NaReN

NaReN

Saturday, February 24, 2024

TMF State Meeting

     


 

TMF STATE MEETING 2024

       10AM @ 25.02.2024

ZPHS AVANASTHALIPURAM

Wednesday, February 21, 2024

ఒక తెలుగువాడు కాని వ్యక్తి రాసిన వ్యాసం.

 ఒక తెలుగువాడు కాని వ్యక్తి రాసిన వ్యాసం

నా మాతృ భాష తెలుగు భాష కాదు. దాని అర్థం ఇతర భాషలను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

    తెలుగు మాతృ భాషగా ఎవరికి వున్నదో, తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి తెలుసుకుందామనుకొనేవారి కోసం కొన్ని విషయాలు.


1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.


2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపిగ కొరియన్ భాష.


3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు ఉత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాషల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.


4. శ్రీలంకలో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.


6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాషలో కూడా  పదాలు హల్లు శబ్దంతో అంతమౌతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని అంటారు .


7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానాన్ని పొందింది.


8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు కాకతీయ(తెలంగాణా)

ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరం మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.


9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దంతో పూర్తి అవుతుంది.


10. తెలుగు భాషలో వున్నన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోనూ లేవు.


11. తెలుగు భాషను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.


12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.


13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతివారే.


14. రామాయణ మహభారతాలలో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాషా సాహిత్యంలోనూ లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన ఒకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.


15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగును  తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేసాడు.


16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

 

పై విషయాలన్నీ ఒక తమిళ వ్యక్తి  ఆంగ్లంలో  తెలియజేసిన విషయాలను అనువదించారు, కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భావి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరంపై వుంది. తెలుగు భాషను చంపేసే తరంగా మనం ఉండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యమో, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆ పదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాషపై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగులో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాషను బలిచేయనవసరం లేదు. 


తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 


ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి చేరవేద్దాం..... 


Friday, February 16, 2024

మైక్రోసాఫ్ట్‌లో స్వీపర్

 మైక్రోసాఫ్ట్‌లో స్వీపర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ముగించుకున్న సుబ్బారావుతో -


''మీ పనైపోయింది. మీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇమెయిల్ లో పంపిస్తాం'' అన్నారు హెచ్.ఆర్.


'అయ్యో నాకు ఇమెయిల్ లేదే?'


'ఏంటీ, ఇమెయిల్ లేదా? మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోసం వచ్చి.. ఇమెయిల్ లేదా... అయితే మీకు నో ఉద్యోగం. యు కెన్ గో నౌ'


దిగాలుపడ్డ సుబ్బారావు... బయటకి నడిచాడు.


ఆకలి దంచేస్తోంది. జేబులో ఉన్న ఒకే ఒక్క రూపాయితో మరమరాలు కొన్నాడు. సగం తిన్నాడు. మిగతా సగం స్కూలు పిల్లలకు అమ్మాడు.


అయిదు రూపాయలు లాభం వచ్చింది. వ్యాపారం రుచి తెలిసి ఆ అయిదును పది... యిరవై... వంద... వెయ్యి... లక్ష... కోట్లు చేశాడు అయిదేళ్ళలో.


ఇపుడతను కోటీశ్వరుడు. భారతదేశం అంతా మరమరాలు సప్లై చేసే వ్యాపారి.


వందల కొద్ది స్వంత లారీలు ఉన్నాయి. ఉన్నట్టుండి యివన్నీ తగలబడిపొతే?


అమ్మో... అనుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్ ని పిలిచాడు.


'పేపర్లన్నీ రెడీ చేసి ఇమెయిల్ చేస్తా, మీ ఐడీ యివ్వండి' అన్నాడు ఏజెంట్.


'అయ్యో నాకు ఇమెయిల్ లేదే?' అన్నాడు సుబ్బారావు


'ఏంటీ, ఇమెయిల్ లేదా? ఇమెయిల్ లేకుండానే ఇంత బిజినెస్ మాగ్నెట్ అయ్యారు అయిదేళ్ళలో. ఇమెయిల్ వుండివుంటే యిప్పటికి ఏమై వుండేవారో తెలుసా?' అడిగాడు ఏజెంట్.


మైక్రోసాఫ్ట్ లో అయిదేళ్ళ సీనియర్ స్వీపర్ గా ఉండి ఉండేవాడిని అన్నాడు సుబ్బారావు ! :

Friday, February 2, 2024

గీత మీ రాత

 గీత మీ రాత


*ధోతీ, శాలువా ధరించిన ఒక పెద్దమనిషి చెన్నై సముద్ర తీరంలో కూర్చుని భగవద్గీత చదువుతున్నాడు.* 


ఒక యువకుడు వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు. చేతిలోని భగవద్గీతను చూసి ఇలా అన్నాడు: "ఈ సైన్స్ యుగంలో, ఈ రోజుల్లో, ఇంకా మీరు అలాంటి పుస్తకం చదువుతున్నారా? చూడండి, ప్రపంచం చంద్రునిపైకి చేరుకుంది, మీరు ఇంకా భగవద్గీతలోను, రామాయణంలోను కూరుకుపోయి ఉన్నారు."


ఆ పెద్దమనిషి యువకుడిని అడిగాడు: "భగవద్గీత గురించి నీకేం తెలుసు?"


ఆ ప్రశ్న కు సమాధానం చెప్పకుండా ఆ కుర్రాడు ఉద్వేగంగా అన్నాడు: "ఇదంతా చదివితే ఏం వస్తుంది? నేను విక్రమ్ సారాభాయ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని, నేను ఒక సైంటిస్టు .. గీత చదవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు."


ఆ కుర్రాడి మాటలు విని పెద్దమనిషి నవ్వుకున్నాడు. 


అంతలోనే రెండు భారీ కార్లు వచ్చి అక్కడ ఆగాయి. ఒక కారులో నుంచి ఇద్దరు  కమాండోలు, మరో కారు నుంచి ఒక సైనికుడు దిగారు. సైనికుడు కారు వెనుక తలుపు తెరిచి, సెల్యూట్ చేసి కారు డోర్ దగ్గర నిలబడ్డాడు. గీత చదువుతున్న పెద్దమనిషి నెమ్మదిగా కారు ఎక్కి కూర్చున్నాడు.


ఇదంతా చూసి ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు. ఈ మనిషి సామాన్యుడు కాడని, ఎవరో ప్రసిద్ధి చెందిన వారు అయ్యి ఉంటారని అతను గ్రహించాడు. ఆ పెద్దమనిషి గురించి తెలుసుకోవాలని కారు దగ్గరకు పరిగెత్తుకెళ్లి, "ఎవరు సార్ మీరు?" అని అడిగాడు.


ఆ పెద్దమనిషి చాలా ప్రశాంతమైన స్వరంతో ఇలా అన్నాడు: "నేను విక్రమ్ సారాభాయ్ ని."


ఆ కుర్రాడికి 220 వోల్ట్ ల షాక్ తగిలినట్లయ్యింది. 

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా?

  

డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం!!


డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్! రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి  పదకొండవ రాష్ట్రపతి!


ఆ తర్వాత డాక్టర్ అబ్దుల్ కలాం భగవద్గీతను చదవడమే కాకుండా దానిని జీవించారు. ఆయన రామాయణం, మహాభారతం, ఇతర వేద పుస్తకాలను కూడా చదివారు.


గీతా పఠన ఫలితంగా, డాక్టర్ కలాం తన జీవితాంతం మాంసాహారం తినకూడదని ప్రమాణం చేశారు.

  

ఆయన తన ఆత్మకథలో "భగవద్గీత ఒక సంపూర్ణమైన శాస్త్రం" అని రాశారు. మన వద్దనున్న ఈ సాంస్కృతిక వారసత్వం మనందరికీ ఎంతో గర్వకారణం అని ఆయన అభిప్రాయం.


*మీరు గీతను సరిగ్గా అర్థం చేసుకుంటే, అది మీ మనస్సును ఉన్నతమైన అవగాహనా స్థాయికి చేరుస్తుంది. అది మనల్ని జీవితాన్ని గొప్పగా జీవించడానికి సిద్ధం చేస్తుంది....* 💐

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE