NaReN

NaReN

Tuesday, August 31, 2021

Nishta 2.0

 *🌍SAA*

*స్కూల్ అసిస్టెంట్స్ అసోషియేషన్*


*మిత్రుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో చదవాల్సిన మూడు మాడ్యూల్స్ (ఇంగ్లీష్  మరియు తెలుగు) లింక్ షేర్ చేయడం జరుగుతుంది కావున ఉపాధ్యాయ మిత్రులు వినియోగించుకోగలరు*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

NISHTHA 2.0 SEPTEMBER-2021 COURSES LINKS:

JUST CLICK and OPEN the links  in DIKSHA App to Join the course from 01-09-2021 to 25-09-2021 only


*English Medium:*

TS - C04 - Art Integrated Learning 

https://diksha.gov.in/learn/course/do_3133561272536924161253


TS-C05- Understanding Secondary Stage Learners

https://diksha.gov.in/learn/course/do_31335575649606041611663


TS - C06 - Health and Well-being

https://diksha.gov.in/learn/course/do_31335631186628608015008


*Telugu Medium:*

TS - C04 - కళల అనుసంధాన అభ్యసనం

https://diksha.gov.in/learn/course/do_31335402785946828813792


TS-C05 - సెకండరీ స్థాయి అభ్యాసకులను అర్థం చేసుకోవడం

https://diksha.gov.in/learn/course/do_3133561272536924161253


TS - C06 - ఆరోగ్యం మరియు శ్రేయస్సు

https://diksha.gov.in/learn/course/do_31335637549254246411370


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

 9848696955

Monday, August 30, 2021

ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పావా

 *ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పావా?*


ఎవరో ఏదో సహాయం చేస్తే, ఎంతో పొంగి పోయి కృతజ్ఞతలు చెఋతాం... కానీ ఇన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామా???

 

1) 640 కండరాలు 

2) 360 కీళ్ళు 

3) 206 ఎముకలు 

4) 33 వెన్నెముక ఎముకలు 

5) 22 పుర్రె ఎముకలు 

6) 32 పళ్ళు 

7) 24 పక్కటెముకలు 

8) గుండె యొక్క 4 గదులు 

9) 46 క్రోమోజోములు 

10) మెదడులో 100 బిలియన్ న్యూరాన్లు

11) 30 ట్రిలియన్ ఎర్ర రక్త కణాలు 

12) 7,000 తెల్ల రక్త కణాలు

13) 6 లీటర్ల రక్తం


ప్రతి రోజు

14) 800 మి.లీ చెమటలు ఉత్పత్తి 

15) 1,15,000 హార్ట్ బీట్స్ 

16) 23,000 శ్వాసలు

17) 60,000 ఆలోచనలు 


ఇంత గొప్పగా మనిషి శరీరం నిర్మించిన దేవుడికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామా???

Saturday, August 28, 2021

తెలుగంటే.....

 తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...పోతన్న

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే... గిడుగు రామ్మూర్తి

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకర్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య


తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రవి వర్మ

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే...ఉలవచారు

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...ఆంధ్ర, రాయలసీమ,

తెలంగాణ


*తెలుగంటే...తల్లిపాలభాష*

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే... మన సంస్కృతి, సంప్రదాయం

తెలుగంటే... మన ఆత్మగౌరవం

తెలుగంటే...నీవు నేను మనం

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ


*జై తెలుగు తల్లీ*...


తెలుగు భాషా పితామహుడు #గిడుగు_రామ్మూర్తి పంతులు గారికి అంజలి ఘటిస్తూ..🙏


తెలుగు భాషా ప్రేమికులందరికీ....

తెలుగు_భాషా_దినోత్సవ శుభాకాంక్షలు...


పసుపులేటి నరేంద్రస్వామి

9848696955

Friday, August 27, 2021

🎯 Daily Current Affairs

 

📚 Daily Current Affairs | 06-09-2021 📚


Q.1. Who has become the highest goal scorer football player?

Ans. Ronaldo


Q.2. Which industry will host the International Climate Summit (ICs) 2020-21 in India?

Ans. PHD Chamber of Commerce & Industry


Q.3. Which day is celebrated all over India on 5th September?

Ans. Teacher's Day


Q.4. India and which country have signed a project agreement for “Air-Launched Unmanned Aerial Vehicle” (ALUAV)?

Ans. America


Q.5. The 28th edition of bilateral naval exercise 'SIMBEX' between the Indian navies and which country has concluded?

Ans. Singapore


Q.6. Which Indian company has won the prestigious “Association for Talent Development (ATD) 2021 Best Award”?

Ans. POWERGRID


Q.7. In which state of India, the foundation stone of the first electric vehicle charging station has been laid so far?

Ans. Meghalaya


Q.8. Which electric service company has been honored with the prestigious Dun & Bradstreet - Corporate Award 2021?

Ans. SJVN


Q.9. In which ministry Dr. Munjapara Mahendrabhai, Minister of State for AYUSH has launched “AYUSH Aapke Dwar” campaign?

Ans. Ministry of AYUSH


Q.10. Which space agency's Mars rover has collected the first rock sample to return to Earth?

Ans. Blue Origin


📗 Daily Current Affairs  30-08-2021 



Q.1. Which day is celebrated on 29th August in India?

Ans. National Sports Day


Q.2. For the first time in the history of Maharashtra Congress, how many transgenders have also been given important responsibility?

Ans. Two


Q.3. Which state government has adopted Indian wrestling till 2032 Olympics?

Ans. Uttar Pradesh


Q.4. The first Indian to secure a medal at the Tokyo Paralympics, who created history by becoming a table tennis player?

Ans. Bhavinaben Patel


Q.5. Who got the 'Best Song' award at the Sixteen International Film Festivals - 16IFF 2021?

Ans. I bow to thi o mother


Q.6. Which is the 'Best Feature Fiction Film' at the Sixteen International Film Festivals - 16IFF 2021?

Ans. The Girl with the Goat


Q.7. Who got the award for 'Best Short Fiction Film' at the Sixteen International Film Festivals - 16IFF 2021?

Ans. Acce Mater


Q.8. Which country ended the evacuation operation in Afghanistan?

Ans. France


Q.9. Which city has reached the first place in the world in installing the most number of CCTV cameras per square mile?

Ans. Delhi


Q.10. Who got the National Award for Manufacturer of the Year Award?

Ans. Pyro and Hydro of Hindustan Zinc, Chanderia Lead Zinc Smelter, Dariba Zinc Smelter and Pantnagar Metal Plant.




🎯 Daily Current Affairs  27-08-2021 



Q.1. Which Indian artist will be honored with the Dadasaheb Phalke Award, the biggest award in the film world?

Ans. Superstar Rajinikanth


Q.2. Which day was celebrated across the world on 26 August?

Ans. International Women's Equality Day


Q.3. Information technology company Infosys became the fourth company in the country to touch the market capitalization level of how many billion dollars?

Ans. 100 Billion


Q.4. Who was awarded the title of Digital Marketing Guru of Rajasthan?

Ans. Mohit Patel


Q.5. In which sport did Australia's Pease Greco win the first gold medal of the Tokyo Paralympic Games?

Ans. Cyclist


Q.6. India has succeeded in building the world's highest road in Ladakh, this road has been built by which organization?

Ans. BRO (Border Roads Organisation)


Q.7. Joint training exercise 'Kajind-21' will be held between the armies of India and which country?

Ans. Kazakhstan


Q.8. Which eminent researcher and writer on caste studies passed away at the age of 81?

Ans. Dr. Gail Omvedt


Q.9. Which state of the country will be the one to bring 'Right to Health Bill' bill?

Ans. Rajasthan


Q.10. Which eminent tabla player passed away?

Ans. Pandit Shubhankar Banerjee


1. Who has been appointed by the Central Government as the Joint Secretary of the newly created Ministry of Cooperation?

Ans : Abhay Kumar Singh


2. The Uttar Pradesh government has announced to name the road leading to Ram Mandir after which former Chief Minister?

Ans : Kalyan Singh


3. Which scheme of Rs 6 lakh crore has been launched by the central government?

Ans : National Monetization Pipeline Scheme


4. Which former Indian footballer has passed away at the age of 82?

Ans : Syed Shahid Hakim


5. Where has the country's first smog tower been commissioned?

Ans : Connaught Place (Delhi)


6. Kanchana-3 actress and Russian model has died, what was her name?

Ans : Alexandra Xavi


7. Which senior officer has taken over as the new Secretary in the Ministry of Information and Broadcasting?

Ans : Apurva Chandra


8. How many new cases of corona have been reported in the country in the last 24 hours?

Ans : 25,467 (354 Deaths)


9. Competition Commission of India (CCI) has imposed a fine of Rs 200 crore on which company for its anti-competitive efforts?

