్కూల్లో పని చేసేటప్పుడు... మధ్యాహ్న భోజనం సమయంలో ప్రతి మంగళవారం ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టేవాళ్లం._ 


_మూడో తరగతి చదివే వేదవతి అనే పాప మాత్రం తన ప్లేటులో వేసిన గుడ్డుని టీచర్లు చూడకుండా వేరే పిల్లలకి ఇచ్చేది. ఓసారి అది గమనించిన నేను హెడ్ మాస్టర్ కి చెప్పాను. ఆయన పాపని పిలిచి గుడ్డు తింటే గుండెకు బలం వస్తుందని బుజ్జగించి మరీ మరీ చెప్పటంతో చాలా ఇష్టంగా కోడిగుడ్డు తింది._ 


_ఆ తర్వాత వేదవతి నాల్రోజుల వరకూ పాఠశాలకు రాలేదు. అనుమానంతో నేనూ, హెచ్.ఎం. కల్సి వాళ్లింటికి వెళ్లాం. మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ దాడి చేసినంత వేగంగా కయ్యానికి దిగింది._

*“మేం బ్రాహ్మలం... మా పాపచేత  కోడిగుడ్డు తినిపిస్తారా... మీ స్కూల్ కి నా బిడ్డని చస్తే పంపించం.”* _అంటూ గొడవ పడింది. గుడ్డు తిన్న పాపానికి వేదవతిని బాగా కొట్టినట్టుంది. జ్వరంతో పడుకుంది. మమ్మల్ని చూడగానే భయంగా.... నీరసంగా లేచి నిల్చుంది._ 


_కోడిగుడ్డు శాఖాహారమే అంటూ మహాత్మగాంధీ చెప్పిన మాటలు కూడా ఆమె దగ్గర ఏం పని చెయ్యలేదు. చివరికి పాప చదువు పాడైపోతుందని, కోడి గుడ్డు తనకి పెట్టించమని మేం హామీ ఇచ్చాక గానీ బడికి పంపడానికి ఒప్పుకోలేదు._


_వేదవతి జ్వరంతోనే మర్నాడు స్కూల్ కొచ్చింది. వేదవతి మెల్లిగా తలొంచుకొని నా దగ్గర కొచ్చింది. “హోం వర్కు చేసావా?” అనడిగాను. మాట్లాడలేదు. నిమిషం సేపు నిశ్శబ్దంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ..._ *“మేమెందుకు కోడిగుడ్డు తినకూడదు సార్?”* _అనడిగింది. ఎవరో గుండెమీద సర్రున చరిచినట్లయింది నాకు... ఆ ప్రశ్నకు ఏ సమాధానం లేదు నా దగ్గర..._ 

_ఇంట్లో స్వేచ్చని చంపే ఆచారాలు బడిలో కూడా ఎంతగా ప్రభావం చూపిస్తాయో వేదవతి ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది._ 


_“దానికి బదులు నీకు అరటిపండు తెప్పిస్తాను సరేనా” అని భుజం తట్టి పంపించాను._


*_పిల్లల ప్రశ్నలకు మనసంతా నమ్మకం నిండేలా జవాబు చెప్పకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. వాళ్ల అనుమానంలోంచి పుట్టే ప్రశ్నకి రాగద్వేషాలుండవు._* 


_సి.నా.రె.కి జ్ఞానపీఠం అవార్డు వచ్చాక చాలామంది పండిత పామరులు రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసారు. ఓసారి స్కూల్ పిల్లలు కూడా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. మేధావులెవరూ అడగని ప్రశ్న ఒక పాప అడిగింది._

' *మీ పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి కదా. మరి మీ పేరు ముందు 'ఎస్' రావాలిగాని సి' ఎలా వస్తుంది?"* అని.

_ఆయన ఆశ్చర్యపోయారట... ఇప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్న... “పదో తరగతి మార్కుల మెమోలో 'ఎస్'కి బదులు 'సి' అనీ పడిందమ్మా అప్పట్నించి సి. నారాయణరెడ్డి అనే పిలుస్తున్నారు' అని నవ్వేసారట._  


_తరగతిగది లోపల పుట్టే ప్రశ్నలో నిజాయితీ ఉంటుంది._ *సమాధానం కూడా అంతే నిజాయితీగా లేనప్పుడు రానురాను వాళ్లు ప్రశ్నలు వేయటం మానుకుంటారు.* 


 *ప్రశ్నించే స్వేచ్చని పాఠశాలల్లో బాగా విస్తరిస్తే*  ప్రతి  పాఠ్యాంశం గురించి మేమంతా హోంవర్క్ చేసుకోవాల్సిందే...


*==================*

*(ఈ ప్రశ్నలకు జవాబు మీకెవరికైనా తెలిస్తే చెప్పండి)*

మన ఆరోగ్యం

 *💁🏻‍♂️ మన ఆరోగ్యం 👌 *

〰〰〰〰〰〰〰〰

*👉1. ఆయుర్వేద చిట్కా: దంత సంరక్షణ*


*మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. దంత సంరక్షణ చాలా అవసరమని ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుతం రకరకాల పేస్టులు వచ్చాయి. కానీ, పూర్వపు రోజుల్లో వేప బెరడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునే వారు. ఇలా చేయడం వలన వారి దంతాలు ఆరోగ్యంగా ఉండేవి.* *ఆయుర్వేదంలో కూడా వేపతోనే దంతాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజా వేపపుల్లతో లేదంటే, బొగ్గుతో పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.*


*👉2. మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా?*

*టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనలు నిరూపించాయి. అలా చేస్తే టీ రుచి, వాసన, టానిన్లను కోల్పోతుంది.* *చెడిపోయిన టీలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దాన్ని వేడి చేసి తాగితే అనారోగ్యం. హెర్బల్ టీని మళ్లీ వేడిచేస్తే పోషకాలు తగ్గిపోతాయి. ఇలా టీని ఎక్కువసార్లు వేడి చేసి తాగితే.. కడుపునొప్పి, అతిసారం, వికారంలాంటివి రావొచ్చు.*

*♨ 4 గంటలకు పైగా నిల్వఉంచిన టీని మళ్లీ వేడి చేసి తాగకండి*


*👉3. మైగ్రేన్‌కు ఇలా చెక్ పెట్టండి!*


*ఈ రోజుల్లో మైగ్రేన్ చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. రోజుకు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర కావాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, టైంకి భోజనం చేయాలి. కెఫెన్‌ కలిగిన పానీయాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగాలాంటివి సహకరిస్తాయి. తలనొప్పికి దారితీసే కారణాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండాలి. మెడిసిన్ రెగ్యూలర్‌గా వాడుతూ, అలవాట్లు మార్చుకోవాలి.*


*👉4. కిడ్నీ సమస్యలను ఇలా గుర్తించండి.*


1. *మూత్రం తక్కువగా రావడం.*

2. *రాత్రివేళల్లో అతిమూత్రం*

3. *మూత్రంలో నురుగు రావడం*

4. *ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు*

5. *ముఖం లేదా శరీరం ఉబ్బడం*

6. *హై బీపీ*

7. *మూత్రం ఎర్రగా లేదా కోలా రంగులోకి మారడం*

8. *చూపు మందగించడం*

❤ *రోజూ కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. పెయిన్ కిల్లర్లు అతిగా వాడొద్దు.*


*👉5. తిన్నాక నడక మంచిదేనా?*


*భోజనం తిన్న తర్వాత నడక మంచిదే అంటున్నారు పరిశోధకులు. తాజాగా 30 వేలమందిని వారం పాటు తిన్న తర్వాత నడిపించి శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాకింగ్ వల్ల వారిలో గుండెకు సంబంధించిన రిస్క్ 20 శాతం తగ్గిందట. గ్యాస్, ఎసిడిటీ సమస్యలూ తగ్గినట్లు గుర్తించారు. నడక వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి శరీరానికి పోషకాలు అందుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ నడక డయాబెటిస్ పేషంట్లకు మరీ మంచిదని స్పష్టం చేశారు.*

Thursday, August 31, 2023

భార్య కోపం

 🌼 భార్య  కోపం వలన, భర్త అర్థరాత్రి ఇంటి నుండి బయటకు పోవలసి వచ్చింది... దానివలన ప్రపంచ మానవాళికి విప్లవాత్మకమైన గొప్ప ఆవిష్కరణ జరిగింది.

✌️✌️✌️✌️✌️


*👍ఈ సంఘటన 2004లో జరిగింది. ప్రస్తుతం, గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఆ సమయంలో అమెరికాలో కెరీర్‌ను పెంపొందించు కోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకసారి అతని పరిచయస్థుల్లో ఒకరు అతనిని తన ఇంటికి భోజనానికి పిలిచారు. సుందర్ తన భార్యతో కలిసి వెళ్లాల్సి రావడంతో భార్యతో కలిసి ప్లాన్ వేశాడు. తను  ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఆఫీస్ అయ్యాక నేరుగా ఆహ్వానం పలికిన ఇంటికి భోజనానికి వెళతానని సుందర్ చెప్పాడు. ఇంటి నుంచి నేరుగా అక్కడికి చేరుకోవాలని భార్యను కోరాడు. భార్య ఇంటి నుండి నేరుగా డిన్నర్‌కి వెళ్లాలి మరియు సుందర్ పిచాయ్ ఆఫీసు నుండి నేరుగా భోజనానికి చేరుకోవాలి.*


*రాత్రి 8 గంటలకు విందు కార్యక్రమం. సుందర్ పిచాయ్ భార్య అంజలి తన కారులో రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు భోజనానికి హోస్ట్ ఇంటికి చేరుకుంది. సుందర్ పిచాయ్ కూడా ఆఫీస్ నుండి బయల్దేరి  వెళ్లిపోయాడు, కానీ అతను మార్గమధ్యంలో దారి తప్పిపోయాడు. అతను  అక్కడికి చేరుకునేసరికి దాదాపు 10 గంటలైంది. అప్పటికే  పిచాయ్  భార్య అక్కడి నుంచి రాత్రి భోజనం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు పిచాయ్‌ సాహిబ్‌ పరిస్థితి విషమంగా మారింది. కారణం, అమెరికన్లు సమయపాలన పాటించడం వల్ల విందు ఆచారాలన్నీ పూర్తయ్యాయి. సుందర్ పరిస్థితి విషమంగా అయింది.  అయితే హోస్ట్ పిచాయ్ రాకకు ఘన స్వాగతం పలికి గుడ్ బై చెప్పారు*


*అక్కడి నుంచి ఏమీ తినకుండానే సుందర్ పిచాయ్ తన ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి చేరుకోగానే భార్య అంజలి చిరాకుపడి అతనితో గొడవ పెట్టుకుంది, కారణం, అతను సమయానికి విందుకు  చేరుకోలేదు మరియు అతని భార్య అవమానించబడింది. అంజలి  మానసిక స్థితిని చూసిన సుందర్ పిచాయ్ మళ్లీ ఆఫీసుకు తిరిగి వెళ్ళడం  సముచితం అనుకున్నాడు. (భార్య కోపంతో ఇంట్లోకి రానివ్వలేదని కొందరు అంటున్నారు)*


*ఏమైనా సరే, ఇప్పుడు సుందర్ తిరిగి ఆఫీసుకు చేరుకున్నాడు మరియు రాత్రంతా అక్కడే గడిపాడు. రాత్రంతా ఇలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు - నాలాగే   రోజూ చాలా మంది దారి తప్పి పోయే అవకాశం ఉంది.  అదే విషయం రాత్రంతా ఆలోచిస్తూ, మ్యాప్ జేబులో పెట్టుకుని, దిక్కు కరెక్టుగా ఉంటే తను దారి తప్పేవాడిని కాదని అనుకున్నాడు.*


*మరుసటి రోజు ఉదయం సుందర్ పిచాయ్ తన టీమ్ మొత్తానికి ఫోన్ చేసి మ్యాప్ తయారు చేయాలనే ఆలోచనను అందరి ముందు ఉంచాడు. ఈ ఆలోచన విన్న టీమ్ చేతులు ఎత్తేసింది. టీమ్ అతని ఆలోచనను నమ్మలేదు, కానీ దాదాపు రెండు రోజుల పాటు టీమ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి, ప్రజలకు మార్గం చూపే ఉత్పత్తి(App)ని రూపొందించమని వారిని ఒప్పించాడు.*


*సుందర్ పిచాయ్ మరియు అతని బృందం కష్టపడి 2005లో గూగుల్ మ్యాప్‌ని తయారు చేసి అమెరికాలో ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే 2006లో ఇంగ్లండ్‌లో, 2008లో భారత్‌లో లాంచ్‌ చేశారు.. ఇప్పుడు వారు రూపొందించిన మ్యాప్‌లు యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపే పని చేస్తున్నాయని ఇప్పటికే మీకు తెలుసు. ఒక స్టడీ  ప్రకారం, మొత్తం ప్రపంచంలోని ప్రతి ఏడవ వ్యక్తి Google Mapsని ఉపయోగిస్తున్నారు.*


*కథ పెద్దదిగా ఉంది కదా! కానీ, ఇది నిజంగా జరిగిన సంఘటన.* 


 *కాబట్టి కొన్నిసార్లు మీ భార్య మీపై కోపం తెచ్చుకోవచ్చు.  చింతించకండి. ఆ కోపంలో భవిష్యత్తులో ఏదో ఒక చారిత్రక ఆవిష్కరణ దాగి ఉందేమో ఎవరికి తెలుసు!!!*

👏👏👍👍🙏🙏💐💐

Wednesday, August 23, 2023

కాబోయే టీచ‌ర్లు

 

కాబోయే టీచ‌ర్లు




'గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!'

రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌.

మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్‌ ఈ అబ్బాయి.

నా ఇంగ్లీష్‌ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్‌ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. ఇదొక్కటే నాతో ఎంత కష్టమనిపించినా వారి భాషను కూడా నేర్చుకునేలా చేసి వారికి దగ్గరిచేసింది. కొన్ని పోస్టులు సరైన క్యాండిడేట్లు దొరక్క మిగిలి ఉండిపోతాయి. అప్పుడు చివుక్కుమంటుంది. మిగతావాళ్లు మరికొంచెం బాధ్యత తీసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. వీళ్లలో ఎక్కువమంది ఇంగ్లిష్‌ మెథడాలజీ తీసుకుంటారు. ఎక్కువ పోస్టులు ఉంటాయి. సింగిల్‌ టీచర్స్‌ స్కూళ్లలో ఈసారి బ్యాచ్‌లో పది మంది ఉన్నారు. అందులో ఏడుగురు ఇంగ్లిష్‌ తీసుకున్నారు. అయితే సోషల్‌, లేదా లెక్కలు మొదటి మెథడాలజీ, రెండవది ఇంగ్లిష్‌. తెలుగు తీసుకోవడానికి ఇష్టపడరు వీళ్లు. అలాగని ఇంగ్లిష్‌ వచ్చని కాదు అస్సలు రానిది. ఇంగ్లిష్‌ తీసుకుంటే ఉపయోగం అని తర్వాత ఇంకా అభివృద్ధి ఉంటుందని.

'ఏమిట్రా... పొద్దున్నే' విసుగ్గా అన్నా నవ్వుతూనే. స్టాఫ్‌రూమ్‌ వైపు నడుస్తుంటే నాతో బాటే నడిచి వస్తున్నాడు తాను కూడా.

'ఏమిటి సంగతి వెంటబడ్డావ్‌?' నవ్వుతూ అడిగా.

' మరే మరండీ మేడమ్‌ ....'

'ఏంట్రా నసుగుడు, వెళ్ళండి అందరూ ప్రాక్టికల్స్‌కి తయారు అవ్వండి. నిన్న లెసన్స్‌ ఎలాట్‌ చేశాను కదా..!

వాటికి నే చెప్పిన మోడెల్స్‌ని తయారు చేస్కోవాలి. ఎక్స్‌టర్నెల్స్‌ కన్నా ముందు నా దగ్గర చెప్పాలి అర్థమైందా? ఏరీ మీ మిగిలిన మీ కాబోయే టీచర్లూ' ఎప్పుడూ వాళ్ళని కాబోయే టీచర్లనే అంటాను. అలా వారి చదువు గొప్పదనం గుర్తుచేస్తుంటాను. కొండ దొరలు అని కూడా అంటూ ఉంటాను. అలా వారి పెద్ద మనసుని మెచ్చుకుంటాను. నేను అంటే మిగిలిన లెక్చరర్స్‌ కూడా అలాగే అనడం, చివరికి స్టూడెంట్స్‌ స్టాఫ్‌ అందరూ వాళ్ళని అలాగే పిలుస్తారు. వాళ్ళు మాత్రం ఏమీ అనుకోరు. అసలేమైనా అనుకోవాలని కూడా తెలియని పుట్ట తేనియ అంత స్వచ్ఛమైన మనసులు వాళ్లవి.

'అదే మేడమ్‌ మాకిచ్చిన లెసన్స్‌ అన్నిటికీ మోడల్స్‌ తయారు చేసేసాం, కానీ ...మరి ....'

'అయితే ఇంకేం తెచ్చేయండి ఈ రోజు ఓ సారి ప్రాక్టీస్‌ చేసేసుకుందాం. అసలే రేపు మనకి వచ్చే ఇంగ్లీష్‌ ఎక్స్‌టర్నెల్‌ చండశాసనుడు అంట' బ్యాగ్‌ సొరుగులో పెట్టి నా బీరువాలో బుక్స్‌ తీయడానికి తాళం తీస్తున్న కొండా... ఒక్కసారి ఏడుపు మొదలు పెట్టాడు. 'హే కొండా! ఎందుకలా ఏడుస్తున్నావు?' నాకు చాలా జాలి అనిపించింది.

'అది కాదు మేడమ్‌! లెసన్‌ ప్లాన్స్‌ అన్నీ రాసేశాం. కానీ, లెసన్‌ చెప్పాలంటే భయంగా ఉందమ్మా'

వాళ్ళందరూ క్లాస్‌ బయట నన్ను అమ్మా అంటారు. క్లాస్‌లోనే మేడమ్‌ అంటారు. వాళ్ళ పట్ల నేను చూపే ఆత్మీయత బహుశా నన్ను వాళ్లకి దగ్గర చేసింది. అందరు స్టూడెంట్స్‌ తోనూ ఆత్మీయంగా ఉండటం నా మనస్తత్వం. భుజానికి కళ్ళు తుడుచుకుంటూ తాను అలా చిన్న పిల్లాడిలా చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది.

ఇది ప్రతి బ్యాచ్‌లోనూ నేను ఫేస్‌ చేస్తాను. వీళ్ళే కాదు, ఇంకా అసలు ఇంగ్లీష్‌ రాని వాళ్ళు కూడా మంచి అవకాశం వస్తుంది డీఎస్సీలో అని ఇంగ్లీష్‌ తీసుకుంటారు. కానీ, పాఠాలు చెప్పేదగ్గరికి వచ్చేటప్పుడు ఇలాగే డీలా పడిపోయి ఏడుస్తారు. ఒక్కొక్కసారి బాగా జ్వరం పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఎక్కువ ఇంగ్లీష్‌ వాళ్లకే ఎదురవుతాయి. మళ్ళీ లెక్కలు కానీ, సోషల్‌ కానీ, సైన్స్‌ కానీ ఎంత బాగా చెప్తారో..! తెలుగులో కదా..! ఈ కొండా చేతి రాత చూస్తే అసలు ఏ కాన్వెంట్‌లో చదువుకున్న వాడైనా పనికి రాడు, ముత్యాలు పేర్చినట్టు ఉంటుంది.

'కొండా, నువ్వు వరాలు, లచ్చుం నాయుడు, మీరంతా మొన్న నా దగ్గర బాగానే చెప్పారు కదా నాన్నా..! అలా భయపడితే ఎలా? నేనుంటాను కదా మీ పక్కనే' అనునయంగా అన్నాను.

'మే ఐ కమ్‌ ఇన్‌ మాడమ్‌' గుంపుగా పదిమంది ముగ్గురు ఆడపిల్లలు, ఆరుగురు మగ పిల్లలు అందరూ నా స్టూడెంట్సే గుమ్మం దగ్గర నిలబడ్డారు.

'యెస్‌ కమ్‌ ఇన్‌...! ఏంటర్రా అందరూ కట్ట కట్టుకుని వచ్చారు?'

'అదే మేడమ్‌ మీతో మాటాడాలి అని..' అందులో బాగా మాట్లాడేది ఎరికమ్మ. తాను సోషల్‌, ఇంగ్లీష్‌ అమ్మాయి. సోషల్‌ పాఠం ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా ఎంత బాగుంటుందో..! నేను నా పాఠాలు అయ్యాక సోషల్‌ పాఠాలు కూడా వింటుంటా. మంచి సామాజిక అవగాహన అన్వయంతో చెప్తారు పిల్లలు.

'ఏంట్రా మాటాడేది ఫైనల్‌ ప్రాక్టికల్స్‌లో మీ పాఠం నన్ను చెప్పమంటారా ఏంటి ?'

'అది కాదు మేడమ్‌ భయంగా ఉంది'

'ఓర్నీ భయమెందుకు నా దగ్గర చెప్పలేదూ, ఎలా సులువుగా చెప్పాలో మీకు నేర్పలేదూ నేను, మరి ఇప్పుడిలా భయపడితే ఎలా?'

'మీ దగ్గర చెప్పాలంటే ధైర్యంగా ఉంటుంది మేడమ్‌. కానీ, బయట వాళ్ల దగ్గర ....' నసిగింది దేవమ్మ. తాను లెక్కలు, ఇంగ్లీష్‌ స్టూడెంట్‌.

'భలే చెప్తున్నారు రా! మీరు.. ఎన్ని బ్యాచులు మీలాంటి వారిని పంపించాను. ఎన్ని సార్లు చెప్పాను. భయపడకూడదు అని'

'అవును మరి మీ దగ్గరైతే ధైర్యంగా చెపుతారు, మీరు ఉంటారు కనుక. మీకు ప్రతి బ్యాచ్‌కి ఈ ప్రహసనం అలవాటేగా' నవ్వుతూ అంది ఫిలాసఫీ లెక్చరర్‌. మమ్మల్ని అంటే బీ.ఎడ్‌ లెక్చరర్స్‌ని టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అంటారు.

'ఏం చేస్తాం మణీ! ఈ ఇంగ్లీష్‌ ఉందే ఇదొక మహమ్మారిలా భయపెడుతుంది.' నవ్వేను.

'కానీ, మీరు ఉండబట్టి ఎక్కువ మంది ఇంగ్లీష్‌ తీసుకుంటారు మరి. మీరు ఆ మహమ్మారికి భయపడకుండా చేస్తారుగా. అయినా మీరు ఉండగా వాళ్ళకు భయమెందుకు? ఓరు హలో! మీరు ముందు నా సబ్జెక్ట్‌ రికార్డ్‌ సబ్మిట్‌ చేయండి. లాస్ట్‌ డేట్‌ రేపే, మీకు తెలుసుగా రేపు గాని ఇవ్వక పోయారో ఎల్లుండి ఇచ్చినా చించేస్తాను.' బెదిరింపుగా అంది మణి. అనడం కాదు, ఆమె నిజంగానే చించేస్తుంది. ఆమె అంటే అందరికీ భయం కాలేజ్‌లో.

'మేము అందరం ఇచ్చేశాం మేడమ్‌' మమ్మల్ని ఎందుకు అంటావు అన్నట్లు ఉక్రోషంగా సమాధానం చెప్పింది సత్తమ్మ.

'ఊ సరే సరే పదండి నా క్లాస్‌ ఉంది' అంటూ నడిచింది మణి.

'వెళ్ళండి. మీరంతా క్లాస్‌కి కంగారు ఏమీ లేదు నేనున్నాగా చూసుకుంటా' అందరూ భయంగా నెమ్మదిగా క్లాస్‌కి వెళ్లేరు.


'ఏంటి మమ్మీ డల్‌గా ఉన్నావు స్ట్రెయిన్‌ ఎక్కువైందా కాలేజ్‌లో?' అడిగింది దివ్య.

'లేదురా, ప్రతి ఏడాది లాగానే మళ్ళీ ప్రాక్టికల్స్‌ రేపు. ఉదయం రోజూ కంటే చాలా

ముందరే బయల్దేరాలి. ఆరుగంటల బస్సుకే వెళ్తాను.'.

కాలేజ్‌కి రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి రోజూ, మేముండే సిటీకి

కాలేజ్‌ ఉండే చోటు సబర్బన్‌లో ఉంటుంది.

'ఓహౌ వచ్చేసిందా నీకు పరీక్ష రోజు! అబ్బా ఇప్పటికీ పదేళ్ల నుంచి చూస్తున్నాను.. వాళ్లకి పరీక్షలైతే నువ్వు కంగారు పడటం. ఆ మణి గారు, తెలుగు సార్‌, సోషల్‌ సార్‌, ఫిజిక్స్‌ ప్రసాద్‌ సార్‌ చూడు ఎంత హాయిగా ఉంటారో..! నువ్వు మాత్రం నా ఎగ్జామ్స్‌కి కూడా టెన్షన్‌ పడవు. కానీ, మీ కాలేజీ పిల్లల పరీక్షలంటే మాత్రం... అబ్బా లే మమ్మీ..! టీవీలో నీ ఫేవరెట్‌ సినిమా వస్తోంది. 'ముఘల్‌ ఏ ఆజమ్‌' చూద్దాం రా' చెయ్యి పట్టుకుని లాగింది పాప.

'ఏమి చేస్తాం రా! ప్రతి సారీ ఇదే ....' ఏదో చెప్పబోయాను.

'మాతా.. ధరణీ.. ఇంక మేము నీ సుత్తి భరించలేం గానీ లే..! సినిమా చూద్దాం' చెయ్యిపట్టుకుని లాగి నిలబెట్టింది పాప. నేను పడుతున్న బాధ తనకేం తెలుసు చిన్న పిల్ల. మౌనంగా హాల్‌లో టీవీ దగ్గరికి కదిలాను.


విద్య మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. విద్యా, ఆరోగ్యం ఈ రెంటినీ ప్రైవెటైజ్‌ చేయొద్దని మహామహులు చెప్పినా మన ప్రభుత్వాలు ఎల్పీజీ (లిబరలైజేషన్‌- ప్రైవేటైజేషన్‌-గ్లోబలైజేషన్‌) అంటూ చేయనే చేసింది. ఒక ఇంజినీరు మంచివాడు కాకుంటే ఒక బ్రిడ్జ్‌ కూలిపోతుందేమో..! కానీ, ఒక ఉపాధ్యాయుడు మంచివాడు కాకుంటే ఒక తరం పాడైపోతుంది. ఒక టీచర్‌ కనీసం 100 మందికి పాఠం చెప్తే ఆ పాఠాల్లో నాణ్యత లేకుంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు.. ఏమి చదువుతారు? ఇన్ని బి.ఎడ్‌ కళాశాలలు ఉండి కొందరు మంచి ఉపాధ్యాయులనైనా తయారు చేయగలుగుతున్నామా..! అన్నది నన్నెప్పుడూ వేధించే ప్రశ్న. బి.ఎడ్‌లో చాలా చిత్రమైన విద్యార్థులు వస్తారు. కొంతమంది డిగ్రీ నుంచి వస్తే.. మరి కొంతమంది పీజీ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంక ఏజ్‌ లిమిట్‌ ఎక్కువ ఉంది కనుక, కొందరు ఎప్పుడో డిగ్రీలు చేసి వదిలేసినా ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాస్త ఎదిగాక టీచర్లుగా ఉద్యోగాలు చేద్దామని చదవడానికి, పెళ్ళైన ఇల్లాళ్లు, పిల్లల తల్లులు వస్తారు. 'ఏంటి అమ్మా నీ కన్నా నీ స్టూడెంట్స్‌ పెద్దగా ఉన్నారు' అంటుంది పాప. ఇన్‌-సర్వీస్‌ హెచ్చార్స్‌ కూడా వస్తారు. అందరినీ స్టూడెంట్‌ టీచర్స్‌ అంటాం. మామూలుగా కాలేజ్‌ చదువు చెప్పినట్టు ఉండదు బి.ఎడ్‌. రకరకాల ఏజ్‌ గ్రూప్స్‌ కుటుంబ నేపథ్యాలు, ఇంకా కొందరు జీవితంలో నష్టపోయినవారు మళ్ళీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి వస్తారు. 

విడాకులు పొందిన అమ్మాయిలు, భర్తలు పోయినవారు, రకరకాల మనస్తత్వాలు. అందరినీ డీల్‌ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బాగా చదువుకునే మెరికల్లాంటి పిల్లలు కూడా ఉంటారు. అందరికీ డిగ్రీలోనో ఇంటర్మీడియట్‌లో చెప్పినట్టు ఒకే మూసలో చెప్పేయడం కుదరదు. కొందరు ఎంతో బాగా చదువుతారు, పాఠాలు చెప్తారు. నేను ఇంగ్లీష్‌ చెప్తాను, సైకాలజీ చెప్తాను. ఉపాధ్యాయులుగా వాళ్ళు పిల్లల మనస్తత్వాలను అర్థం చేస్కోవాలి. అందుకే, మనస్తత్వ శాస్త్రం. కానీ, అది నేర్పేటప్పుడు వీళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకుని నేర్పాలి. అందరి కంటే కాస్త వయసులో పెద్ద కనుక అందరినీ అర్థం చేసుకుంటాను కనుక, నన్ను మా స్టూడెంట్స్‌ అందరూ బాగా ఇష్టపడతారు. వాళ్ళని మంచి టీచర్లుగా తయారు చేయలేమా... అన్న ఛాలెంజ్‌ నాకు నేనే చేసుకున్నాను. అందుకే ఇంత ఆలోచన, శ్రమ.

ప్రతి బ్యాచ్‌ చివరి రోజు ఫేర్వెల్‌ నాడు.. ఒకటే చెప్తాను. 'డియర్‌ స్టూడెంట్స్‌ మీరందరిలోనూ మంచి టీచరు లక్షణాలు ఉన్నాయి. మీలో కొంతమంది డియస్సీ సాధించి ప్రభుత్వ టీచర్లు అవుతారు, కొందరు ప్రైవేట్‌ స్కూల్స్‌లో కార్పొరేట్‌ స్కూల్స్‌లో టీచర్స్‌ అవుతారు, వీళ్ళకి ఎలాగూ తప్పదు. బాగా చెప్పకపోతే తీసేస్తారు. కానీ, గవర్నమెంట్‌ టీచరు జాబ్‌ వచ్చిందా! మీరింక చదవరు.. నాకు తెలుసు, అయితే అందరికీ ఒకే మాట. మీరు గనుక టీచర్స్‌ అయితే దయచేసి అప్పుడప్పుడైనా సిన్సియర్‌గా పాఠాలు చెప్పండి ప్లీజ్‌. దేశ భవితవ్యం తరగతి గదుల్లో నిర్మింపబడుతుంది అని కొటేషన్‌ రాయడం కాదు, నిజంగా క్లాస్‌రూములు రాబోయే తరాలను తీర్చిదిద్దే ఆలయాలని గుర్తు పెట్టుకుని మసలుకోండి. ఇది నా సందేశం కాదు విన్నపం. ఇక్కడ మీరు ఏ పాఠాలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. దానికి ఇంకా మీ తెలివితేటలు కృషి జోడించితే మంచి ఉపాధ్యాయులు అవుతారు. జాతి నిర్మాతలవుతారు. నేనేదో ఉద్విగంగా మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారు. కానీ, మీ జీవితంలో మీ టీచర్‌ వృత్తిలో మీరెప్పుడూ నిత్య విద్యార్థిగా ఉంటే మంచి విద్యార్థులను తయారు చేయగలుగుతారు. అమ్మ ప్రేమ, నాన్న శిక్షణ రెండు అందించే స్నేహితుడిలాంటి మంచివారు టీచర్లు. మీ అందరూ మంచి ఉపాధ్యాయులుగా దేశానికి మంచి పౌరులను అందించేవారిగా కొనసాగాలని నా ఆశ, ఆశీర్వాదం..'

నా మాటలు ఊరికేపోవు కొందరు మంచి పేరు తెచ్చుకుని వచ్చినవాళ్లున్నారు. నేను పంపిన నాలుగో బ్యాచ్‌ అనుకుంటా... వాసు అనే అబ్బాయికి బెస్ట్‌ టీచర్‌ అవార్డ్‌ వచ్చింది. ఇలా ఎక్కడెక్కడో మా స్టూడెంట్స్‌ గురించి ఎవరెవరి నుండో వింటుంటాం. అదే ఈ వృత్తిలో ఆనందం తృప్తీ. అయితే వాళ్ళని పరీక్షలు పాస్‌ చేసేటప్పుడు మాత్రం చాలా సంఘర్షణకు గురౌతాను. ప్రాక్టికల్స్‌, రికార్డ్స్‌ మార్కులు ఏడువందల మార్కులు మా చేతిలో ఉంటాయి. అందుకే బి.ఎడ్‌ లెక్చరర్లు అంటే స్టూడెంట్స్‌ చాలా విలువ ఇస్తూ భయంగా మసలుతారు.

స్టూడెంట్స్‌కి అందరికీ మళ్ళీ పర్సంటేజ్‌ బాగుండాలి. రాత పరీక్షలలో తగ్గినా ప్రాక్టికల్స్‌లో అందరికీ ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు వేయాలి. పరీక్షల పేపర్లు కరెక్ట్‌ చేసేటపుడు కూడా ఇదే బాధ నాకు. ఎప్పుడూ ఒకటే ఆలోచన నన్ను వేధిస్తుంది. 'నాణ్యత లేని ఉపాధ్యాయులను తయారు చేసి దేశం మీదకి వదిలి ద్రోహం చేస్తున్నామా మేము.

(ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులం కదా) లేక కేవలం ఈ డిగ్రీ ఉంటే జీవనోపాధి కల్పించుకుని బతకాలనుకునే వారికి సహాయం చేస్తున్నామా? ఇదే ఎప్పుడు నా మదిని వేధించే ట్రిల్లియన్‌ డాలర్‌ ప్రశ్న! విద్యా నాణ్యతా ప్రమాణాలు గురించి పట్టించుకోని ప్రభుత్వాలు, అందుకే కార్పొరేట్‌ స్కూల్స్‌లో తమ పిల్లలను కడుపుకట్టుకుని చదివిస్తోన్న తల్లితండ్రులు. అలాగని పోనీ, కార్పొరేట్‌ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలు బాగున్నాయా అంటే... అదొక నరకకూపం పిల్లలకి. నూరి రుబ్బి పిల్లల్ని బండ మెషీనుల్లాగా తయారు చేస్తున్న మన విద్యా సంస్థలు. ఏ దేశం, ఏ వ్యవస్థ బాగుపడాలన్నా అది విద్య మీద కదా ఆధారం. అలాంటి విద్యని నాణ్యంగా ఎందుకు అందించలేకపోతున్నాం అన్నదే నా వ్యధ!!!


ప్రాక్టికల్స్‌ రోజు వచ్చిన ఎక్స్‌టర్నెల్‌తో మాట్లాడుతూ పిల్లలతో పాఠాలు చెప్పించేస్తాను నేను. ముందు బాగా చెప్పే వాళ్ళని ముందు పెట్టి, తర్వాత కాస్త వీక్‌గా ఉన్న వాళ్ళు చెప్పేటప్పుడు అవతలి వాళ్ళని మాటల్లో పెట్టి సర్దేస్తుంటాను.

మేము ఎలా చెపితే అలా మార్కులు వేసేస్తారు.. సహజంగా వచ్చినవాళ్ళు. ఎందుకంటే, వాళ్ళ కాలేజీలకి మేము వెళ్ళినా అంతేగా మరి. ఇలా మా పాస్‌ పర్సెంటేజ్‌ మాత్రమే మాకు కావాలి అంతే..! మా కాలేజీలు నడవాలిగా మరి.

ఈ బ్యాచ్‌లో నాకు యాభై మంది స్టూడెంట్స్‌. నిజానికి నేను గమనించాను వాళ్ళలో చాలా ప్రజ్ఞ, తపన ఉంటాయి కానీ, భయపడతారు. ఆ భయాన్ని పోగొట్టేమా వాళ్ళంత గొప్ప వాళ్ళు ఉండరు. వాళ్ళలో చదువు పట్ల గౌరవం, ఈ చదువు తాము చదివేసుకుని తమ పిల్లలను తీర్చిదిద్దుకోవాలనే తపన మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక్కడ పాఠాలు చెప్పలేకపోయినవాళ్ళు ఎందరో తర్వాత మంచి టీచర్లుగా ముఖ్యంగా ఇంగ్లీష్‌ టీచర్లుగా పేరు తెచ్చుకున్నారు.

'వావ్‌ ! ఏమి చెప్పిందండీ ఈ అమ్మాయి, నీ పేరేంటమ్మా?' వచ్చిన ఎక్స్‌టర్నెల్‌ పెద్దవారు.. సత్తమ్మ చెప్పిన టాగోర్‌ పద్యం ఎనిమిదో తరగతి పాఠం 'డే బై డే ఐ ఫ్లోట్‌ మై పేపర్‌ బోట్స్‌' విని చాలా సంతోష పడిపోయారు. 'ఇలా రామ్మా, అవునూ! సియులి ఫ్లవర్స్‌ అంటే పారిజాతాలు అని ఎలా తెలుసుకున్నావు?' వెంకట్రావు మాస్టారు చాలా సీనియర్‌ ఇంగ్లీష్‌ మాస్టారు ఆనాటి విలువలు ప్రమాణాలు పాటించేవారు. ఆయన అలా మురిసిపోతూ అడుగుతుంటే నాకు మనసు నిండిపోయింది. 'మా మేడమ్‌ చెప్పేరు సార్‌' సిగ్గుపడుతూ చెప్పింది సత్తమ్మ. 'సొ నైస్‌ ఆఫ్‌ యూ ధరణి గారూ ఇలా మీలా సిన్సియర్‌గా పాఠాలు చెప్పే వాళ్ళు ఇంకా ఎక్కడో అక్కడ ఉండబట్టే మన ఉపాధ్యాయ విద్యార్థులు నాణ్యంగా తయారువుతున్నారు. అందరూ మీలాగా సిన్సియర్‌గా చెప్తే మనం మంచి ఉపాధ్యాయులను అందించగలుగుతాం. 'ఐ కంగ్రాట్యులేట్‌ యూ' మనస్ఫూర్తిగా అన్నారు మాస్టారు. మా వెంకట్రావు మాస్టారు నుంచి అభినందన అంటే అవార్డ్‌గా భావిస్తాం మా టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అందరం. ఆ అమ్మాయి చెప్పిన పాఠం బట్టీ నన్ను అంచనా వేసి మెచ్చుకున్న మాస్టారిని చూస్తే నాకు ఆనందంతో మనసు నిండిపోయింది. మిగిలిన వారి పాఠాలను ఎలాగో గబ గబ చెప్పించేశాను అనుకోండి. మా సత్తమ్మ లాంటి వారి పాఠాలు విన్న మాస్టారు రిలాక్స్‌ అవుతుంటే కాస్త చెప్పలేని వాళ్ళు మా కొండ, ఇంకా మరి కొందరిచేత గబుక్కున పూర్తి చేసేసి హమ్మయ్య ఈ బ్యాచ్‌ దాటేసినట్టే అని ఊపిరి పీల్చుకున్నాను. నాకు వీళ్ల మీద నమ్మకం ఎక్కువ.. భవిష్యత్తులో మంచి టీచర్లు అవుతారని. ఒక్క అవకాశం ఇచ్చాం అంతే..! నా దేశాన్ని, భావితరాలను దిద్ది తీర్చే మంచి ఉపాధ్యాయులు, వారిని వారు దిద్దుకుని మంచి సంకల్పంతో.. వెనక్కి జారపడ్డాను కుర్చీలో.


Sunday, August 20, 2023

ఉపాధ్యాయుడు స్పందించాడు

ఉపాధ్యాయుడు స్పందించాడు,
ప్రాణాలు కాపాడాడు...
-----------------



పాఠశాల ప్రారంభమయ్యే సమయానికంటే అరగంట ముందే కంగారుగా వచ్చాడు తన తరగతి గది వద్దకు.....
ఎనిమిదవ తరగతి చదివే హరికృష్ణ...

కారణం...
ముందు రోజు తన బూట్లు అక్కడే గది బయట వదిలి మరచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ బూట్లు పోతే ఇంకోజత కొనలేని నిరుపేద కుటుంబం తనది. అందుకే అంత ఆత్రంగా వచ్చాడు. అవి అక్కడే ఉండడంతో ఆనందంగా వేసుకోవాలని కాలు దానిలో పెట్టాడు.

అప్పటికే అందులో ఒక నాగుపాము దూరి బూటు లో పడుకొని ఉంది. కాలు తనమీద పడగానే దానికి పారిపోయే అవకాశం లేక ప్రాణభయంతో కసితీరా కాటేసింది. ఎంత కసితో వేసిందంటే పాదం మీద కండ బయటకు వచ్చేలా.. హరికృష్ణ ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగా అమ్మా అని అరిచి బూటు ను విదిల్చాడు.

సరిగ్గా అప్పుడే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాషా గారు తన బైక్ లో పాఠశాల లోనికి ప్రవేశించాడు. హరికృష్ణ అరుపు విని బైక్ అక్కడే పడేసి పరుగున వచ్చాడు దగ్గరకు. నాగుపాము బూటు దగ్గరనుండి వెళ్ళడం గమనించి దానిని చంపేశాడు.. కాలు చూడగానే అర్థమైంది ఆయనకు పాము కాటేసింది అని. అందులోనూ విషపురుగు. ఆలస్యం చేస్తే ప్రాణం పోతుంది.

చుట్టూ చూశాడు..
ఇద్దరు విద్యార్థులు అప్పుడే లోపలకు వస్తున్నారు. వారిలో ఒకరిని రమ్మని తాను బైక్ స్టార్ట్ చేసి హరికృష్ణ ను కూర్చోమని ఆ తర్వాత ఇంకో పిల్లాడిని కూర్చోమన్నాడు. ఇంకో విద్యార్థికి హరికృష్ణ తల్లిదండ్రులకు విషయం తెలుపమని చెప్పాడు. 

క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరు విద్యార్థులను వెనకాల కూర్చొబెట్టుకొని బైకు ను ముందుకు దూకించాడు బాషా సర్.

పాఠశాల ఉన్నది చిన్న గ్రామమైన నగరూరు. హాస్పిటల్ ఉన్నది అక్కడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రి పట్టణంలో... అందులోనూ మూడు కిలోమీటర్లు రోడ్ సరిగాలేదు. నిమిషాల్లో హాస్పిటల్ కు చేరాలి. కాటు బాగా లోతుగా పడింది కాబట్టి విషప్రభావం వేగంగా ఉంటుందని అర్థమైంది. 

వెనక కూర్చున్న అబ్బాయికి తన మొబైల్ ఇచ్చి విద్యార్థులను కన్నబిడ్డలలా చూసుకునే  గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు Sana Sreenivasulu  గారికి కాల్ చేసి విషయం తెలుపమని చెప్పాడు. హరికృష్ణకు ధైర్యం చెపుతూనే బైక్ వంద కిలోమీటర్ల వేగంతో నడిపి పదిహేను నిమిషాల్లో తాడిపత్రి ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే శ్రీనివాసులు సారు తెలిసిన వారిద్వారా హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వలన వారు అప్రమత్తమై విద్యార్థికి వైద్యం అందించి ప్రమాదం నుంచి కాపాడారు.

కొన్ని నిమిషాలు ఆలస్యమైనా ప్రాణం పోయేదని బాషా సర్ సమయస్ఫూర్తిని, సాహసాన్ని కొనియాడారు వైద్య సిబ్బంది. కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, సహచర ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుని బాషా సర్ ను అభినందించారు.

15.08.2023 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల సిబ్బంది నన్ను అతిథిగా పిలవడంతో నాకు విషయం తెలిసింది. వెంటనే  శ్రీనివాసులు సర్ సహకారంతో బాషా సర్ ను సన్మానించడం జరిగింది. ధైర్యానికి ప్రతీక అయిన స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహూకరించాము.

స్వాతంత్ర్యాన్ని తెచ్చిన వీరులను మనం చూడలేదు కానీ చరిత్ర ద్వారా తెలుసుకొని అభినందిస్తున్నాము.సమయస్ఫూర్తి తో  విద్యార్థికి ప్రాణం పోసిన బాషా సర్ కూడా వీరుడే అని విద్యార్థులకు వివరించాను.

ఉపాధ్యాయుడు...విద్య మాత్రమే కాదు, విలువలు కూడా నేర్పాలి అని ప్రాక్టికల్ గా చూపించారు.

బాషా సర్.... 🙏

ఉపాధ్యాయుల గురించి నీచంగా, నిర్లక్ష్యంగా ఊహించుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని తెలియజేయాలనే తలంపుతో ఈ పోస్ట్ పెట్టాను. 
షేర్ చేసి పదిమందికి తెలుపగలరు. 

✍️....

👍👍👍👏👏👏👏

Tuesday, August 15, 2023

ఇలాంటి అధికారులు ఎంతమంది ఉన్నారు?

 #ఇలాంటి #అధికారులు ఎంతమంది ఉన్నారు?



తిరుపతి లోని *స్విమ్స్* ఆసుపత్రి  మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్ లోకి మీరు వెళ్తే టేబుల్ మీద కనిపించే దృశ్యం ఇది...

కానీ చాలామంది అధికారులు లెక్కకు మించి

అహంకారం చూపిస్తుంటారు..


వయస్సు 40 ఏళ్ళ లోపే ఉన్న చాలామంది

Ias, ips,irs అధికారులు ఇంకా బ్రిటిష్ కాలపు

నాటి బుద్ధులు పోనిచ్చుకోవడం లేదు..

మీరు ప్రజాలకోసమే పనిచెయ్యాలి అంతేగాని

మీ దర్పం అహంకారం మీ ఇంట్లో చుపించుకోండి

కనీసం వయస్సులో పెద్దవారినైనా కూర్చోపెట్టి

మాట్లాడే సంస్కారం నేర్చుకోండి


" *మీరు* *కూర్చున్నందుకు* *ధన్యవాదాలు* ... *ఇది* *మీ* *హక్కు* " అని ఇంగ్లీషులో టేబుల్ పై ఓ బోర్డు మనకు కనిపిస్తుంది... #కూర్చున్నందుకు ధన్యవాదాలు ఇది మీ #హక్కు అని ఎంత మంది అధికారులు చెప్పగలరు... చాలా కార్యాలయాల్లో 20 30 కుర్చీలు ఉన్నా కూర్చోమనడానికి అధికారులకు మనసొప్పదు... పేదవాళ్ళని నిలబెట్టి మాట్లాడటం... మహిళలను నిలబెట్టి మాట్లాడటం... తన కిందిస్థాయి వారిని నిలబెట్టి మాట్లాడటం ... తన హక్కులాగా భావిస్తూ ఉంటారు చాలామంది... వీటికతీతంగా డాక్టర్ రామ్ గారు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ మనకు కనిపిస్తారు ... అన్ని కార్యాలయాల్లో ఇలాంటి వాతావరణం రావడానికి అధికారులు ప్రయత్నించాలి...

Saturday, August 12, 2023

జండా ప్రవరతనా నియమావళి-2002

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి - 2002 (Flag Code of India) 

ముఖ్య లక్షణాలు

 భారత జాతీయ జండా భారత దేశ ప్రజల ఆశలను, ఆక ంక్షలను సూచిసుత ంది. ఇది 

మన జాతీయ ఆతమగౌరవ నికి ప్రతీక. స రవజనీన అభిమానం, గౌరవం మరియు

విధేయత కలిగిఉంది. ఇది భారత ప్రజల మనసుులలో భావోదేవగ లతో కూడిన ఒక 

ప్రతేయక స ా నానిి ఆకరమంచి ఉంది.

 జాతీయ గౌరవభంగ నిరోధక చట్టం-1971 మరియు భారత జాతీయ జండా ప్రవరతనా 

నియమావళికి లోబడి భారత జాతీయ జండాను ఎగురవేయుట్, ఉప్యోగించుట్ 

మరియు ప్రదరిశంచుట్ జరుగుత ంది. భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి

జనవరి 26, 2002 నుండి అమలులోకి వచిచంది. స మానయ ప్రజల అవగ హన కొరకు 

భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి- 2002 యొకక ముఖ్య లక్షణాలు కిరంది 

విధంగ ఇవవబడాా యి.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి- 2002 ని డిస ంబర్-30, 2021 

నాట్ి ఆదేశ ల ప్రక రం సవరించడం జరిగింది మరియు ప లిసటర్ లేదా మషన్ తో 

తయారు చేయబడా జండా అనుమతంచబడింది. జాతీయ జండాను చేతతో వడకిన 

లేదా చేతతో నేసిన లేదా మెషినుతో ప్తత/ప లిసటర్/ఉనిి/సిల్కక/ఖ్ాదీ తో 

తయారు చేయాలి.

 ప్బ్లి క్ లేదా ప్రయివేట్ు సంసా లేదా విదాయ సంసాల సభుయడు జాతీయ జండా 

గౌరవ నికి భంగం కలుగకుండా అనిి రోజులు, అనిి సందర ాలలోనూ 

ఎగురవేయవచుచను.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని ప ర్ట-II, పేర 2.2 యొకక (ix) 

నిబంధననిబంధనను జూల ై-19, 2022 ఆదేశ ల ప్రక రం భారత జాతీయ జండా 

ప్రవరతనా నియమావళి- 2002 ని కిరంది విధంగ సవరించడం జరిగింది.

(ix) ప్రజలు తమ ఇంట్ిప ై గ నీ ఆరుబయట్ గ నీ జండాను 

ప్రదరిశంచునప్ుడు ర డిర మరియు ప్గట్ిప్ూట్ ఎగురవేయవచుచను.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని పేర 1.3 మరియు 1.4 ప్రక రం 

జాతీయ జండా దీరఘ చత రస ర క రంలో ఉండాలి మరియు ఏ ప్రిమాణంలోన ైనా 

ఉండవచుచ క నీ పొ డవు వ డలుులు 3:2 నిషుతతలో ఉండాలి.

 జాతీయ జండాను బహిరంగ ప్రదేశ లలో వ తావరణ ప్రిసిాత లతో సంబంధం 

లేకుండా వీలయినంతవరకు సూరోయదయం నుండి సూర యసతమయం వరకు 

మాతరమే ఎగురవేయాలి.

 జాతీయ జండాను ప్రదరిశంచినప్ుడ అది ఎప్ుుడూ గౌరవ స ా నంలో(ఎత్తతన)

ఉండాలి విసుషటంగ ఉండాలి.

 నలిగిన లేదా చిరిగిన జండాను ఎగురవేయర దు, ప్రదరిశంచర దు


జాతీయ జండాను ఏ ఇతర జండా లేదా జండాలతో కలిపి ఏక క లంలో ఒకే వేదిక 

మీద ఎగురవేయర దు.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని ప ర్ట-III, స క్షన్ IX లో పేరకకని 

విధంగ జాతీయ జండాను భారత ర షటరప్త, ఉప్ ర షటరప్త, ప్రధానమంతర, గవరిర్ 

మొదల ైన ప్రముఖ్ులు తప్ు మరే ఇతర వ హనాలప ై జాతీయ జండాను 

ఎగురవేయర దు.

 జాతీయ ప్తాకం కంట్ే ఎత త గ లేదా ప ైన లేదా ప్కకప్కకన మరే ఇతర జండాల 

వేదికలు ఉండర దు.

 జాతీయ జండాను తలకిందులుగ అంట్ే క ష యరంగు కిందికి వచేచ విధంగ 

ఎగురవేయర దు. ఎవర ైనా వయకిత లేదా వసుత వుకు స లూయట్ చేసూత అవనతం 

చేయర దు. ఎదురవేయబడిన జాతీయ జండాప ై ప్ూలు, ప్ూలదండలు ఉంచర దు.

 జాతీయ జండాను తోరణం లాగ , ప్ూలదండ లాగ లేదా అలంకరణ వసుత వు లాగ 

ఇతర ఏ ప్దదతలోనూ ఉప్యోగించర దు. జాతీయ జండాను నేలప ైలేదా క లిబాట్ 

ప ై ప్రచర దు.

 జాతీయ జండాను పో డియంను లేదా వేదికను కప్ుడానికి వీలులేదు, ఎవవరూ 

కూడా నడుము కింది భాగప్ు దుసుత లుగ ఉప్యోగించర దు. కుషనుి, చేత 

రుమాళ్ళు, నేప్ కినుి, లో దుసుత లు మరియు డేరస్ మెట్ీరియల్క ప ై ముదిరంచర దు, 

ఎంబార యిడరీ చేయర దు.

 జాతీయ జండాను ప్రయివేట్ వయకుత ల అంతయకిరయలలో ఉప్యోగించర దు, జాతీయ 

జండాప ై అక్షర లు ముదిరంచర దు. వసుత వులను చుట్టడానికి, సవవకరించడానికి, 

ప్ంపిణీకి ఉప్యోగించర దు. వ హనాలప ై కప్ుర దు.

 జాతీయ జండాను అడాంగ ఎగురవేయునప్ుడు క ష యరంగు ప ై భాగంలో 

ఉండాలి. నిలువుగ ఎగురవేయునప్ుడు క ష యరంగు ఎగురవేసే వయకితకి ఎడమ 

వ ైప్ున ఉండాలి. జండాను ఎగురవేయునప్ుడు చురుకుగ ప ైకి లేపి దింప్ునప్ుడు 

న మమదిగ దింప లి.

 భారత ప్రభుతవం సూచించినప్ుడు తప్ు జాతీయ జండాను జండా సతంభం సగం 

ఎత త లో ఉంచర దు ఎలిప్ుడూ జండాను సతంభం ప ై భాగంలోనే ఉంచాలి.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి2002 లోని పేర 3.44 ప్రక రం కిరంద 

కనప్రచిన ప్రతేయక వయకుత లకు మాతరమే తమ క రిప ై జాతీయ జండాను ఎగురవేసే 

ప్రతేయక హకుకను ప్రిమతం చేయబడింది. ర షటరప్త, ఉప్ర షటరప్త, గవరిరుి, 

ల ఫ్ిటన ంట్ గవరిరుి, ప్రధానమంతర, కేందరకేబ్లన ట్ మంత ర లు, సహాయమంత ర లు, 

ర షటర లేదా కేందరప లిత ప ర ంతాల ముఖ్యమంత ర లు, కేబ్లన ట్ మంత ర లు, లోక్ సభ,


 జయసభ, ర ష టర ల శ సనసభ, విధానసభల సవుకరుి, డిప్ూయట్ి సవుకరుి, ర షటర 

మరియు కేందరప లిత ప ర ంతాలోి ని ఎమెమలేయలు, సుపవరం కోరుట, హ ైకోరుట ప్రధాన 

నాయయమూరుత లు, నాయయమూరుత లు తమ క రిప ై జాతీయ జండావు 

ఉంచుకోవచుచ.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి2002 లోని పేర 3.32 ప్రక రం 

జాతీయ జండాను ఇతర దేశ ల జాతీయ జండాలతో కలిపి ఎగురవేసే 

సందర్భాలలో, మిగిలిన జండాలను ఆంగి వరణమాల లోని అక్షర కరమంలో ఉంచాలి 

భారత జాతీయ జండాను వరుసలో కుడివైపున ఉంచాలి. జండాల వేదికలు సమాన ఎత్తు లో ఉండాలి.

 భారత జాతీయ జండా ప్రవర్తనా నియమావళి-2002 లోని పేర 2.22 ప్రకారం

జండా ప తబడి ప డ్ైపో యి ఉంట్ే జాతీయ జండా గౌరవ నికి భంగం కలగని  విధంగా దానిని తగులబెట్టడం కానీ, మరేదైనా ప్దదతిలో పూర్తిగా నాశనం చేయాలి.

సామాన్య ప్రజలకోసం తయారు చేయబడ్డ కాగితపు జండాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఓ ప్దదతి ప్రకారం పూర్తిగా నాశనం చేసేయాలి.

రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తింటే

 రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?


వంగాలను మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా సహాయపడతాయి. మనలో చాలా మంది ఇంటి చిట్కాలలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. లవంగాలను మసాలా దినుసులలో రారాజు గా పిలుస్తారు.

మసాలా వంటలకు లవంగాలను వాడుతూ ఉంటాం. అయితే మనలో చాలామందికి లవంగాలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. లవంగాలలో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

లవంగాల నీటిని తీసుకోవచ్చు లేదా రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. లవంగాల నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లవంగాలను వేయించి పొడి చేసుకొని నిలువ చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పొడి కలిపి తాగాలి.రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నమలాలి.

లేదంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. లవంగాలను ఎలా తీసుకున్నా సరే వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చలికాలంలో లవంగం తీసుకోవటం వలన జీర్ణక్రియను మెరుగు పరచుటమే కాకుండా అధిక బరువు సమస్య తగ్గటానికి సహాయపడుతుంది.

జీవక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దంత సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు ఉన్నప్పుడూ పంటి కింద లవంగం మొగ్గను పెట్టుకుంటే సరిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

గోర్లను ఈ రోజులలో మాత్రమే కత్తిరించడం

 గోర్లను ఈ రోజులలో మాత్రమే కత్తిరించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయా.

వైద్యశాస్త్రం ప్రకారం గొర్లు మరణించిన కణాలతో తయారవుతాయి. కానీ అవి మన చేతులు మరియు కాళ్ల అందాన్ని పెంచుతాయి. అదే సమయంలో మత గ్రంధాలలో గోర్లు మరియు జుట్టు గురించి చాలా ముఖ్యమైన విషయాలు వెల్లడించారు.

గోర్లు కత్తిరించే విషయంలో చాలా నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజు జ్యోతిష్యం ప్రకారం గోర్లు కత్తిరించడానికి సంబంధించిన ఆ నియమాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు మరియు గోర్లు శనికి సంబంధించినవి గోర్లు మరియు వెంట్రుకలు శుభ్రంగా ఉంచుకోకపోతే శని దేవుడికి కోపం వచ్చి ఆ శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.

దీనివల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే గోర్లు పరిశుభ్రత, గోర్లు కత్తిరించే రోజు, సమయం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.లేదంటే ఆ వ్యక్తి పేదరికంలో పడవలసి ఉంటుంది.గోర్లు కత్తిరించే విషయంలో మంగళ, గురు, శనివారాల్లో ఎప్పుడూ గోర్లను కత్తిరించకూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఇలా చేయడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయి. బలహీనమైన కుజుడు వివాహం, సంపద మరియు ధైర్యం లేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తాడు.

మరొకవైపు గురువారం గోర్లు కత్తిరించుకోవడం దురదృష్టాన్ని ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శనివారం రోజు గోర్లు కత్తిరించడం వల్ల శని గ్రహానికి కోపం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ధన నష్టం కలిగి పేదరికం వస్తుంది. అంతేకాకుండా అమావాస్య తిథిలలో గోర్లను కత్తిరించడం నిషేధించారు. చతుర్దశి మరియు అమావాస్య రోజున గోర్లు లేదా జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం వలన మనిషి పేదవాడు అవుతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమ, బుధ,శుక్ర, ఆదివారాలలో గోర్లను కత్తిరించుకోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే గోర్లను ఎప్పటికీ పగటిపూట మాత్రమే కత్తిరించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల పేదరికం దూరమైపోయి ఆ వ్యక్తికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.



Thursday, August 10, 2023

కండ్ల_కలక జాగ్రత్తలు

 కండ్ల_కలక_సమయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు


1.-మీ ఫ్యామిలీ డాక్టర్ సూచించిన విధంగా కంటి చుక్కలు లేదా లూబ్రికెంట్లను ఉపయోగించండి. ఓవర్-ది-కౌంటర్ ఉత్పత్తులను ఉపయోగించడం అస్సలు మంచిది కాదు.


2.- మీ కళ్లను చేతులతో తాకకండి. చేతులలోని బ్యాక్టిరీయా ఈ సమస్యను మరింత పెంచే అవకాశముంది. మీ కళ్లను నీళ్లు చిమ్మరిస్తూ.. శుభ్రం చేసుకోండి.


3.- ఎక్కువ నీరు తాగితూ.. హైడ్రేటెడ్​గా ఉండండి.


4.- కండ్లకలక సులువుగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి.. కండ్లకలక ఉన్నవారు ఒంటరిగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.


5.- కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే.. కళ్లకు షేడ్స్ పెట్టుకుని వెళ్లండి.


6.- కండ్లకలక సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి కంగారు పడే. వారు వైద్యుని సూచనలు కచ్చితంగా పాటించాలి.


#వ్యాధి_లక్షణాలు


           వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలొ మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.


నవీన్ చెప్పిన జాగ్రత్తలు


1.= కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.

2.- రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.

3.- రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.


4.-కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ ఫెక్షన్. ఇది ఒక అంటువ్యాధి, చేతి రుమాలు, తువ్వాలు ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడడం వలన, వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడం వలన తొందరగా వస్తుంది.


#చికిత్స :

        వ్యాధి సోకిన వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో తరచూ కళ్ళు కడగాలి. వీలైతే నల్లటి కళ్ళజోడు ధరించాలి. చేతి రుమాలు తుండుగుడ్డ ఇతరులని వాడనీయకూడదు. డాక్టరు సలహాపై కళ్ళలో మందు చుక్కలు వాడాలి.


ఒఫ్లక్షాసిన్ కంటి చుక్కల మందును 4 - 5 రోజులు వాడాలి .

సిట్రజిన్ (Tab-Cetzine) 10mg రోజుకి ఒకట చొ. దురద తగ్గినా వరకు 4-5 రోజులు వాడాలి .

జ్వరము , నొప్పి తగ్గడానికి నిమ్సులిడ్ మాత్రలు (Nimulid) 100 మగ్ రోజుకి రెండు చొప్పున్న 4-5 రోజులు వాడాలి .

ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటి బయోటిక్ మాత్రలు (Megapen) 250/500 మగ్ రోజుకి మూడు సార్లు 4-5 రోలులువాడాలి

#ధన్యవాదములు 🙏

 

*విజ్ఞప్తి*

******************

ఈ మెసేజ్ మీకు ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE