🔊 ఐఐటీలో సీటు.. కానీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్రమే చదువుతా...
న్యూఢిల్లీ : ఐఐటీలో సీటు పొందిన ఓ విద్యార్థి విలేకరుల ప్రశ్నకు వింత సమాధానం చెప్పాడు. తనకు ఐఐటీలో సీటు వచ్చినప్పటికీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్రమే చదువుతానని తేల్చిచెప్పాడు. హర్యానకు చెందిన అన్మూల్ అరిచ్వాల్ శుక్రవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 100 శాతం పర్సంటైల్ సాధించాడు. ఈ సందర్భంగా అన్మూల్ను విలేకరులు సంప్రదించారు. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఐఐటీలో 100 శాతం పర్సంటైల్ సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అని అన్మూల్ను ప్రశ్నించారు.
అయితే అతను చెప్పిన సమాధానం విని విలేకరులు షాక్ అయ్యారు. తనకు ఐఐటీలో సీటు వచ్చినప్పటికీ.. ప్రవేశం తీసుకోను అని తేల్చిచెప్పాడు. IISc Bangalore లో బీఎస్సీ మ్యాథమేటిక్స్ మాత్రమే చదువుతానని, ఆ సబ్జెక్టులో రీసెర్చ్ చేయాలనే ఆసక్తి ఉందని అన్మూల్ పేర్కొన్నాడు.
No comments:
Post a Comment