Ans : Maruti Suzuki India


10. Due to Corona, which state government has refused permission to the Dahi Handi program to be held on Janmashtami?

Ans : Government of Maharashtra


బిపి లెక్క చూసుకోండి


*🔊బీపీ లెక్క మారింది 120/80 కాదు.. 140/90*




*🍥సాధారణ వ్యక్తులకైతే ఆలోపు రక్తపోటు ఓకే*


*♦️వరుసగా 2 రోజులుఆపరిమితికి మించి ఉంటేఅధిక రక్తపోటుగా పరిగణించి చికిత్స చేయాలి*


*♦️హృద్రోగాలు, రిస్క్‌ఫ్యాక్టర్స్‌ ఉన్నవారికైతే*


*♦️సిస్టోలిక్‌ పోటు 130 దాటితే జాగ్రత్తపడాలి*


*📝మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌వో*



న్యూయార్క్‌,  *🌏సైలెంట్‌ కిల్లర్‌గా పేరొందిన అధిక రక్తపోటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం సిస్టోలిక్‌ పోటు (హృదయ సంకోచ సమయంలో.. అంటే గుండె కొట్టుకున్నప్పుడు) 120ఎంఎంహెచ్‌జీ, డయస్టాలిక్‌ పోటు (హృదయం వ్యాకోచించినప్పుడు) 80 ఎంఎంహెచ్‌జీలోపు ఉండాలి. సిస్టోలిక్‌  పోటు 130కి చేరితే.. డయస్టాలిక్‌పోటు 80 దాటితే జాగ్రత్తపడాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బీపీ ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. సాధారణ ఆరోగ్యవంతులకు సిస్టోలిక్‌ పోటు 140ఎంఎంహెచ్‌జీ, అంతకు  మించి.. డయస్టాలిక్‌ పోటును 90ఎంఎంహెచ్‌జీ, అంతకు మించి వరుసగా 2 రోజులపాటు ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణించాలని పేర్కొంది. రిస్క్‌ ఫ్యాక్టర్స్‌.. అంటే పొగ తాగే అలవాటు, మద్యపానం, కష్టపడకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం, రోజుకు అరగంటైనా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వంటివి ఉన్నవారికి, హృద్రోగులకు సిస్టోలిక్‌ పోటు గరిష్ఠంగా 130 దాకా ఉండొచ్చని పేర్కొంది. సవరించిన మార్గదర్శకాలు అధికరక్తపోటు ఔషధాల పరిశ్రమపై పెనుప్రభావం చూపుతాయంటే అతిశయోక్తి కాదు.*




*💫వీటితో ముప్పు..*


*♦️బీపీ రావడానికి పలు కారణాలుంటాయి. వాటిలో కొన్ని మనం మార్చుకోదగ్గ రిస్క్‌ ఫ్యాక్టర్లు.. అంటే, అధికంగా ఉప్పు తినడం, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం తినడం, పండ్లు, కూరగాయలు తక్కువ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మద్యపానం, స్థూలకాయం, అధికబరువు. ఇవన్నీ మనం ప్రయత్నం మీద మార్చుకోగలవే. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానుకోవడం, రోజుకు అరగంటైనా చెమట పట్టేలా వ్యాయామం చేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం కాకుండా కాసేపు లేచి అటూ ఇటూ నడవడం, పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటూ కొవ్వుపదార్థాలను తగ్గించుకుంటే బీపీ ముప్పు తగ్గుతుంది. ఇక మనం మార్చుకోలేని రిస్క్‌ఫ్యాక్టర్లలో ప్రధానమైనది.. వంశపారంపర్యంగా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండడం. వృద్ధాప్యం, కిడ్నీ జబ్బులు, హృద్రోగాల వంటివాటివల్ల కూడా బీపీ పెరుగుతుంది. ఎలా వచ్చినా.. వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు తగిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పుచేర్పులు చేసుకుంటే అధిక రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవచ్చు.*






*🌻128 కోట్లు*


*🍥ప్రపంచవ్యాప్తంగా 30-79 ఏళ్లవారిలో దాదాపు 128 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా.*




*♦️46%*


*🌻అధిక రక్తపోటు బాధితుల్లో 46% మందికి తమకు ఆ సమస్య ఉన్నట్టు తెలియదు. అందుకే బీపీని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. 30 ఏళ్లు దాటాక తరచుగా బీపీ చెక్‌ చేయించుకోవడం మంచిది. 40 దాటినవారు తప్పనిసరిగా తమ రక్తపోటు స్థాయులను పరీక్షించుకుంటూ ఉండాలి.*




*🍥30 ఏళ్లలో రెట్టింపు*


*♦️ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితుల సంఖ్య గత 30 ఏళ్లల్లో రెట్టింపు అయినట్టు అంతర్జాతీయ పరిశోధకుల బృందం అధ్యయనంలో వెల్లడైంది. వారిలో అత్యధికులు పేద, మధ్య ఆదాయ దేశాల ప్రజలే.* 


*🌏1990 నాటికి ప్రపంచవ్యాప్తంగా 33.1 కోట్ల మంది మహిళలు, 31.7 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా.. 2019 నాటికి ఆ సంఖ్యలు మహిళల్లో 62.6 కోట్లకు, పురుషుల్లో 65.2 కోట్లకు పెరిగింది. ఈ అధ్యయన నివేదిక లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.*

సాయం చేయాలంటే తాహతు అవసరం లేదు

 సాయం చేయాలంటే తాహతు అవసరం లేదు


ఓ వ్యక్తి దగ్గరకు ఒక ఆమె వచ్చి  సర్ నా భర్త చనపోయాడు 

నాకు ఇద్దరు  పిల్లలు 

ఇన్నిరోజులు నేను నాలుగిళ్ళల్లో పనిచేస్తూ నా జీవనం సాగించాను 

ఇప్పుడు కరోనా కాలం కావడంతో నన్ను పని మాన్పించారు 

నాకు జీవనం పోయింది 

ఎలాగైనా నాకు ఒక కుట్టుమిషన్ ఇప్పించగలిగితే నేను నా జీవనం సాగిస్తానని చెప్పింది  

అతను అదే విషయాన్నీ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా 

ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది 

వారు నిజంగానే సహాయం పొందడానికి అర్హులేనా అని అడిగారు 

అవునండి అని సమాధానం చెప్పడంతో సరే నేను కుట్టుమిషన్ తీసిస్తాను మీ నెంబర్ కు డబ్బులు పంపిస్తాను అని చెప్పాడు 


వద్దు సర్ మీరు ఆ కుట్టుమిషన్ ఉన్న షాప్ యజమానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అతని నెంబర్ ఇచ్చాడు 


చిన్న ఆటో మాట్లాడుకుని వెళ్ళి కుట్టుమిషన్ తీసుకుని వారికి ఆ మిషన్ కు సంబంధించి దారాలు సూది ఇతర అవసరమైన వస్తువులతో పాటు నెలకు సరిపడే సరుకులు తీసుకుని వెళ్ళి ఆమె ఇంటి ముందు ఆగగా ఆమె ఆశ్చర్యపోయి కనీళ్ళు పెట్టుకుంది 


ఆమెకు సాయం చేసిన వ్యక్తిని చూపించడం కోసం వాట్సాప్ వీడియో కాల్ చేయగా అవతలి వ్యక్తిని చూసి ఆశ్చర్యం 

ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా బాగా సెటిల్ అయిన వ్యక్తి అయిఉంటాడని అనుకున్న అందరికి ఆశ్చర్యం 


అతను 25 ఏళ్ళ పిల్లాడు ఒక సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ టీ అమ్ముతున్నాడు 

అతని యజమాని ఎవరైనా సాయం చేస్తున్నారేమో అని వెతికాడు ఎవరూ లేరు 


ఇప్పుడు అతడి గురించి ఆరా తీయాలనే ఆలోచన పెరిగింది 


చిన్న తనంలోనే తల్లితండ్రిని పోగొట్టుకుని ఆకలి బాధను అనుభవించాడు 

పుట్టిన ఊరు వదిలి వచ్చాడు నా అనేవాళ్ళు లేకపోవడంతో 

ఇలా కష్టపడి పనిచేస్తూ వచ్చాడు ప్రతిరోజు అతను 20 మందికి ఆకలి తీర్చడం మొదలుపెట్టాడు 

ఇతడి గురించి తెలుసుకున్న ఎంతోమంది సహాయం చేయ ముందుకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించి ఆ సహాయాలను నిజంగా అర్హులైన వారికి వారిచేత ఇప్పిస్తుంటాడు 


అతడి  ఆలోచనకు సలాం 

అతడి నిస్వార్థపు సేవకు నమస్కరిస్తున్న 


కష్టం తెలిసినవాడు ఆ కష్టాన్ని తీర్చాలని ముందుకు వచ్చాడు నిజంగా నిజాయితీగా కష్టపడేవాళ్ళకు దేవుడు ఎప్పుడూ తోడు ఉంటాడు 


🌹నా హృదయం 🌹


సాయం చేసే మనసు ఉండలికాని ధనిక పేద చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు.

Wednesday, August 25, 2021

పాఠశాలకు పంపాలనుకునే తల్లిదండ్రులందరికీ

 గౌరవ తల్లిదండ్రులందరికీ,


సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల పాఠశాలలు తెరవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

కాబట్టి మన గ్రామంలో కూడా అన్ని పాఠశాలలు ప్రారంభం అవుతాయి.


అయితే కరోనా పూర్తిగా తొలగి పోలేదు. కాబట్టి ఎంత కాలం పాఠశాలలు నడుస్తాయి అనేది చెప్పలేము. *కాబట్టి ఇలాంటి సమయంలో ప్రైవేట్ పాఠశాలలలో పిల్లలను చేర్చి, ఆర్థికంగా నష్టపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి*


అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కరోనా సమయంలో మరెన్నో ఇబ్బందులు


# చాలా ఇరుకు తరగతి గదులు.


# గాలి, వెలుతురు రావడానికి  వీలులేని పరిస్థితులు.


 #ఒకే తరగతి గదిలో 30, 40 లేదా 50 మంది విద్యార్థులు.


# ఫీజులే ముఖ్యంగా భావించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించకుండా అందర్నీ ఖచ్చితంగా ప్రతీ రోజూ బడికి రప్పించడం.


#సిలబస్ చెప్పడానికి సమయం సరిపోవడం లేదు అంటూ అనారోగ్య లక్షణాలు ఉన్న విద్యార్థులను గుర్తించక, ఒకరి సమస్యని అందరికీ వ్యాపింపజేసే నిర్లక్ష్యం...


ఇంకా వేరే ఊర్లో ని బడికి పంపించినప్పుడు,  ఆర్టీసీ బస్సులు లేదా స్కూల్ బస్సులలో మరింత వేగంగా పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం.


*ఇన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి ఈ సంవత్సరం ఇంకా వీలైతే తర్వాత సంవత్సరం కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపగలరని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి*


అదే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే


 #విశాలమైన తరగతి గదులు


# ప్రతి తరగతికి 2/3 కిటికీలు 


# విశాలమైన ఆవరణ


#పిల్లల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తరచుగా ANM లేదా ఆశా వర్కర్స్ చేత హెల్త్ చెకప్.


#అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతుల నిర్వహణ.


# ఈ నెలలో వేలు/ లక్షలు ఫీజులు వసూలు చేసి, వచ్చే నెలలో పాఠశాల మూత వేసే పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడూ ఉండవు.


ఇవన్నీ మీరు అర్థం చేసుకొని, మీ పిల్లలనే కాకుండా  మీ ఇంటి చుట్టుముట్టు ఉండే పిల్లల్ని కూడా వెంటనే ప్రభుత్వ పాఠశాలలో  చేర్పించి, మీ డబ్బుని మీ పిల్లల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడుకోవాలని కోరుతున్నాము.


నోట్: ప్రస్తుతం విద్యార్థుల పేర్లు అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రైవేట్ పాఠశాలలో TC తీసుకుని, ప్రభుత్వ పాఠశాలలో చేర్చగలరు. లేదంటే ఈ సంవత్సరం కూడా మీకు ఫీజుల భారం తప్పదు.

Tuesday, August 24, 2021

24.08.2021 words per day

 🆂🆄🅲🅲🅴🆂🆂 

🅻🅸🅵🅴


Words for a

Positive day ❣️


🔐 *A* is for Appreciation


🔐 *B* is for Blessed


🔐 *C* is for Curiosity


🔐  *D* is for Dream


🔐 *E* is for Experience


🔐 *F* is for Fabulous


🔐 *G* is for Goodwill


🔐 *H* is for Hello


🔐 *I* is for Idea


🔐 *J* is for Joy


🔐 *K*  is for Kind


🔐 *L* is for Laugh


🔐 *M*  is for Motivation


🔐 *N* is for Now


🔐 *O* is for Oomph


🔐 *P* is for Possible


🔐 *Q* is for Quiet


🔐 *R* is for Ready


🔐 *S* is for Self-Care


🔐 *T* is for Thankful


🔐 *U* is for Uplift


🔐 *V* is for Visualise


🔐 *W* is for Worth


🔐 *X* is for X-FactorY is for Yes


🔐 *Z*  is for Zest

Monday, August 23, 2021

గురువుగా ఉండటం మీరు ఎందుకు "గర్వంగా ఫీలవుతారు" ? ? ?

 👉 *ఒక ఉపాధ్యాయుడిని ఎవరో అడిగారు.*


*గురువుగా ఉండటం మీరు ఎందుకు "గర్వంగా ఫీలవుతారు" ? ? ?*


*అందుకా ఉపాధ్యాయుడు నవ్వుతూ....*


*ఒక న్యాయవాది యొక్క ఆదాయం సమాజంలో నేరాలు మరియు వ్యాజ్యాల పెరుగుదలతో పెరుగుతుంది.*


*ఒక వైద్యుని యొక్క ఆదాయం ప్రజల వ్యాధి /అనారోగ్యం పెరుగుదలతో పెరుగుతుంది.*


*కానీ... మా ( గురువు ) ఆదాయం మాత్రం...*


*ప్రజల యొక్క జ్ఞానం, శ్రేయస్సు మరియు దేశ అభివృద్ధి పెరుగుదలతో పెరుగుతుంది...!!!*


*Yes,* 

*అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్విస్తాం !*

👍👍👍👍👍👍👍👍


*పంతుళ్ళం కాదు...*


*మేం "తరాల" తయారీదారులం...*

*(Teachers : Makers of Generations).*


**************

*ఏముంది పంతుళ్ళు...*

*ఏదో వస్తరు.... పోతరు...*

*నాలుగు మాటలు తోచింది చెప్తరు...*

*లేకుంటే సెలవులు....ఇదీ సమాజంలో ఉపాధ్యాయులపై చిన్న చూపు.*

😢 😢 😢 😢 😢


*కానీ దానికి భిన్నం... మా వృత్తి.*


*ఇంట్లో ఇద్దరు పిల్లలను ఒక్క 4, 5 గంటలు భరించలేని తల్లిదండ్రులు...*

*పిల్లల బళ్లకు పంపితే ( వెల్లగొడితే )...*

🙊 🙊 🙊 🙊 🙊


*ఉదయస్తమానం 10 గంటలు ప్రతి పిల్లవాడిలో మా పిల్లల చూసుకుంటూ వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ, మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను, యాక్టర్లను, ఇంజినియర్ లను, పోలీసులను, కలెక్టర్లను, లాయర్లను, టీచర్లను, నాయకులను, అధికారులను...*


*ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా "తరాలు", "తరాలు" తయారుచేసే నిత్య విద్యార్థులం మేము.*


*మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.*

*చెమటను సాక్ష్యం గా చూపడానికి...*


*మా పనులు బురదలోనో, ఖార్ఖానా లో చేసేవి కావు. బట్టలకంటిన మురికిని చూపడానికి....*


*మా పనులు మూసలు కావు,*

*మోసాలూ కావు.*

*ఏ రోజుకారోజు కొత్తే...*


*పిల్లాడు పిల్లాడికి కొత్తే...*

*ఏ రోజుకారోజు సమస్యలూ కొత్తే...*


*మా వనరులు పిల్లలు మాత్రమే...*

*మా పని చదువొక్కటే కాదు, జీవితాలు తీర్చిదిద్దుడు కూడా...*

*ఏ రోజుకు ఆ రోజో, నెలకో, ఏడాదికో ఫలితాన్ని చూపే కూలీలమో, రైతులమో,  అధికారులమో కాదు సుమా ! ?*

👏 👏 👏 👏 👏


*"తరాన్ని" తయారు చేస్తూపోతాం...*

*ఆ యజ్ఞం లో సమిదలవుతం...*

 *ఎలాంటి ఫలితాన్ని ఆశించని నిత్య కార్మికులం...*

*మా చేతుల్లో నుండి ఒక్క పనికొచ్చే మనిషి  తయారైన అదే మాకు లక్షలు, కోట్లు...*


*పుణ్యానికి చేస్తారా అని అంటారా ?*

*మీ ఇంట్లో ఉన్న మీ స్వంత ఇద్దరు పిల్లలనే బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచండి... పెంచండి... విద్య నేర్పండి... బుద్ధులు నేర్పండి... విలువలు నేర్పండి... గొప్ప మేధావిని చేయండి... గొప్ప అధికారిని కనీసం ఒక సమాజానికి పనికొచ్చే వ్యక్తినో, ఆఖరికి సమాజాన్ని గాడిలో పెట్టే సాధువునో, సన్యాసినో చేయండి...*


*అప్పుడు ఒక గురువు గుర్తుకొస్తాడు...*

*అప్పుడే ఒక ఉపాధ్యాయుడు గుర్తుకొస్తాడు...*


*అప్పుడే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆథ్యాత్మికంగా, ఉద్వేగాల, భావాల పరంగా, అన్ని విధాలా శిక్షణ ఇచ్చే ఒక బడి గుర్తుకొస్తుంది...*


*ఎందుకండి...?*

*కూర్చున్న కొమ్మను నరుకుతరు ? !*

👏 👏 👏 👏 👏


*అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి...*

*అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ, పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు చూపలేని నిస్సహాయులం...*

😢 😢 😢 😢 😢


*మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు...*


*కించపరచకండి...*

😢 😢 😢 😢 😢


*మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు...*

*తూలనాడకండి...*

😢 😢 😢 😢 😢


*మాతోనో, మా సంతకంతోనో పని ఉంటే కదా ! అంటారా ?*


*అయితే సమాజంలో మిగిలేది మేధావులో, విలువలున్న మంచి మనుషులో కాదు...*


*మానవత్వం లేని మృగాలో, విలువల్లేని రోబోలో తయారవుతాయి...*


*ఒకవేళ మీలా ఆలోచించి పంతుళ్ళు కూడా పక్క దోవ పట్టితే...*


*మాకు విలువివ్వండి...*


*విలువులన్న మనుషులను తయారుచేసే పనిలో తోడు రండి...*

👏 👏 👏 👏 👏


*విలువులు తప్పిన ఒకరిద్దరు పంతుళ్ళను ఓ కంట కనిపెట్టండి...*


*వారిని మందలించండి...*


*విద్య బళ్లోనే, అదీ గురువు సమక్షంలోనే  దొరుకుంతుందని గుర్తుంచుకోండి...*

🙏 🙏 🙏 🙏 🙏

మీ జీవితం ఒక అద్భుతం

  మీ జీవితం ఒక అద్భుతం


ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, 

డిజప్పాయింటెడ్‌ గానా, 

బోర్‌గానా, 

చిరాకుగానా…? 

ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.


బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే *“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.


*బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*


చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.* మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.


మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. *“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.*


 దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.

————

చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. *రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీప్రయత్నంలోనూ  ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.

————–

ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. *ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*


అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.*  


*ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే  ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*


ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.


సో *లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.*


*ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.*


ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.


సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. *బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*


ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.


రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి. 


సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.

————

*సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.*


జీవితం అందమైనది...అనంతమైంది

ఆనందంగా జీవించుదాం....

Thursday, August 19, 2021

పాలకులు -ప్రజలు

 పాలకులు -ప్రజలు

పంచ పాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.*

*ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.*

*అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.*

*ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా.? అని చెప్పడంతో..*

*ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.*

*ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.*

*ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు.*

*రాజా.! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.*

*కృష్ణా.! మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.*

*తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.*

*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు. మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.? ప్రజలు ఎప్పుడు మారుతారో.?*


**చిన్న విన్నపము🙏🙏* 


*విధిగా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సందేశం పంపండి.* *ఎందుకంటే కనీసం కొంతమందినైన మార్చాలని ఆశిస్తూ.🙏🙏*

వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )

 వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )


శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-

పసుపు ................. 100 grms

కుంకుమ ................100 grms

గంధం .................... 1box

విడిపూలు................ 1/2 kg

పూల మాలలు ........... 6

తమలపాకులు............ 30

వక్కలు..................... 100 grms

ఖర్జూరములు..............50 grms

అగర్బత్తి ....................1 pack

కర్పూరము.................50 grms

చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )

తెల్ల టవల్ .................1

బ్లౌస్ పీసులు .............. 2

మామిడి ఆకులు............

అరటిపండ్లు ................ 1 dazans

ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు

అమ్మవారి ఫోటోల ......................

కలశము .................... 1

కొబ్బరి కాయలు ............ 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............

స్వీట్లు ..............................

బియ్యం 2 kg

కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML


పూజా సామాగ్రి :-

 

దీపాలు ....

గంట

హారతి ప్లేటు

స్పూన్స్

ట్రేలు

నూనె

వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్


శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే

శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి *

ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు *


వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, 

లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.


వ్రత విధానం :-

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.


కావలసినవి :-

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.


తోరం ఎలా తయారుచేసుకోవాలి :-

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.


గణపతి పూజ:-

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః,

ఓం ఏకదంతాయ నమః,

ఓం కపిలాయ నమః,

ఓం గజకర్ణికాయ నమః,

ఓంలంబోదరాయ నమః,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం గణాధిపాయ నమః,

ఓంధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచంద్రాయ నమః,

ఓం గజాననాయ నమః,

ఓం శూర్పకర్ణాయ నమః,

ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.


ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!


నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!


వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.


కలశపూజ :-

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః

కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః

అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః


ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥


అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.


అధాంగపూజ:-

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.


చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి. 


(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)


శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృతై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూత హితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓంపరమాత్మికాయై నమః

ఓం వాచ్యై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం శుచయే నమః

ఓంస్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓంహిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యైనమః

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం రమాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధ సంభవాయై నమః

ఓం అనుగ్రహ ప్రదాయై నమః

ఓంబుద్ధ్యె నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓంఅమృతాయై నమః

ఓం దీపాయై నమః

ఓం తుష్టయే నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓంలోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓంలోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓంపద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓంపద్మముఖియై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓంపద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మ గంధిన్యైనమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖీయైనమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓంచంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్ర రూపాయై నమః

ఓంఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యెనమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్ర నాశిన్యై నమః

ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః

ఓం శాంత్యై నమః

ఓం శుక్లమాలాంబరాయై నమః

ఓం శ్రీయై నమః

ఓంభాస్కర్యై నమః

ఓం బిల్వ నిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యైనమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓంహేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధ్యై నమః

ఓం త్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశగతానందాయై నమః

ఓంవరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓంహిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః

ఓంమంగళాదేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః

ఓం ప్రసన్నాక్ష్యైనమః

ఓం నారాయణసీమాశ్రితాయై నమః

ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః

ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓంభువనేశ్వర్యై నమః


తోరపూజ :-

తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.


కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,

రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,

లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,

విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,

మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,

క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,

విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,

చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,

శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే


వ్రత కథా ప్రారంభం :-

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.

శ్రద్ధగా వినండి.


పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.


వరలక్ష్మీ సాక్షాత్కారం :-

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.


అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో


సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.


అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.


వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.


భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడంతప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది....


సర్వేజనాసుఖినోభవతు *

Sunday, August 15, 2021

Independence Day Maths

 ⭕TMF

Telangana Maths Forum


Independence Day Special Mathematics

Specialty of Today's date: 15821



▪︎15=8×2–1=(8÷2¹)!–(8+2–1)=[(8÷2)!+1]–(8+2¹)

▪︎1+5=8–2¹, 1×5=8–2–1=8÷2+1

▪︎1+5+8+2+1, 15+8²×1, 15²×8+1, 158×2+1, 15×82+1, 15×82–1, 15(8+2)+1, 15(8+2)–1, (15×8)²+1 are primes

▪︎15821, Mirror no.12851, 1+5+8+21, 15+8+2+1, 158+2+1, 15+8+2¹, 15+8–2¹, 15+8–1², 1×58²+1, 15×8²+1, 15×8²–1, 15×8+2+1, 15×8+21, 15×8–1², 15×8+2¹, 15×8–2¹, 15×2+8¹, 15²×8–1, 1²+5²+8²+2²+1², (15+8)²×1 are semiprimes

▪︎1+5+82+1 is *(15+8+2–1)th Prime*

▪︎1+58+2+1 is *(15+8–2+1)nd Semiprime*

▪︎158+21 is *15th Good, Long prime*

▪︎158–21 is *15th Pythagorean & (1+5+8+2+1)th Left-truncatable prime*

▪︎1582+1 is *(158+2–1)th Chen prime*

▪︎15×8×2+1 is *[(1+5+8)2+1]th Solinas prime*

▪︎15×8×2–1 is *15th Right-truncatable & (1+5+8+2+1)th Sophie Germain prime*


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

భార్యాభర్తల వాస్తవం....

భార్యాభర్తల వాస్తవం....

 (పెళ్లి అయిన వాళ్ళు తప్పకుండా చదవండి)




భార్య విహీనులైన భర్తలు జీవిత చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు..వారికి రోజులు గడవడం కష్టం..........


ఆమె లేని అతడు.. వట్టి మోడు!                                                                                                                                                                                                            భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా! అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం.. తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపో..తా..రు!!                                                                                                                                                                                      


“నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా?’ అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది!                                                    


నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.                                                                                                                                                  


ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.                                                                                                                                                                                                                               


దాంపత్యం అంటే.:- రెండు మనసుల కలయిక. మరణం ఆ బంధాన్ని వేరు చేస్తే.. ఓ భాగస్వామి దూరమైతే.. మిగిలి ఉన్నవారి మనసు కకావికలమవుతుంది. స్ర్తీ, పురుషులెవరికైనా ఆ బాధ ఒకటే. కానీ శేషజీవితాన్ని గడపడంలో మాత్రం తేడాలు కనపడతాయి. భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు. కానీ.. పురుషులు కుటుంబసభ్యులతో కలిసిపోలేరు. మానసికంగా ఒంటరులైపోతారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.                                                                                                                                                                                   కావాల్సింది సహకారం.. 


వ్యాపకం:- కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే భార్య గతించి ఏళ్లు గడిచినా ఉత్సాహంగా ఉన్నవారు ఉన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే.. ‘నా వయసు 90 ఏళ్లు. నా భార్య ఎన్నో ఏళ్ల క్రితమే మరణించింది. కొడుకు, కూతురు రమ్మన్నారు. కానీ, వెళ్లాలని అనిపించలేదు. అందుకే మా వూరిలో ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నా. ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో అమ్మాయి ఇంటికి వచ్చేశా. ఆ భగవంతుడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. ‘నా వయసు 92 ఏళ్లు. భార్య పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి నా కోడలు నన్ను కన్న తండ్రిలా సాకుతోంది. సాయంత్రంపూట గుడికి వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తాను. ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవుతుంటాను, రాస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు రఘురామ్‌ అనే మరో వృద్ధుడు.                             


అధ్యయనంలోనూ అదే తేలింది:- దాదాపు ఆరేళ్లక్రితం.. అంటే 2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదేంటంటే.. భర్తను కోల్పోయిన మహిళలతో పోలిస్తే, భార్యను కోల్పోయిన పురుషులు త్వరగా చనిపోయే అవకాశం 30 శాతం ఎక్కువని! భర్త చనిపోతే బాధ ఉంటుందిగానీ.. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం మహిళలకు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.                                                                                                  


ఇలా చేస్తే కొంత బెటర్‌:-


1.  చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. వారి ఆటపాటలు.. చిలిపి చేష్టలు వయసు మళ్లిన వారికి ఆనందాన్ని కలిగించటమే కాదు.. తమ చిన్న తనం నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చి మరింత హుషారుగా మార్చేస్తాయి. 


2. వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక ప్రపంచం ఉండాలి. ఎందుకంటే ఓ వయసు వచ్చిన తరువాత బయట సంబంధాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆఖరికి మనవళ్లు మనవరాళ్లు కూడా వారి ప్రపంచంలో వారుంటున్నారు. అందుకే తమ దైన ప్రపంచం సృష్టించుకోవాలి. అది తమ అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన హాబీ ఉండి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఆ హాబీని మూలన పడేసి ఉండొచ్చు. దాన్ని పైకి తీస్తే కాలక్షేపం అవుతుంది. 


3. లాఫింగ్‌ క్లబ్‌ లాంటి వాటిలో చేరటం లేదా సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది. 


4. స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొత్త స్నేహాలకు చేయిచాచాలి. ఇలాంటి వాటివల్ల కాస్తంత ఉపశమనం కలిగి బాధ నుంచి తేరుకునే శక్తి వస్తుంది.                                                                                                                                                                          


ఆధారపడడమే కారణం:- సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.. తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భార్య దగ్గర ఉన్న స్వతంత్రం కొడుకు, కోడళ్ల వద్ద ఉండదు. దానికి తోడు వయోభారం. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అన్నీ కలిసి కుంగుబాటుకు దారితీస్తాయి. నాణేనికి మరోవైపు చూస్తే.. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తగ్గించుకోవడం కారణంగా ఆరోగ్యంగా పూర్తి జీవితాన్ని గడపగలుగుతారని విశాఖ జీజీహెచ్‌ మానసిక వైద్యులు మురళీ కృష్ణ విశ్లేషించారు.                                                                


మహిళలే స్వతంత్రులు:- స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.- ప్రొఫెసర్‌ రాజు, ఏయూ, సైకాలజీ                                                                                                                                                                                                                                


భావోద్వేగ బలం ఆమెదే:- పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది.


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Saturday, August 14, 2021

జెండా ఎగరవేయడానికి, జెండా ఆవిష్కరించడానికి మధ్య ఉన్న తేడా ఏంటి ?

 జెండా ఎగరవేయడానికి, జెండా ఆవిష్కరించడానికి మధ్య ఉన్న తేడా ఏంటి ?


అనేకమంది చేసిన త్యాగాల వల్ల ఆగస్టు 15, 1947న భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26న దేశంలో ర అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య ఉన్న ఒక చిన్న తేడా ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు.


స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు.. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.రాజ్యాంగం అమలులోకి వచ్చాక జనవరి 26 న రాష్ట్రపతి జెండా ఎగుర వేస్తారు.


ప్రతి ఏటా ఆగస్ట్ 15 న వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, జనవరి 26న అధికారులు జెండా వందన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంటారు.వివిధ సందర్భాల్లో జెండా నియమ నిబంధనలని తప్పనిసరిగా పాటించాలి.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

        పసుపులేటి నరేంద్రస్వామి

Wednesday, August 11, 2021

రిటైర్ అయిన మగాడికి పనికి ఆహార పథకం నిబంధనలు ::

 

~~~~~~~~~~~~~~~

 రిటైర్ అయిన మగాడికి  పనికి ఆహార పథకం నిబంధనలు ::


1)  డోర్ బెల్ కి టక్కున అటెండ్ అవ్వడం.


2) సీరియల్స్ సా....గేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా  నిశ్శబ్దముగ ఉండి....సీరియల్స్ ఐపొయ్యాకే నీ న్యూస్ అదీ చిన్న వాల్యూమ్ లో చూడటం.


3) డోర్  దగ్గర పడి ఉన్న న్యూస్ పేపర్ ను వెంటనే  చదివేయాలి...లేదంటే," పేపర్ మానేద్దాం, చదవరు పెట్టరు డబ్బు వేస్ట్ " అని వినపడుతోంది.


4) భార్య చెపితే (ఆమె కి కోపము వచ్చినప్పుడు మాత్రమే) పిల్లలను తిట్టి కంట్రోల్ చేయడం.


5) అటక పైన పెట్టిన సామాను  కిందికి దించడం.


6) స్టవ్ మీద పెట్టిన పాలు పొంగబోయే ముందే ఎంతో  తెలివిగా స్టవ్ ఆఫ్ చేసి పొంగిపోవటం...కానీ పాలు 

పొంగిపోతే.....!!


7) గట్టిగా మూత బిగుసుకు పోయిన సాస్,జామ్, తేనె  బాటిల్స్ మూతలు ఓపెన్ చేసివ్వడం.


8) స్టవ్ మీదున్న కుక్కర్ వేసే  విజిల్స్ లెక్కబెట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడం.


 9) ఇంట్లో  బల్లి, బొద్దింకల వంటి భయంకరమైన  జీవులను "ఒక్క మాగాడిలా"  కొట్టి బయట పడేయడం.


 10) సిలెండర్ ఖాళీ అయిన వెంటనే మార్చడం.


11)  షాపింగ్ చేసేటప్పుడు భూదేవి కున్న ఓర్పు తో భార్య వెంట ఏ షాప్ అంటే ఆ షాపులోకి ఎన్ని గంటలైనా వెళ్లి కొన్నదానికి నోర్ముసుకొని బిల్ పే చేయడం.


12)  ఇంట్లో చిన్న చిన్న ఎల్కట్రిక్, ప్లంబింగ్ పనులు నేర్చుకుంటూ....చేయడం. సరిగ్గా చేయలేకపోతే....!!


13) తనని "ఇంకా" అందంగా ఉన్నావని మధ్య మధ్య లో  పొగుడుతూ ఉండటం.


14)సెల్ ఫోన్, ఇంటర్నెట్, సిటీ కేబుల్ బిల్లులు సరిఅయిన టైం లోపల కట్టి....తనకు కోపము రాకుండా చూసుకోవడం.


15) కొబ్బరికాయల పీచు తీసి ఇవ్వటం.


16) అయిదు వందలు, రెండు వేలు నోట్లకు క్షణాల్లో చిల్లర తెచ్చి పెట్టటం.


17) మళ్ళీ ఒక్కో సారి, తనకు పర్సు లో తేలిగ్గా ఉండటానికి వందనోట్లన్నీటి బదులు పెద్ద నోట్లు ఏర్పాటు చేసి పెట్టటం. 


*ఈ 17 పనులు చక్కగా నిర్వహించడం రిటైర్ అయిన భర్త కనీస కర్తవ్యం.*


😂😜😂

ఆనందం అంటే ఏమిటి?

 ఆనందం అంటే ఏమిటి?

ఆనందం అంటే ఏమిటి మరియు దానిలో ఏమి ఉంటుంది?

ప్రస్తుత ఆధునిక ప్రపంచం యొక్క అభివృద్ధితో ఉన్న చాలా అసంతృప్తి కారణంగా, ఆనందాన్ని అధ్యయనం చేసే శాస్త్రం గొప్ప ప్రాముఖ్యతను పొందింది ఎందుకంటే ఎవరు సంతోషంగా ఉండటానికి ఇష్టపడరు?

సృష్టి ప్రారంభమైనప్పటి నుండి, తత్వవేత్తలు, మత పెద్దలు, రచయితలు మరియు అరిస్టాటిల్ వంటి ప్రసిద్ధ ఆలోచనాపరులు ఈ ప్రశ్నను తమను తాము అడిగారు, వారు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. 

సమకాలీన మనస్తత్వశాస్త్రంలోఈ భావన మరింత విస్తృతంగా పరిశీలిస్తే ఒక వ్యక్తి  అతని కోసం, ఆనందాన్ని ఆహ్లాదకరమైన, అర్ధవంతమైన మరియు నిబద్ధత గల జీవితంగా అర్థం చేసుకోవడంతో పాటు, ఒక వ్యక్తి కలిగి ఉన్న నాణ్యమైన సంబంధాలతో పాటు తన  విజయాలు మరియు ఆనందాన్ని నిలబెట్టుకుంటాయనే ఆలోచనలను కూడా పొందుపరుస్తాడు.

మన జన్యువులు 50% మన ఆనందాన్ని నిర్ణయిస్తాయి.

మరోవైపు, 10% మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా నిర్ణయించబడుతుంది.

మరియు మిగిలిన 40% మనం  రోజువారీ చేసే కార్యకలాపాల ద్వారా ప్రేరేపించబడతాయి  ఆనందం మన జీవితం మన అవసరాలను పూర్తిగా తీర్చినప్పుడు. అంటే, మనకు సంతృప్తిగా, నెరవేరినప్పుడు అది వస్తుంది. ఇది సంతృప్తి యొక్క అనుభూతి, దీనిలో జీవితం ఎలా ఉండాలో అనిపిస్తుంది. మన అవసరాలన్నీ పూర్తిగా నెరవేరినప్పుడు పరిపూర్ణ ఆనందం, జ్ఞానోదయం వస్తుంది.

మీరు చాలా ఉన్నతిలొ ఉన్నా, అన్ని సదుపాయాలు ఉన్నా, ఏది కావాలంటే అది చేయగలిగినా, ఏది కొరుకుంటే అది పొందగలిగిన వాళ్లని అడిగి చూడండి. నూటికి 95 % మంది ఆనందంగా ఉండటం లేదు.అదే కనీస సదుపాయాలు కూడా లేని వాళ్లు నూటికి 35 % ఆనందంగా ఉన్నామని చెపుతున్నారు. ఆంటే సుఖం ఆనందాన్ని ఇవ్వడం లేదా ? దానికి ప్రధాన కారణం కోరికలని నేననుకుంటున్నాను. కోరికలు మనకి ఆనందం లేకుండా చేస్తున్నాయా?... ఆలోచించండి. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనలో చాలామంది సుఖాల కోసం ఆనందాన్ని వదిలేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం.

సంతోషం/ఆనందం అనేది 50 శాతం జన్యుపరంగా ఉంటుంది. 40 శాతం మనిషి అంతర్గత ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన 10 శాతం అతడి జీవన పరిస్థితుల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన సమస్యపై చేయగలిగిందేమీ లేదు. మంచి ఆరోగ్యం, ఇతరులతో సత్సంబంధాలు, మూల ఆదాయం, అర్థవంతమైన పని, నేర్పరితనం, ప్రకృతితో మమేకం కావడం, ఆర్థిక, సామాజిక సమానత, దాతృత్వం వంటి అంశాలపై ఆధారపడి ఆనందాన్ని నిర్వచించాలి. ఒక వ్యక్తికి ఇంట్లో ఉండే ఆనందం పని ప్రదేశానికి వెళ్లాక.. నిమిష నిమిషానికి తగ్గిపోతోంది. అందువల్ల ఆదాయం కంటే మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి.  మన జన్యుశాస్త్రం, మనం పెరిగిన విధానం మరియు మన జీవిత అనుభవాల ఆధారంగా మన వ్యక్తిగత అవసరాలు మారుతూ ఉంటాయి. ఈ సంక్లిష్ట కలయిక మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైనదిగా చేస్తుంది, మన ఖచ్చితమైన అవసరాలలో మరియు ఈ రోజు మనం ఉన్న వ్యక్తిని తయారుచేసే అన్ని ఇతర అంశాలలోమనలో ప్రతి ఒక్కరూ చాలా సంక్లిష్టంగా మారవచ్చు, కాని మనమందరం మనుషులం మరియు ఇది మన అవసరమైన మానవ అవసరాలను కనుగొనగల పునాదిని అందిస్తుంది.

సమస్య ఏమిటంటే, మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులు మరియు ప్రజలు, సాధించిన విజయాలు మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఇవన్నీ మన ఇంద్రియాలను తాత్కాలికంగా ఆహ్లాదపరుస్తాయి, మన అహాన్ని రంజింపజేస్తాయి, మన స్థితిని పెంచుతాయి. ప్రతిదీ తాత్కాలికం. నిజమైన ఆనందం ఈ బాహ్య కారకాలపై ఆధారపడి ఉండదు.

ఆనందం అనేది మనస్సు యొక్క స్థితి. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలో తెలియకపోతే, అతనికి ఏమీ సహాయం చేయదు (డబ్బు, లేదా ఒకరి దృష్టి, లేదా కీర్తి కాదు). మీరు ఎన్నడూ సంతోషంగా లేకుంటే లేదా ఈ భావన ఏమిటో ఇప్పటికే మరచిపోకపోతే, మీరు మళ్ళీ సంతోషంగా ఉండటానికి నేర్చుకోవాలి. అన్నింటిలో మొదటిది, ఆనందం యొక్క మార్గంలో, మన పాత్రను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వ్యక్తిత్వ లక్షణాలు సంతోషంగా ఉండగల సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. అసూయ, కోపం, చిరాకు, ఆగ్రహం, దురదృష్టం, పనిలేకుండా మాట్లాడటం, వెన్నుపోటు నుండి బయటపడటం అవసరం. చెడు నుండి మన  ఆలోచనలు మరియు మాటలను బయట పడేయాలి. మీ స్వంత చర్యలపై దృష్టి పెట్టండి, ఇతరులు కాదు. విమర్శలను వదిలించుకోండి. సంతోషంగా ఉన్న వ్యక్తిగతంతో భాధ పడడు, వర్తమానం గురించి ఆందోళన చెందడు, భవిష్యత్తు గురించి భయపడడు. దీని అర్థం బాధాకరమైన, కష్టమైన జ్ఞాపకాలు ఉంటే, అవి ఇకపై అతుక్కుపోకుండా ఉండటానికి మానసికంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆనందం అనేది మనస్సు యొక్క స్థితి. ఇది నాస్తికులకు సంబంధించినది కాదని దీని అర్థం. ఒక వ్యక్తికి ఖచ్చితంగా కాంతి, శక్తివంతమైన వాటిపై నమ్మకం ఉండాలి: దేవుడిలో, అధిక శక్తులు, శక్తులు, ప్రకృతి, విధి. విశ్వాసం మరియు ఉన్నతమైన వాటిపై నమ్మకం ద్వారా మాత్రమే మనం వర్తమానంలో శాంతిని, భవిష్యత్తులో విశ్వాసాన్ని పొందగలం. ఒక వ్యక్తి పంచుకున్నది అతనికి మూడుసార్లు తిరిగి ఇవ్వబడుతుంది. అంటే, ఆనందం, మంచి మానసిక స్థితి, అభినందనలు, సహాయం పంచుకోవడం ప్రారంభించండి మరియు మీ దృక్పథం ఎలా మారుతుందో మీరు గమనించవచ్చు.

 మరి ఆనందం ఎందులో ఉంటుంది ?

కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుందా......కాదనే చెప్పాలి. పెద్ద ఇల్లు, కీర్తి, చుట్టాలు, స్నేహితులు ఉంటే వస్తుందా.......కాదనే చెప్పాలి. 2018 లో ప్రపంచ వ్యాప్తంగా జరిపిన ఆనంద నగరాల సర్వేలో వెల్లడైన విషయాలు

25 % మంది తెలియదు.. చెప్పలేం అన్నారు.

40 % మంది సుఖంగా ఉండటమే ఆనందం అన్నారు.

25% మంది ఏది తలుచుకుంటే అది చేయగలగడమే ఆనందం అన్నారు.

10 % మంది కళలు, దేవుడు... వీటికి దగ్గరగా ఉండటమే ఆనందం అన్నారు.

మరి మీ దృష్టిలో ఆనందం అంటే ఎమిటో అలోచించండి...

మీరు ఆనందంగా ఉన్నారా ? ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నారో లెక్కపెట్టగలరా ?

ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఆదే ఆనందంగా లేకపొతే ... ఎందుకు ఆనందాన్ని మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు.. ఎంత ఆనందంగా జీవించామన్నది ముఖ్యం. మనం బ్రతికి ఉండే ప్రతి నిమిషాన్నీ ఆనందించగలిగితే ఎంత బాగుంటుంది. అది మీ చేతిలోనే ఉంది. సమయాన్ని జారవిడుచుకోకండి. ఆనందంగా ఉన్నారా.. ఉంటే ఎంత % ఆనందంగా ఉన్నారు.. ఏం చేస్తే మీ ఆనందం 100 % అవుతుంది...

ఆనందంగా ఉన్న వారికి ఆయుర్ధాయం పెరుగుతుందని మీకు తెలుసా ? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆనందం గురించి అలోచిస్తే కొన్ని ప్రశ్నలు వచ్చాయి. పోటీ చదువులు, కంప్యూటర్లు , వీడియో గేంలు ఇవన్నీ పిల్లల్లో సహజమైన ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. ఈ కార్పొరేట్ ప్రపంచం వచ్చాక, 24 గంటలు పనిచేసే ఆఫీసులు , ప్రతి నెలా మారే షిఫ్టులు, ఒక మొక్క కూడా పెంచుకోలేని అపార్టుమెంటులు, దేవుడితో బిజినెస్ చేసే మనుషులు....... ఇవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయా ? ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. దైవత్వం, మానవత్వం, పశుతత్వం... మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఏది ఎంత % మీలో ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

గమనిక: నాకు ఆనందం అంటే ఏదో తెలుసని ఈ పొస్ట్ రాయలేదు. నా లాగే ఇంక ఎవరైనా తెలియని వాళ్లు ఉంటే వాళ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారెమో అని.


Tuesday, August 10, 2021

ఐఐటీలో సీటు.. కానీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్ర‌మే చ‌దువుతా..

 🔊 ఐఐటీలో సీటు.. కానీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్ర‌మే చ‌దువుతా...


న్యూఢిల్లీ : ఐఐటీలో సీటు పొందిన ఓ విద్యార్థి విలేక‌రుల ప్ర‌శ్న‌కు వింత స‌మాధానం చెప్పాడు. త‌న‌కు ఐఐటీలో సీటు వ‌చ్చిన‌ప్ప‌టికీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్ర‌మే చ‌దువుతాన‌ని తేల్చిచెప్పాడు. హ‌ర్యాన‌కు చెందిన అన్మూల్ అరిచ్‌వాల్ శుక్ర‌వారం విడుద‌లైన జేఈఈ మెయిన్స్ ఫ‌లితాల్లో 100 శాతం ప‌ర్సంటైల్ సాధించాడు. ఈ సంద‌ర్భంగా అన్మూల్‌ను విలేక‌రులు సంప్ర‌దించారు. మీ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ఏంటి? ఐఐటీలో 100 శాతం ప‌ర్సంటైల్ సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అని అన్మూల్‌ను ప్ర‌శ్నించారు.


అయితే అత‌ను చెప్పిన స‌మాధానం విని విలేక‌రులు షాక్ అయ్యారు. త‌న‌కు ఐఐటీలో సీటు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌వేశం తీసుకోను అని తేల్చిచెప్పాడు. IISc Bangalore లో బీఎస్సీ మ్యాథ‌మేటిక్స్ మాత్ర‌మే చ‌దువుతాన‌ని, ఆ స‌బ్జెక్టులో రీసెర్చ్ చేయాల‌నే ఆస‌క్తి ఉంద‌ని అన్మూల్ పేర్కొన్నాడు.

Monday, August 9, 2021

విజయం అంటే ఏమిటి ?

 విజయం అంటే ఏమిటి?


మన దేశం నుండీ ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ *''విజయం అంటే ఏమిటి?''* అని అడిగితే ఒక యువతి *''విజయం అంటే ఎక్కువ ధనం సంపాదించడం''* అనింది. 


అపుడు ఆ ప్రొఫెసర్ ''అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? ''అంటే ఎవరూ చెప్పలేదు. (ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి) *బ్రతకడానికి కొంత ధనం కావాలి కానీ, ధనమే బ్రతుకు కాదు. అంటే విజయమంటే ధన సంపాదన కాదు* అన్నమాట.   


మరో యువకుడు లేచి *''విజయం అంటే బలం/శక్తి''* అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్, నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితంలో సంతోషంగా వుండగలిగారా?  వీళ్ళ జీవితాలు ఎలా గడిచి, ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా!


తన బలంతో, తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్, తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు.


అయితే విజయమంటే బలం/శక్తి సంపాదన కాదు అన్నమాట. 

మరో యువతి *''విజయమంటే ప్రఖ్యాతి, అందం''* అంది. అయితే కేట్ మోస్, జీన్ ష్రింప్టన్, సోఫియాలారెన్, మార్లిన్ మన్రో లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. 


భారత్ విషయానికొస్తే, పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే, అమితాబ్ బచ్చన్ తో సహా, ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకోని హిందీ సినిమా హీరోనే లేడు. డానీ, కబీర్ బేడీ, మహేష్ భట్ లతో ఆమె ప్రేమ, పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే.


కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే, తాగుడుకు బానిస అయ్యి, ఒక దశలో కాలికి కురుపు లేచి, అది ఒళ్ళంతా ప్రాకి, ఏ శరీరం కోసం అయితే అంతమంది మగవాళ్ళు పిచ్చిక్కెపోయారో, అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే, ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని, జనం ఆమెను తాళ్ళతో కట్టి, ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే, ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని ఫిర్యాదు చేస్తే, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు.


మన తెలుగు చలన చిత్ర కథానాయిక సావిత్రి గారి అందం సంపద అన్నీ కరిగిపోయి చివరకు అవసాన దశలో ఆమెకు భయంకరమైన మరణం సంభవించింది.


అయితే అందం, ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట.   


మరోసారి మరొకరు *''విజయమంటే అధికారం''* అని అన్నారు. అయితే ''కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి'' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.


అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతిగా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి, పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట. 


చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీలో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు *''విజయం అంటే ఏమిటి?''* అని, అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు, ''మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?'' అందరూ ''తెలుసు'' అన్నారు. ''వాళ్ళ అవ్వ, తాతల పేర్లు తెలుసా?'' అని అడిగితే అయిదారుమంది ''తెలుసు'' అన్నారు. ''వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?'' అని అడిగితే "తెలియదు'' అన్నారు. 

అపుడు ప్రొఫెసర్ గారు'' శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు, అందరూ '' ఓ, తెలుసు'' అని ముక్తకంఠంతో బదులిచ్చారు. 


''మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?'' 

అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి, ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది, 


''సార్, మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం, 

*తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది, ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!''*


*''నా గురించి నేను దుఃఖించకపోవడమే నా ఆనందానికి కారణం''* అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట,


*''ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు, అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క'' (Only they live who live for others , the others are more dead than alive)*  

అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.


పసుపులేటి నరేంద్ర స్వామి

Update

 *సమయానుకూలంగా వెళ్లితీరాలి..  లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?*

```1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌ లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు. ఐనప్పటికీ కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది..```

కోడాక్ దివాళా తీసింది, మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.


 HMT (watch)

 బజాజ్ (స్కూటర్)

 డయనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూత్ (బైక్)

 అంబాసిడర్ (కార్)

Etc., Etc..

చెప్తుపోతుంటే, List చాలదు..


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!

*కారణం ???*

ఓకేఒక్కటి UPDATE.

```they DIDN'T UPGRADE```

 *కాలక్రమేణా అవి మారలేదు. !!*


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..?

గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకు

*నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…* పలుకుతుంటాయి.


 🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 🔥సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


*Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.*


🔥యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 


🔥వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.


*2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా ఉంటాయి.*


రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం..


🔥 ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.


*మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.*


 🔥కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


🔥 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి ...


20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. 


🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 


*మీరు ఎప్పుడైనా గమనించారా ..?*


ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది


ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా..

ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. etc

ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  


🔥 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మీ మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచండి. లేకపోతే మీరు తప్పక వెనుకబడిపోతారు..


 *కాలక్రమేణా మార్పు సహజం*

 అందువల్ల ...

 ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

 

*"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"*


 సమయంతో కదిలితే విజయం సాధించడమ్, లేకపోతే కనుమరుగైపోవడం.

సో..అప్ గ్రేడ్ అవ్వండి.

పసుపులేటి నరేంద్ర స్వామి

      

Tuesday, August 3, 2021

కామిక ఏకాదశి

 *కామిక ఏకాదశి*

రేపు (4-08-2021) బుధవారం

🕉️🍁🍁🍁🍁🔯✡️🌻🌻🌻🌻🕉️


🕉️ *తులసి ఆకులతో కామిక ఏకాదశి చేసి తరిద్దాం...* 🕉️

 

💫🍁 ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని  కామిక ఏకాదశిగా జరుపుకుంటారు.   ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. 


💫🍁 శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటం, తులసీ దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.

 

🕉️ *కామిక ఏకాదశి మహత్యం - వ్రత కథ* 🕉️


🍁💫 ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి,  "ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని" కోరగా, దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడై, 

 


💫🍁 "ఓ రాజా! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే, ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు.... 


🍁💫 "ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు, వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి" అని కోరాడు. 

 

🍁💫 దానికి బ్రహ్మ బదులిస్తూ...  "నా ప్రియమైన కుమారుడా! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెదను. 


💫🍁 ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి  మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. శంఖ, చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీమహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. 

 

🍁💫 కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు - సోమవారం, గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. 

 

🍁💫 కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో  కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్చమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. 

 

🍁💫 నారదా! ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు.  


🕉️💫 "కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు,సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు.  "ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. 


🍁💫 కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు, అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. 


🍁💫 ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము, బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి, ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు , వజ్రాలు, నీలం మరియు గోమేధికములతో పూజించినదానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు.  లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. 


💫🍁 కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో, వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది."  అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా... శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను.



*ఓం నమో నారాయణాయ*

.

🕉️🍁🍁🍁🍁✡️🔯🌻🌻🌻🌻🕉️

Monday, August 2, 2021

మీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోండి

 మీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోండి

*


గ్యాస్ సిలిండర్ ని పైకి లేపకుండామీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోండి.. లోపల ఎంత వరకు గ్యాస్ ఉందో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి*


గ్యాస్ సిలిండెర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇది మనకు నిత్యావసరాల్లో ముందుంటుంది. ఎందుకంటే వంట చేసుకోవడానికి ఎక్కువమంది గ్యాస్ పైనే ఆధారపడతాం కాబట్టి. మనం రెండు బండలు కొనుక్కుని ఒకటి స్పేర్ ఉంచుకుంటాం. ఒకటి అయిపోగానే మార్చుకుని.. రెండవ బండ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఇది అందరు సహజం గా చేసే పనే.


అయితే.. చాలా మంది గ్యాస్ బండ ఎంత బరువు ఉందో చెప్పడానికి చిన్న పరికరాలు వాడతారు. అది అందరి ఇళ్లలోనూ ఉండకపోవచ్చు. కొందరు గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం బండను షేక్ చేసి చూడడం, లేదా పైకి ఎత్తి చూడడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది అన్ని సమయాల్లోనూ శ్రేయస్కరం కాదు. ఈ చిన్న ట్రిక్ తో మీ బండ లో గ్యాస్ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు.


ఒక బౌల్ లో వాటర్ తీసుకోండి. ఒక క్లాత్ ను తీసుకుని దానిని వాటర్ లో ముంచి.. పూర్తి గా తడిసిన తరువాత బయటకు తీయండి. దానిని పిండి.. ఆ తడి గా ఉన్న గుడ్డతో బండను తుడవండి. గదిలో ఫ్యాన్ ను ఆపేసి ఈ బండను తుడవండి. ఒక నాలుగైదు నిమిషాల పాటు దానిని గమనిస్తే.. గ్యాస్ లేని భాగం లో తొందరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న కింద భాగం మాత్రం ఎక్కువ సేపు తడిగా ఉంటుంది.



ఈ తడిగా ఉన్న ప్లేస్ ఎక్కడివరకు ఉందో.. అక్కడవరకు మీ బండలో గ్యాస్ ఉందని అర్ధం. 

బండ ని పైకి లేపడం, వెయిట్ చూడడానికి ఆన్ లైన్ లో దొరికే రకరకాల మెజరింగ్ పరికరాలను ఉపయోగించడం అంత సేఫ్ కూడా కాదు.. చాలా సింపుల్ గా.. ఒక క్లాత్, వాటర్ తో ఈ ఎక్స్పరిమెంట్ ట్రై చేయచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఉండే బండలో ఎంత వరకు గ్యాస్ ఉందో చెక్ చేసుకుని అవసరమైనపుడు కొత్త బండ బుక్ చేసుకోవచ్చు.

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE