NaReN

NaReN

Tuesday, June 11, 2024

Success Story

Success Story


 *ఒకప్పుడు రూ. 5 కోసం .. ఇప్పుడు రూ. 125 కోట్ల కంపెనీకి యజమాని.. జ్యోతి రెడ్డి సక్సెస్ స్టోరీ..* 


కొన్ని విజయగాథలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. కష్టపడితే జీవితంలో పైకి రావచ్చనే దృఢ సంకల్పం పొందేలా చేస్తాయి. ఈమె సక్సెస్ స్టోరీ కూడా ఎంతో మందికి ప్రేరణ. ఒకప్పుడు ఇల్లు గడవక రూ. 5 కోసం కూలీ పనికి వెళ్లిన ఆమె, ఇప్పుడు ఏకంగా రూ. 125 కోట్ల కంపెనీకి యజమాని. వందల మంది ఈ కంపెనీ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సీఈఓ స్థాయికి ఎదిగిన జ్యోతి రెడ్డి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాగైనా తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలని జ్యోతి రెడ్డి నిశ్చయించుకుంది. ఉన్నత చదువులు చదవాలని డిసైడ్ అయింది. 1994లో డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత 1997లో కాకతీయ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందింది. ఉన్నత చదువు చదివినా కూడా నెల వారీ సంపాదన రూ. 398 గానే ఉండేది. ఆ డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోయేవి కాదు.


ఆ తర్వాత అమెరికాలో జ్యోతి రెడ్డి బంధువు ఒకరు అక్కడి అవకాశాల గురించి చెప్పారు. దీంతో ఆమె కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికాలో జీవనం సాగించడం కూడా చాలా కష్టమైంది. మొదట్లో పెట్రోల్ బంకులలో పని చేశారు. ఇతర కష్టమైన జాబ్స్ కూడా చేశారు. అయితే చివరకు ఆమెకు రిక్రూట్ మెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగం లభించడంతో బాగా స్థిరపడ్డారు. 2021 నాటికి 40 వేల డాలర్లు సంపాదించారు. దీనితో సొంత వ్యాపారం ప్రారంభించారు.


అమెరికా సంపాదించిన డబ్బుతో జ్యోతి రెడ్డి కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ మంచి లాభాలను అందిస్తోంది. దీని విలువ రూ. 125 కోట్లు. ఒకప్పుడు 5 రూపాయల కోసం కూలీ పనికి వెళ్లిన జ్యోతి రెడ్డి ఇప్పుడు రూ. 125 కోట్లు విలువ చేసే కంపెనీ యజమాని కావడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE