NaReN

NaReN

Saturday, September 30, 2023

ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య

 



*👉ఈ ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట.*


*😰 మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. 

కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని...*     


*ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది*     

*ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి... 

ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... 

ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... 

ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు... 

ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత...*     

*అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే... 

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. 

ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ... 

ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. 

ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.* 


     *కాబట్టి మీలో వున్న కెవిన్ ని చంపండి..👍*

Monday, September 18, 2023

విద్యార్థి ప్రశ్నలకు కంగు తిన్న ఉపాధ్యాయులు

 *🌍SAA*

స్కూల్ అసిస్టెంట్స్ అసోషియేషన్


*విద్యార్థి ప్రశ్నలకు కంగు తిన్న ఉపాధ్యాయులు* 

మీ విద్యార్థులు మిమ్మల్ని అడిగిన ఇలాంటి ప్రశ్నలు 9493696955 వాట్సాప్ ద్వారా పంపండి.

===================


ప్రభుత్వ పాఠశాలలలో కొంతమంది విద్యార్థులు  అడిగే ప్రశ్నలు *గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని తలపిస్తాయి.*_ 


_అలా ఒక ఉపాధ్యాయుడి Service లో ఎదురైన సంఘటనల ఆధారంగా విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలు మీ ముందు:_


 _*చంద్రునిపై కాలుమోపడం* నిజమే  అని నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే... పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు._

_ఒక్క.. సతీష్ గాడు తప్ప..., నమ్మిన మిగతా పిల్లలందర్నీ వాడు జాలిగా చూశాడు. నన్నూ, పేపర్ లోని అమెరికా వాళ్లు దిగిన చంద్రమండలం బొమ్మని మార్చి మార్చి చూశాడు. కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి._ 

 

_'నీ డౌట్ ఏంట్రా... అమెరికా వాళ్లు ఖచ్చితంగా చంద్రమండలానికి వెళ్లి వచ్చారు. అదే ఈ వార్త' అన్నాను._  *“నేను నమ్మట్లేదు సార్...”* _అన్నాడు ధృడంగా..._ *“ఎందుకురా... నువ్వేమైనా చూసొచ్చావా”* _అన్నాను కోపంగా. ప్రపంచమంతా ఒప్పుకుంటుంటే... వీడేంటి అన్న అసహనం పుట్టుకొచ్చింది._    *“చంద్రమండలం మీద గాలి లేదన్నారు కదా సార్... మరి అమెరికా వాళ్ల జెండా ఎలా రెపరెపలాడుతుంది?”* _అన్నాడు. ఖంగుతిన్నాను..._


_వాడి ప్రశ్న వందలాది వేట కొడవళ్లుగా మారి... అమెరికా వైపు దూసుకెళ్తున్నట్టు... అగ్రరాజ్యాన్ని నిలదీస్తున్నట్టు... కలవర పెట్టింది. వాడి మొహంలో చిద్విలాసం._ 

*నిజమే... ఇప్పుడు నాకూ నమ్మకం కలగట్లేదు.....*

_ఇరవై ఏళ్ళలో బదిలీపై ఏ ఊరికెళ్లినా ఆ ప్రశ్నలు వెంటాడుతాయి. ప్రశ్న వేసిన ఆ పిల్లల మొహాలు మర్చిపోలేనంతగా వేటాడుతాయి._ 


_పదేళ్లకింద చర్లపల్లె స్కూల్లో అలాంటి ప్రశ్నే ఎదురైంది..._

_నాకా ప్రశ్న వేసిన నాలుగో తరగతి చదివే *రమేష్* గాడి మొహం ఇప్పటికీ మనసులోంచి చెక్కు చెదరలేదు._


_అప్పట్లో నాలుగో తరగతి తెలుగు వాచకంలో ' *'కల్పవృక్షం'* అనే పాఠం ఉండేది. తాటిచెట్టు కల్పవృక్షం లాంటిది. తాటికమ్మలు గుడిసె వేసుకోవడానికి... తాటి ముంజలు తినడానికి... తాటి దోనెలు నీరు పారించుకోవడానికి... ఇలా తాటిచెట్టులోని ప్రతీది మనిషికి పనికొస్తుంది. ఇలా అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు... అంటూ పాఠాన్ని వివరించినప్పుడు...  చెబుతున్నంత సేపూ... రమేష్ గాడి మొహం చిన్నబోయింది. వాడి కళ్ళల్లో తడి... నేను అబద్దం చెప్తున్నట్టు కోపం... నాకేమి అర్ధం కాలేదు... “రమేష్... ఏమైందిరా...” అనడిగాను._


*“మా అయ్య రోజూ తాటికల్లు తాగొచ్చి అమ్మనూ, నన్నూ, తమ్ముణ్ని బాగా కొడతాడు.. తాటిచెట్టు మంచిదెట్లయితది సార్...”*

_వాడి ప్రశ్నకి... షాక్ తిన్నాను. నన్నే కాదు... విద్యావ్యవస్థనే ప్రశ్నించినట్లుంది వాడి ప్రశ్న. నిజానికి తాటిచెట్టు పాఠంలో 'కల్లు' ప్రస్తావన ఎక్కడా రాలేదు._ *తాటిచెట్టు* *కల్పవృక్షంతో పోల్చదగిందేనా...* 

_వాడికి నేను సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి...???_


_చివరకు *“తాటికల్లు మంచిదేరా... కాకపోతే ఓ కప్పుగాని, అరకప్పు గాని తాగితే మంచిది... కానీ మీ నాన్న కుండల కొద్దీ తాగుతాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు...”* అంటూ ఇంకొంచెం విపులంగా చెప్పాను. అయినా నా సమాధానం వాణ్ణి సంతృప్తి పర్చలేదు. అంతకు మించి చెప్పడానికి నాక్కూడా ఏం తోచలేదు. వాడు అయిష్టంగానే కూచున్నాడు._


*వాడి ప్రశ్న ఇప్పటికీ ఇలా వెంటాడుతూనే వుంటుంది.*


 _సుజాత టీచర్ ఓరోజు మూడో తరగతిలో *"బాతు - బంగారు గుడ్డు"* పాఠం చెప్పింది. ఒక బాతు రోజూ బంగారు గుడ్లు పెడుతుంటే... ఆత్యాశతో దాన్ని కోసి... యజమాని భంగపడ్డాడు అనే పాఠ్యాంశాన్ని చెప్పింది._

_తీరా ఒక పిల్లాడు వేసిన ప్రశ్నకి ఆమెకు చిర్రెత్తుకొచ్చి వాడి వీపు బద్దలు చేసింది. ఇంతకీ వాడు అడిగింది ఏమిటంటే...._

*“బాతుని కోస్తే తప్పేంటి టీచర్... బాతు కడుపులో గుడ్డు తయారవుతుంది కానీ... బంగారం తయారు కాదు గదా...! అందుకే బాతుని కోసి చూశాడేమో టీచర్... యజమాని తప్పేం లేదుగా? కాదంటారా?”* _అనడిగాడు._

 

 _ఈ మధ్య మా స్కూళ్ళ లో 'నిజాయితీ పెట్టె' లు పెట్టాలని విద్యాశాఖ సూచించింది. ఏ పిల్లవాడికైనా ఏదైనా దొరికితే దాంట్లో వేయాలి. టీచర్ దాన్ని తీసి అది పోగొట్టుకున్న పిల్లలకి అందజేస్తాడు. ఇది పిల్లల్లో నిజాయితీని పెంచుతుంది. పిల్లలు కూడా ఏవి దొరికినా ఉత్సాహంగా దాంట్లో వేస్తున్నారు. మొన్నీమధ్య *'తిరుపతి* నా పెన్ను దొంగతనం చేసాడు సార్' అంటూ రాధిక అనే అమ్మాయి నాకు కంప్లయింట్ చేసింది. “అవును... వాడు పెన్ను దొంగతనం చేసాడు సార్..” అంటూ పిల్లలందరూ చెప్పారు._

_తిరుపతి గాడిని పిలిచి అడిగితే మౌనంగా ఉండిపోయాడు. వాడి బ్యాగ్ తీసి పుస్తకాలు బయట పడేసి వెతికినా దొరకలేదు. చివరికి గట్టిగా అడిగితే... నేనే తీసాను అని ఒప్పుకున్నాడు. “ఎక్కడ దాచావురా” అని అడిగితే... నిజాయితీ పెట్టిని చూపించాడు. నాకు ఆశ్చర్యమేసింది._ 


_పెట్టెని తెరచి చూస్తే... రాధిక పెన్ను అందులో ఉంది._

_“దాంట్లో ఎందుకు వేసావురా?” అనడిగాను. “రోజూ అందరికీ ఏవేవో దొరుకుతున్నాయి. పెట్టెలో వేస్తున్నారు. నాకేం దొరకట్లేదు... అందుకే పెన్ను తీసి అందులో వేసాను” అని చెప్పాడు. నాకు బుర్ర తిరిగిపోయింది. పిల్లలందరిలోను ఒకటే ప్రశ్న..._

_తిరుపతి దొంగనా... నిజాయితీ పరుడా... దొంగతనం చేసాడు కాబట్టి... దొంగే కదా సార్... అన్నారు కొందరు. పెట్టెలో వేసాడు కాబట్టి నిజాయితీ పరుడే కదాసార్... అని మరి కొందరు పిల్లలు వాదించారు. చివరికి వాడు *నిజాయితీ పరుడే* అని వాళ్లని సమాధాన పర్చడానికి ఒక పీరియడ్ అయిపోయింది. ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలకి సమాధానం దొరక్క చాలా మంది టీచర్లు సహనం కోల్పోతారు._ 


 *ముఖ్యంగా తరగతి గదిలో దొంగతనం, కులం ఈ రెండు ఉద్రిక్తతని సృష్టిస్తాయి.*


 _అలాగే కులం ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు *వేదవతి* అనే పాప గుర్తొస్తుంది. శ్రీరాములపల్లె స్కూల్లో పని చేసేటప్పుడు... మధ్యాహ్న భోజనం సమయంలో ప్రతి మంగళవారం ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టేవాళ్లం._ 


_మూడో తరగతి చదివే వేదవతి అనే పాప మాత్రం తన ప్లేటులో వేసిన గుడ్డుని టీచర్లు చూడకుండా వేరే పిల్లలకి ఇచ్చేది. ఓసారి అది గమనించిన నేను హెడ్ మాస్టర్ కి చెప్పాను. ఆయన పాపని పిలిచి గుడ్డు తింటే గుండెకు బలం వస్తుందని బుజ్జగించి మరీ మరీ చెప్పటంతో చాలా ఇష్టంగా కోడిగుడ్డు తింది._ 


_ఆ తర్వాత వేదవతి నాల్రోజుల వరకూ పాఠశాలకు రాలేదు. అనుమానంతో నేనూ, హెచ్.ఎం. కల్సి వాళ్లింటికి వెళ్లాం. మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ దాడి చేసినంత వేగంగా కయ్యానికి దిగింది._

*“మేం బ్రాహ్మలం... మా పాపచేత  కోడిగుడ్డు తినిపిస్తారా... మీ స్కూల్ కి నా బిడ్డని చస్తే పంపించం.”* _అంటూ గొడవ పడింది. గుడ్డు తిన్న పాపానికి వేదవతిని బాగా కొట్టినట్టుంది. జ్వరంతో పడుకుంది. మమ్మల్ని చూడగానే భయంగా.... నీరసంగా లేచి నిల్చుంది._ 


_కోడిగుడ్డు శాఖాహారమే అంటూ మహాత్మగాంధీ చెప్పిన మాటలు కూడా ఆమె దగ్గర ఏం పని చెయ్యలేదు. చివరికి పాప చదువు పాడైపోతుందని, కోడి గుడ్డు తనకి పెట్టించమని మేం హామీ ఇచ్చాక గానీ బడికి పంపడానికి ఒప్పుకోలేదు._


_వేదవతి జ్వరంతోనే మర్నాడు స్కూల్ కొచ్చింది. వేదవతి మెల్లిగా తలొంచుకొని నా దగ్గర కొచ్చింది. “హోం వర్కు చేసావా?” అనడిగాను. మాట్లాడలేదు. నిమిషం సేపు నిశ్శబ్దంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ..._ *“మేమెందుకు కోడిగుడ్డు తినకూడదు సార్?”* _అనడిగింది. ఎవరో గుండెమీద సర్రున చరిచినట్లయింది నాకు... ఆ ప్రశ్నకు ఏ సమాధానం లేదు నా దగ్గర..._ 

_ఇంట్లో స్వేచ్చని చంపే ఆచారాలు బడిలో కూడా ఎంతగా ప్రభావం చూపిస్తాయో వేదవతి ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది._ 


_“దానికి బదులు నీకు అరటిపండు తెప్పిస్తాను సరేనా” అని భుజం తట్టి పంపించాను._


*_పిల్లల ప్రశ్నలకు మనసంతా నమ్మకం నిండేలా జవాబు చెప్పకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. వాళ్ల అనుమానంలోంచి పుట్టే ప్రశ్నకి రాగద్వేషాలుండవు._* 


_సి.నా.రె.కి జ్ఞానపీఠం అవార్డు వచ్చాక చాలామంది పండిత పామరులు రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసారు. ఓసారి స్కూల్ పిల్లలు కూడా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. మేధావులెవరూ అడగని ప్రశ్న ఒక పాప అడిగింది._

' *మీ పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి కదా. మరి మీ పేరు ముందు 'ఎస్' రావాలిగాని సి' ఎలా వస్తుంది?"* అని.

_ఆయన ఆశ్చర్యపోయారట... ఇప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్న... “పదో తరగతి మార్కుల మెమోలో 'ఎస్'కి బదులు 'సి' అనీ పడిందమ్మా అప్పట్నించి సి. నారాయణరెడ్డి అనే పిలుస్తున్నారు' అని నవ్వేసారట._  


_తరగతిగది లోపల పుట్టే ప్రశ్నలో నిజాయితీ ఉంటుంది._ *సమాధానం కూడా అంతే నిజాయితీగా లేనప్పుడు రానురాను వాళ్లు ప్రశ్నలు వేయటం మానుకుంటారు.* 


 *ప్రశ్నించే స్వేచ్చని పాఠశాలల్లో బాగా విస్తరిస్తే*  ప్రతి  పాఠ్యాంశం గురించి మేమంతా హోంవర్క్ చేసుకోవాల్సిందే...


*==================*

*(ఈ ప్రశ్నలకు జవాబు మీకెవరికైనా తెలిస్తే చెప్పండి)*

మన ఆరోగ్యం

 *💁🏻‍♂️ మన ఆరోగ్యం 👌 *

〰〰〰〰〰〰〰〰

*👉1. ఆయుర్వేద చిట్కా: దంత సంరక్షణ*


*మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. దంత సంరక్షణ చాలా అవసరమని ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుతం రకరకాల పేస్టులు వచ్చాయి. కానీ, పూర్వపు రోజుల్లో వేప బెరడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునే వారు. ఇలా చేయడం వలన వారి దంతాలు ఆరోగ్యంగా ఉండేవి.* *ఆయుర్వేదంలో కూడా వేపతోనే దంతాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజా వేపపుల్లతో లేదంటే, బొగ్గుతో పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.*


*👉2. మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా?*

*టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనలు నిరూపించాయి. అలా చేస్తే టీ రుచి, వాసన, టానిన్లను కోల్పోతుంది.* *చెడిపోయిన టీలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దాన్ని వేడి చేసి తాగితే అనారోగ్యం. హెర్బల్ టీని మళ్లీ వేడిచేస్తే పోషకాలు తగ్గిపోతాయి. ఇలా టీని ఎక్కువసార్లు వేడి చేసి తాగితే.. కడుపునొప్పి, అతిసారం, వికారంలాంటివి రావొచ్చు.*

*♨ 4 గంటలకు పైగా నిల్వఉంచిన టీని మళ్లీ వేడి చేసి తాగకండి*


*👉3. మైగ్రేన్‌కు ఇలా చెక్ పెట్టండి!*


*ఈ రోజుల్లో మైగ్రేన్ చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. రోజుకు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర కావాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, టైంకి భోజనం చేయాలి. కెఫెన్‌ కలిగిన పానీయాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగాలాంటివి సహకరిస్తాయి. తలనొప్పికి దారితీసే కారణాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండాలి. మెడిసిన్ రెగ్యూలర్‌గా వాడుతూ, అలవాట్లు మార్చుకోవాలి.*


*👉4. కిడ్నీ సమస్యలను ఇలా గుర్తించండి.*


1. *మూత్రం తక్కువగా రావడం.*

2. *రాత్రివేళల్లో అతిమూత్రం*

3. *మూత్రంలో నురుగు రావడం*

4. *ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు*

5. *ముఖం లేదా శరీరం ఉబ్బడం*

6. *హై బీపీ*

7. *మూత్రం ఎర్రగా లేదా కోలా రంగులోకి మారడం*

8. *చూపు మందగించడం*

❤ *రోజూ కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. పెయిన్ కిల్లర్లు అతిగా వాడొద్దు.*


*👉5. తిన్నాక నడక మంచిదేనా?*


*భోజనం తిన్న తర్వాత నడక మంచిదే అంటున్నారు పరిశోధకులు. తాజాగా 30 వేలమందిని వారం పాటు తిన్న తర్వాత నడిపించి శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాకింగ్ వల్ల వారిలో గుండెకు సంబంధించిన రిస్క్ 20 శాతం తగ్గిందట. గ్యాస్, ఎసిడిటీ సమస్యలూ తగ్గినట్లు గుర్తించారు. నడక వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి శరీరానికి పోషకాలు అందుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ నడక డయాబెటిస్ పేషంట్లకు మరీ మంచిదని స్పష్టం చేశారు.*

Thursday, August 31, 2023

భార్య కోపం

 🌼 భార్య  కోపం వలన, భర్త అర్థరాత్రి ఇంటి నుండి బయటకు పోవలసి వచ్చింది... దానివలన ప్రపంచ మానవాళికి విప్లవాత్మకమైన గొప్ప ఆవిష్కరణ జరిగింది.

✌️✌️✌️✌️✌️


*👍ఈ సంఘటన 2004లో జరిగింది. ప్రస్తుతం, గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఆ సమయంలో అమెరికాలో కెరీర్‌ను పెంపొందించు కోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకసారి అతని పరిచయస్థుల్లో ఒకరు అతనిని తన ఇంటికి భోజనానికి పిలిచారు. సుందర్ తన భార్యతో కలిసి వెళ్లాల్సి రావడంతో భార్యతో కలిసి ప్లాన్ వేశాడు. తను  ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఆఫీస్ అయ్యాక నేరుగా ఆహ్వానం పలికిన ఇంటికి భోజనానికి వెళతానని సుందర్ చెప్పాడు. ఇంటి నుంచి నేరుగా అక్కడికి చేరుకోవాలని భార్యను కోరాడు. భార్య ఇంటి నుండి నేరుగా డిన్నర్‌కి వెళ్లాలి మరియు సుందర్ పిచాయ్ ఆఫీసు నుండి నేరుగా భోజనానికి చేరుకోవాలి.*


*రాత్రి 8 గంటలకు విందు కార్యక్రమం. సుందర్ పిచాయ్ భార్య అంజలి తన కారులో రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు భోజనానికి హోస్ట్ ఇంటికి చేరుకుంది. సుందర్ పిచాయ్ కూడా ఆఫీస్ నుండి బయల్దేరి  వెళ్లిపోయాడు, కానీ అతను మార్గమధ్యంలో దారి తప్పిపోయాడు. అతను  అక్కడికి చేరుకునేసరికి దాదాపు 10 గంటలైంది. అప్పటికే  పిచాయ్  భార్య అక్కడి నుంచి రాత్రి భోజనం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు పిచాయ్‌ సాహిబ్‌ పరిస్థితి విషమంగా మారింది. కారణం, అమెరికన్లు సమయపాలన పాటించడం వల్ల విందు ఆచారాలన్నీ పూర్తయ్యాయి. సుందర్ పరిస్థితి విషమంగా అయింది.  అయితే హోస్ట్ పిచాయ్ రాకకు ఘన స్వాగతం పలికి గుడ్ బై చెప్పారు*


*అక్కడి నుంచి ఏమీ తినకుండానే సుందర్ పిచాయ్ తన ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి చేరుకోగానే భార్య అంజలి చిరాకుపడి అతనితో గొడవ పెట్టుకుంది, కారణం, అతను సమయానికి విందుకు  చేరుకోలేదు మరియు అతని భార్య అవమానించబడింది. అంజలి  మానసిక స్థితిని చూసిన సుందర్ పిచాయ్ మళ్లీ ఆఫీసుకు తిరిగి వెళ్ళడం  సముచితం అనుకున్నాడు. (భార్య కోపంతో ఇంట్లోకి రానివ్వలేదని కొందరు అంటున్నారు)*


*ఏమైనా సరే, ఇప్పుడు సుందర్ తిరిగి ఆఫీసుకు చేరుకున్నాడు మరియు రాత్రంతా అక్కడే గడిపాడు. రాత్రంతా ఇలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు - నాలాగే   రోజూ చాలా మంది దారి తప్పి పోయే అవకాశం ఉంది.  అదే విషయం రాత్రంతా ఆలోచిస్తూ, మ్యాప్ జేబులో పెట్టుకుని, దిక్కు కరెక్టుగా ఉంటే తను దారి తప్పేవాడిని కాదని అనుకున్నాడు.*


*మరుసటి రోజు ఉదయం సుందర్ పిచాయ్ తన టీమ్ మొత్తానికి ఫోన్ చేసి మ్యాప్ తయారు చేయాలనే ఆలోచనను అందరి ముందు ఉంచాడు. ఈ ఆలోచన విన్న టీమ్ చేతులు ఎత్తేసింది. టీమ్ అతని ఆలోచనను నమ్మలేదు, కానీ దాదాపు రెండు రోజుల పాటు టీమ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి, ప్రజలకు మార్గం చూపే ఉత్పత్తి(App)ని రూపొందించమని వారిని ఒప్పించాడు.*


*సుందర్ పిచాయ్ మరియు అతని బృందం కష్టపడి 2005లో గూగుల్ మ్యాప్‌ని తయారు చేసి అమెరికాలో ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే 2006లో ఇంగ్లండ్‌లో, 2008లో భారత్‌లో లాంచ్‌ చేశారు.. ఇప్పుడు వారు రూపొందించిన మ్యాప్‌లు యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపే పని చేస్తున్నాయని ఇప్పటికే మీకు తెలుసు. ఒక స్టడీ  ప్రకారం, మొత్తం ప్రపంచంలోని ప్రతి ఏడవ వ్యక్తి Google Mapsని ఉపయోగిస్తున్నారు.*


*కథ పెద్దదిగా ఉంది కదా! కానీ, ఇది నిజంగా జరిగిన సంఘటన.* 


 *కాబట్టి కొన్నిసార్లు మీ భార్య మీపై కోపం తెచ్చుకోవచ్చు.  చింతించకండి. ఆ కోపంలో భవిష్యత్తులో ఏదో ఒక చారిత్రక ఆవిష్కరణ దాగి ఉందేమో ఎవరికి తెలుసు!!!*

👏👏👍👍🙏🙏💐💐

Wednesday, August 23, 2023

కాబోయే టీచ‌ర్లు

 

కాబోయే టీచ‌ర్లు




'గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!'

రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌.

మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్‌ ఈ అబ్బాయి.

నా ఇంగ్లీష్‌ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్‌ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. ఇదొక్కటే నాతో ఎంత కష్టమనిపించినా వారి భాషను కూడా నేర్చుకునేలా చేసి వారికి దగ్గరిచేసింది. కొన్ని పోస్టులు సరైన క్యాండిడేట్లు దొరక్క మిగిలి ఉండిపోతాయి. అప్పుడు చివుక్కుమంటుంది. మిగతావాళ్లు మరికొంచెం బాధ్యత తీసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. వీళ్లలో ఎక్కువమంది ఇంగ్లిష్‌ మెథడాలజీ తీసుకుంటారు. ఎక్కువ పోస్టులు ఉంటాయి. సింగిల్‌ టీచర్స్‌ స్కూళ్లలో ఈసారి బ్యాచ్‌లో పది మంది ఉన్నారు. అందులో ఏడుగురు ఇంగ్లిష్‌ తీసుకున్నారు. అయితే సోషల్‌, లేదా లెక్కలు మొదటి మెథడాలజీ, రెండవది ఇంగ్లిష్‌. తెలుగు తీసుకోవడానికి ఇష్టపడరు వీళ్లు. అలాగని ఇంగ్లిష్‌ వచ్చని కాదు అస్సలు రానిది. ఇంగ్లిష్‌ తీసుకుంటే ఉపయోగం అని తర్వాత ఇంకా అభివృద్ధి ఉంటుందని.

'ఏమిట్రా... పొద్దున్నే' విసుగ్గా అన్నా నవ్వుతూనే. స్టాఫ్‌రూమ్‌ వైపు నడుస్తుంటే నాతో బాటే నడిచి వస్తున్నాడు తాను కూడా.

'ఏమిటి సంగతి వెంటబడ్డావ్‌?' నవ్వుతూ అడిగా.

' మరే మరండీ మేడమ్‌ ....'

'ఏంట్రా నసుగుడు, వెళ్ళండి అందరూ ప్రాక్టికల్స్‌కి తయారు అవ్వండి. నిన్న లెసన్స్‌ ఎలాట్‌ చేశాను కదా..!

వాటికి నే చెప్పిన మోడెల్స్‌ని తయారు చేస్కోవాలి. ఎక్స్‌టర్నెల్స్‌ కన్నా ముందు నా దగ్గర చెప్పాలి అర్థమైందా? ఏరీ మీ మిగిలిన మీ కాబోయే టీచర్లూ' ఎప్పుడూ వాళ్ళని కాబోయే టీచర్లనే అంటాను. అలా వారి చదువు గొప్పదనం గుర్తుచేస్తుంటాను. కొండ దొరలు అని కూడా అంటూ ఉంటాను. అలా వారి పెద్ద మనసుని మెచ్చుకుంటాను. నేను అంటే మిగిలిన లెక్చరర్స్‌ కూడా అలాగే అనడం, చివరికి స్టూడెంట్స్‌ స్టాఫ్‌ అందరూ వాళ్ళని అలాగే పిలుస్తారు. వాళ్ళు మాత్రం ఏమీ అనుకోరు. అసలేమైనా అనుకోవాలని కూడా తెలియని పుట్ట తేనియ అంత స్వచ్ఛమైన మనసులు వాళ్లవి.

'అదే మేడమ్‌ మాకిచ్చిన లెసన్స్‌ అన్నిటికీ మోడల్స్‌ తయారు చేసేసాం, కానీ ...మరి ....'

'అయితే ఇంకేం తెచ్చేయండి ఈ రోజు ఓ సారి ప్రాక్టీస్‌ చేసేసుకుందాం. అసలే రేపు మనకి వచ్చే ఇంగ్లీష్‌ ఎక్స్‌టర్నెల్‌ చండశాసనుడు అంట' బ్యాగ్‌ సొరుగులో పెట్టి నా బీరువాలో బుక్స్‌ తీయడానికి తాళం తీస్తున్న కొండా... ఒక్కసారి ఏడుపు మొదలు పెట్టాడు. 'హే కొండా! ఎందుకలా ఏడుస్తున్నావు?' నాకు చాలా జాలి అనిపించింది.

'అది కాదు మేడమ్‌! లెసన్‌ ప్లాన్స్‌ అన్నీ రాసేశాం. కానీ, లెసన్‌ చెప్పాలంటే భయంగా ఉందమ్మా'

వాళ్ళందరూ క్లాస్‌ బయట నన్ను అమ్మా అంటారు. క్లాస్‌లోనే మేడమ్‌ అంటారు. వాళ్ళ పట్ల నేను చూపే ఆత్మీయత బహుశా నన్ను వాళ్లకి దగ్గర చేసింది. అందరు స్టూడెంట్స్‌ తోనూ ఆత్మీయంగా ఉండటం నా మనస్తత్వం. భుజానికి కళ్ళు తుడుచుకుంటూ తాను అలా చిన్న పిల్లాడిలా చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది.

ఇది ప్రతి బ్యాచ్‌లోనూ నేను ఫేస్‌ చేస్తాను. వీళ్ళే కాదు, ఇంకా అసలు ఇంగ్లీష్‌ రాని వాళ్ళు కూడా మంచి అవకాశం వస్తుంది డీఎస్సీలో అని ఇంగ్లీష్‌ తీసుకుంటారు. కానీ, పాఠాలు చెప్పేదగ్గరికి వచ్చేటప్పుడు ఇలాగే డీలా పడిపోయి ఏడుస్తారు. ఒక్కొక్కసారి బాగా జ్వరం పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఎక్కువ ఇంగ్లీష్‌ వాళ్లకే ఎదురవుతాయి. మళ్ళీ లెక్కలు కానీ, సోషల్‌ కానీ, సైన్స్‌ కానీ ఎంత బాగా చెప్తారో..! తెలుగులో కదా..! ఈ కొండా చేతి రాత చూస్తే అసలు ఏ కాన్వెంట్‌లో చదువుకున్న వాడైనా పనికి రాడు, ముత్యాలు పేర్చినట్టు ఉంటుంది.

'కొండా, నువ్వు వరాలు, లచ్చుం నాయుడు, మీరంతా మొన్న నా దగ్గర బాగానే చెప్పారు కదా నాన్నా..! అలా భయపడితే ఎలా? నేనుంటాను కదా మీ పక్కనే' అనునయంగా అన్నాను.

'మే ఐ కమ్‌ ఇన్‌ మాడమ్‌' గుంపుగా పదిమంది ముగ్గురు ఆడపిల్లలు, ఆరుగురు మగ పిల్లలు అందరూ నా స్టూడెంట్సే గుమ్మం దగ్గర నిలబడ్డారు.

'యెస్‌ కమ్‌ ఇన్‌...! ఏంటర్రా అందరూ కట్ట కట్టుకుని వచ్చారు?'

'అదే మేడమ్‌ మీతో మాటాడాలి అని..' అందులో బాగా మాట్లాడేది ఎరికమ్మ. తాను సోషల్‌, ఇంగ్లీష్‌ అమ్మాయి. సోషల్‌ పాఠం ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా ఎంత బాగుంటుందో..! నేను నా పాఠాలు అయ్యాక సోషల్‌ పాఠాలు కూడా వింటుంటా. మంచి సామాజిక అవగాహన అన్వయంతో చెప్తారు పిల్లలు.

'ఏంట్రా మాటాడేది ఫైనల్‌ ప్రాక్టికల్స్‌లో మీ పాఠం నన్ను చెప్పమంటారా ఏంటి ?'

'అది కాదు మేడమ్‌ భయంగా ఉంది'

'ఓర్నీ భయమెందుకు నా దగ్గర చెప్పలేదూ, ఎలా సులువుగా చెప్పాలో మీకు నేర్పలేదూ నేను, మరి ఇప్పుడిలా భయపడితే ఎలా?'

'మీ దగ్గర చెప్పాలంటే ధైర్యంగా ఉంటుంది మేడమ్‌. కానీ, బయట వాళ్ల దగ్గర ....' నసిగింది దేవమ్మ. తాను లెక్కలు, ఇంగ్లీష్‌ స్టూడెంట్‌.

'భలే చెప్తున్నారు రా! మీరు.. ఎన్ని బ్యాచులు మీలాంటి వారిని పంపించాను. ఎన్ని సార్లు చెప్పాను. భయపడకూడదు అని'

'అవును మరి మీ దగ్గరైతే ధైర్యంగా చెపుతారు, మీరు ఉంటారు కనుక. మీకు ప్రతి బ్యాచ్‌కి ఈ ప్రహసనం అలవాటేగా' నవ్వుతూ అంది ఫిలాసఫీ లెక్చరర్‌. మమ్మల్ని అంటే బీ.ఎడ్‌ లెక్చరర్స్‌ని టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అంటారు.

'ఏం చేస్తాం మణీ! ఈ ఇంగ్లీష్‌ ఉందే ఇదొక మహమ్మారిలా భయపెడుతుంది.' నవ్వేను.

'కానీ, మీరు ఉండబట్టి ఎక్కువ మంది ఇంగ్లీష్‌ తీసుకుంటారు మరి. మీరు ఆ మహమ్మారికి భయపడకుండా చేస్తారుగా. అయినా మీరు ఉండగా వాళ్ళకు భయమెందుకు? ఓరు హలో! మీరు ముందు నా సబ్జెక్ట్‌ రికార్డ్‌ సబ్మిట్‌ చేయండి. లాస్ట్‌ డేట్‌ రేపే, మీకు తెలుసుగా రేపు గాని ఇవ్వక పోయారో ఎల్లుండి ఇచ్చినా చించేస్తాను.' బెదిరింపుగా అంది మణి. అనడం కాదు, ఆమె నిజంగానే చించేస్తుంది. ఆమె అంటే అందరికీ భయం కాలేజ్‌లో.

'మేము అందరం ఇచ్చేశాం మేడమ్‌' మమ్మల్ని ఎందుకు అంటావు అన్నట్లు ఉక్రోషంగా సమాధానం చెప్పింది సత్తమ్మ.

'ఊ సరే సరే పదండి నా క్లాస్‌ ఉంది' అంటూ నడిచింది మణి.

'వెళ్ళండి. మీరంతా క్లాస్‌కి కంగారు ఏమీ లేదు నేనున్నాగా చూసుకుంటా' అందరూ భయంగా నెమ్మదిగా క్లాస్‌కి వెళ్లేరు.


'ఏంటి మమ్మీ డల్‌గా ఉన్నావు స్ట్రెయిన్‌ ఎక్కువైందా కాలేజ్‌లో?' అడిగింది దివ్య.

'లేదురా, ప్రతి ఏడాది లాగానే మళ్ళీ ప్రాక్టికల్స్‌ రేపు. ఉదయం రోజూ కంటే చాలా

ముందరే బయల్దేరాలి. ఆరుగంటల బస్సుకే వెళ్తాను.'.

కాలేజ్‌కి రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి రోజూ, మేముండే సిటీకి

కాలేజ్‌ ఉండే చోటు సబర్బన్‌లో ఉంటుంది.

'ఓహౌ వచ్చేసిందా నీకు పరీక్ష రోజు! అబ్బా ఇప్పటికీ పదేళ్ల నుంచి చూస్తున్నాను.. వాళ్లకి పరీక్షలైతే నువ్వు కంగారు పడటం. ఆ మణి గారు, తెలుగు సార్‌, సోషల్‌ సార్‌, ఫిజిక్స్‌ ప్రసాద్‌ సార్‌ చూడు ఎంత హాయిగా ఉంటారో..! నువ్వు మాత్రం నా ఎగ్జామ్స్‌కి కూడా టెన్షన్‌ పడవు. కానీ, మీ కాలేజీ పిల్లల పరీక్షలంటే మాత్రం... అబ్బా లే మమ్మీ..! టీవీలో నీ ఫేవరెట్‌ సినిమా వస్తోంది. 'ముఘల్‌ ఏ ఆజమ్‌' చూద్దాం రా' చెయ్యి పట్టుకుని లాగింది పాప.

'ఏమి చేస్తాం రా! ప్రతి సారీ ఇదే ....' ఏదో చెప్పబోయాను.

'మాతా.. ధరణీ.. ఇంక మేము నీ సుత్తి భరించలేం గానీ లే..! సినిమా చూద్దాం' చెయ్యిపట్టుకుని లాగి నిలబెట్టింది పాప. నేను పడుతున్న బాధ తనకేం తెలుసు చిన్న పిల్ల. మౌనంగా హాల్‌లో టీవీ దగ్గరికి కదిలాను.


విద్య మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. విద్యా, ఆరోగ్యం ఈ రెంటినీ ప్రైవెటైజ్‌ చేయొద్దని మహామహులు చెప్పినా మన ప్రభుత్వాలు ఎల్పీజీ (లిబరలైజేషన్‌- ప్రైవేటైజేషన్‌-గ్లోబలైజేషన్‌) అంటూ చేయనే చేసింది. ఒక ఇంజినీరు మంచివాడు కాకుంటే ఒక బ్రిడ్జ్‌ కూలిపోతుందేమో..! కానీ, ఒక ఉపాధ్యాయుడు మంచివాడు కాకుంటే ఒక తరం పాడైపోతుంది. ఒక టీచర్‌ కనీసం 100 మందికి పాఠం చెప్తే ఆ పాఠాల్లో నాణ్యత లేకుంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు.. ఏమి చదువుతారు? ఇన్ని బి.ఎడ్‌ కళాశాలలు ఉండి కొందరు మంచి ఉపాధ్యాయులనైనా తయారు చేయగలుగుతున్నామా..! అన్నది నన్నెప్పుడూ వేధించే ప్రశ్న. బి.ఎడ్‌లో చాలా చిత్రమైన విద్యార్థులు వస్తారు. కొంతమంది డిగ్రీ నుంచి వస్తే.. మరి కొంతమంది పీజీ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంక ఏజ్‌ లిమిట్‌ ఎక్కువ ఉంది కనుక, కొందరు ఎప్పుడో డిగ్రీలు చేసి వదిలేసినా ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాస్త ఎదిగాక టీచర్లుగా ఉద్యోగాలు చేద్దామని చదవడానికి, పెళ్ళైన ఇల్లాళ్లు, పిల్లల తల్లులు వస్తారు. 'ఏంటి అమ్మా నీ కన్నా నీ స్టూడెంట్స్‌ పెద్దగా ఉన్నారు' అంటుంది పాప. ఇన్‌-సర్వీస్‌ హెచ్చార్స్‌ కూడా వస్తారు. అందరినీ స్టూడెంట్‌ టీచర్స్‌ అంటాం. మామూలుగా కాలేజ్‌ చదువు చెప్పినట్టు ఉండదు బి.ఎడ్‌. రకరకాల ఏజ్‌ గ్రూప్స్‌ కుటుంబ నేపథ్యాలు, ఇంకా కొందరు జీవితంలో నష్టపోయినవారు మళ్ళీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి వస్తారు. 

విడాకులు పొందిన అమ్మాయిలు, భర్తలు పోయినవారు, రకరకాల మనస్తత్వాలు. అందరినీ డీల్‌ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బాగా చదువుకునే మెరికల్లాంటి పిల్లలు కూడా ఉంటారు. అందరికీ డిగ్రీలోనో ఇంటర్మీడియట్‌లో చెప్పినట్టు ఒకే మూసలో చెప్పేయడం కుదరదు. కొందరు ఎంతో బాగా చదువుతారు, పాఠాలు చెప్తారు. నేను ఇంగ్లీష్‌ చెప్తాను, సైకాలజీ చెప్తాను. ఉపాధ్యాయులుగా వాళ్ళు పిల్లల మనస్తత్వాలను అర్థం చేస్కోవాలి. అందుకే, మనస్తత్వ శాస్త్రం. కానీ, అది నేర్పేటప్పుడు వీళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకుని నేర్పాలి. అందరి కంటే కాస్త వయసులో పెద్ద కనుక అందరినీ అర్థం చేసుకుంటాను కనుక, నన్ను మా స్టూడెంట్స్‌ అందరూ బాగా ఇష్టపడతారు. వాళ్ళని మంచి టీచర్లుగా తయారు చేయలేమా... అన్న ఛాలెంజ్‌ నాకు నేనే చేసుకున్నాను. అందుకే ఇంత ఆలోచన, శ్రమ.

ప్రతి బ్యాచ్‌ చివరి రోజు ఫేర్వెల్‌ నాడు.. ఒకటే చెప్తాను. 'డియర్‌ స్టూడెంట్స్‌ మీరందరిలోనూ మంచి టీచరు లక్షణాలు ఉన్నాయి. మీలో కొంతమంది డియస్సీ సాధించి ప్రభుత్వ టీచర్లు అవుతారు, కొందరు ప్రైవేట్‌ స్కూల్స్‌లో కార్పొరేట్‌ స్కూల్స్‌లో టీచర్స్‌ అవుతారు, వీళ్ళకి ఎలాగూ తప్పదు. బాగా చెప్పకపోతే తీసేస్తారు. కానీ, గవర్నమెంట్‌ టీచరు జాబ్‌ వచ్చిందా! మీరింక చదవరు.. నాకు తెలుసు, అయితే అందరికీ ఒకే మాట. మీరు గనుక టీచర్స్‌ అయితే దయచేసి అప్పుడప్పుడైనా సిన్సియర్‌గా పాఠాలు చెప్పండి ప్లీజ్‌. దేశ భవితవ్యం తరగతి గదుల్లో నిర్మింపబడుతుంది అని కొటేషన్‌ రాయడం కాదు, నిజంగా క్లాస్‌రూములు రాబోయే తరాలను తీర్చిదిద్దే ఆలయాలని గుర్తు పెట్టుకుని మసలుకోండి. ఇది నా సందేశం కాదు విన్నపం. ఇక్కడ మీరు ఏ పాఠాలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. దానికి ఇంకా మీ తెలివితేటలు కృషి జోడించితే మంచి ఉపాధ్యాయులు అవుతారు. జాతి నిర్మాతలవుతారు. నేనేదో ఉద్విగంగా మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారు. కానీ, మీ జీవితంలో మీ టీచర్‌ వృత్తిలో మీరెప్పుడూ నిత్య విద్యార్థిగా ఉంటే మంచి విద్యార్థులను తయారు చేయగలుగుతారు. అమ్మ ప్రేమ, నాన్న శిక్షణ రెండు అందించే స్నేహితుడిలాంటి మంచివారు టీచర్లు. మీ అందరూ మంచి ఉపాధ్యాయులుగా దేశానికి మంచి పౌరులను అందించేవారిగా కొనసాగాలని నా ఆశ, ఆశీర్వాదం..'

నా మాటలు ఊరికేపోవు కొందరు మంచి పేరు తెచ్చుకుని వచ్చినవాళ్లున్నారు. నేను పంపిన నాలుగో బ్యాచ్‌ అనుకుంటా... వాసు అనే అబ్బాయికి బెస్ట్‌ టీచర్‌ అవార్డ్‌ వచ్చింది. ఇలా ఎక్కడెక్కడో మా స్టూడెంట్స్‌ గురించి ఎవరెవరి నుండో వింటుంటాం. అదే ఈ వృత్తిలో ఆనందం తృప్తీ. అయితే వాళ్ళని పరీక్షలు పాస్‌ చేసేటప్పుడు మాత్రం చాలా సంఘర్షణకు గురౌతాను. ప్రాక్టికల్స్‌, రికార్డ్స్‌ మార్కులు ఏడువందల మార్కులు మా చేతిలో ఉంటాయి. అందుకే బి.ఎడ్‌ లెక్చరర్లు అంటే స్టూడెంట్స్‌ చాలా విలువ ఇస్తూ భయంగా మసలుతారు.

స్టూడెంట్స్‌కి అందరికీ మళ్ళీ పర్సంటేజ్‌ బాగుండాలి. రాత పరీక్షలలో తగ్గినా ప్రాక్టికల్స్‌లో అందరికీ ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు వేయాలి. పరీక్షల పేపర్లు కరెక్ట్‌ చేసేటపుడు కూడా ఇదే బాధ నాకు. ఎప్పుడూ ఒకటే ఆలోచన నన్ను వేధిస్తుంది. 'నాణ్యత లేని ఉపాధ్యాయులను తయారు చేసి దేశం మీదకి వదిలి ద్రోహం చేస్తున్నామా మేము.

(ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులం కదా) లేక కేవలం ఈ డిగ్రీ ఉంటే జీవనోపాధి కల్పించుకుని బతకాలనుకునే వారికి సహాయం చేస్తున్నామా? ఇదే ఎప్పుడు నా మదిని వేధించే ట్రిల్లియన్‌ డాలర్‌ ప్రశ్న! విద్యా నాణ్యతా ప్రమాణాలు గురించి పట్టించుకోని ప్రభుత్వాలు, అందుకే కార్పొరేట్‌ స్కూల్స్‌లో తమ పిల్లలను కడుపుకట్టుకుని చదివిస్తోన్న తల్లితండ్రులు. అలాగని పోనీ, కార్పొరేట్‌ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలు బాగున్నాయా అంటే... అదొక నరకకూపం పిల్లలకి. నూరి రుబ్బి పిల్లల్ని బండ మెషీనుల్లాగా తయారు చేస్తున్న మన విద్యా సంస్థలు. ఏ దేశం, ఏ వ్యవస్థ బాగుపడాలన్నా అది విద్య మీద కదా ఆధారం. అలాంటి విద్యని నాణ్యంగా ఎందుకు అందించలేకపోతున్నాం అన్నదే నా వ్యధ!!!


ప్రాక్టికల్స్‌ రోజు వచ్చిన ఎక్స్‌టర్నెల్‌తో మాట్లాడుతూ పిల్లలతో పాఠాలు చెప్పించేస్తాను నేను. ముందు బాగా చెప్పే వాళ్ళని ముందు పెట్టి, తర్వాత కాస్త వీక్‌గా ఉన్న వాళ్ళు చెప్పేటప్పుడు అవతలి వాళ్ళని మాటల్లో పెట్టి సర్దేస్తుంటాను.

మేము ఎలా చెపితే అలా మార్కులు వేసేస్తారు.. సహజంగా వచ్చినవాళ్ళు. ఎందుకంటే, వాళ్ళ కాలేజీలకి మేము వెళ్ళినా అంతేగా మరి. ఇలా మా పాస్‌ పర్సెంటేజ్‌ మాత్రమే మాకు కావాలి అంతే..! మా కాలేజీలు నడవాలిగా మరి.

ఈ బ్యాచ్‌లో నాకు యాభై మంది స్టూడెంట్స్‌. నిజానికి నేను గమనించాను వాళ్ళలో చాలా ప్రజ్ఞ, తపన ఉంటాయి కానీ, భయపడతారు. ఆ భయాన్ని పోగొట్టేమా వాళ్ళంత గొప్ప వాళ్ళు ఉండరు. వాళ్ళలో చదువు పట్ల గౌరవం, ఈ చదువు తాము చదివేసుకుని తమ పిల్లలను తీర్చిదిద్దుకోవాలనే తపన మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక్కడ పాఠాలు చెప్పలేకపోయినవాళ్ళు ఎందరో తర్వాత మంచి టీచర్లుగా ముఖ్యంగా ఇంగ్లీష్‌ టీచర్లుగా పేరు తెచ్చుకున్నారు.

'వావ్‌ ! ఏమి చెప్పిందండీ ఈ అమ్మాయి, నీ పేరేంటమ్మా?' వచ్చిన ఎక్స్‌టర్నెల్‌ పెద్దవారు.. సత్తమ్మ చెప్పిన టాగోర్‌ పద్యం ఎనిమిదో తరగతి పాఠం 'డే బై డే ఐ ఫ్లోట్‌ మై పేపర్‌ బోట్స్‌' విని చాలా సంతోష పడిపోయారు. 'ఇలా రామ్మా, అవునూ! సియులి ఫ్లవర్స్‌ అంటే పారిజాతాలు అని ఎలా తెలుసుకున్నావు?' వెంకట్రావు మాస్టారు చాలా సీనియర్‌ ఇంగ్లీష్‌ మాస్టారు ఆనాటి విలువలు ప్రమాణాలు పాటించేవారు. ఆయన అలా మురిసిపోతూ అడుగుతుంటే నాకు మనసు నిండిపోయింది. 'మా మేడమ్‌ చెప్పేరు సార్‌' సిగ్గుపడుతూ చెప్పింది సత్తమ్మ. 'సొ నైస్‌ ఆఫ్‌ యూ ధరణి గారూ ఇలా మీలా సిన్సియర్‌గా పాఠాలు చెప్పే వాళ్ళు ఇంకా ఎక్కడో అక్కడ ఉండబట్టే మన ఉపాధ్యాయ విద్యార్థులు నాణ్యంగా తయారువుతున్నారు. అందరూ మీలాగా సిన్సియర్‌గా చెప్తే మనం మంచి ఉపాధ్యాయులను అందించగలుగుతాం. 'ఐ కంగ్రాట్యులేట్‌ యూ' మనస్ఫూర్తిగా అన్నారు మాస్టారు. మా వెంకట్రావు మాస్టారు నుంచి అభినందన అంటే అవార్డ్‌గా భావిస్తాం మా టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అందరం. ఆ అమ్మాయి చెప్పిన పాఠం బట్టీ నన్ను అంచనా వేసి మెచ్చుకున్న మాస్టారిని చూస్తే నాకు ఆనందంతో మనసు నిండిపోయింది. మిగిలిన వారి పాఠాలను ఎలాగో గబ గబ చెప్పించేశాను అనుకోండి. మా సత్తమ్మ లాంటి వారి పాఠాలు విన్న మాస్టారు రిలాక్స్‌ అవుతుంటే కాస్త చెప్పలేని వాళ్ళు మా కొండ, ఇంకా మరి కొందరిచేత గబుక్కున పూర్తి చేసేసి హమ్మయ్య ఈ బ్యాచ్‌ దాటేసినట్టే అని ఊపిరి పీల్చుకున్నాను. నాకు వీళ్ల మీద నమ్మకం ఎక్కువ.. భవిష్యత్తులో మంచి టీచర్లు అవుతారని. ఒక్క అవకాశం ఇచ్చాం అంతే..! నా దేశాన్ని, భావితరాలను దిద్ది తీర్చే మంచి ఉపాధ్యాయులు, వారిని వారు దిద్దుకుని మంచి సంకల్పంతో.. వెనక్కి జారపడ్డాను కుర్చీలో.


Sunday, August 20, 2023

ఉపాధ్యాయుడు స్పందించాడు

ఉపాధ్యాయుడు స్పందించాడు,
ప్రాణాలు కాపాడాడు...
-----------------



పాఠశాల ప్రారంభమయ్యే సమయానికంటే అరగంట ముందే కంగారుగా వచ్చాడు తన తరగతి గది వద్దకు.....
ఎనిమిదవ తరగతి చదివే హరికృష్ణ...

కారణం...
ముందు రోజు తన బూట్లు అక్కడే గది బయట వదిలి మరచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ బూట్లు పోతే ఇంకోజత కొనలేని నిరుపేద కుటుంబం తనది. అందుకే అంత ఆత్రంగా వచ్చాడు. అవి అక్కడే ఉండడంతో ఆనందంగా వేసుకోవాలని కాలు దానిలో పెట్టాడు.

అప్పటికే అందులో ఒక నాగుపాము దూరి బూటు లో పడుకొని ఉంది. కాలు తనమీద పడగానే దానికి పారిపోయే అవకాశం లేక ప్రాణభయంతో కసితీరా కాటేసింది. ఎంత కసితో వేసిందంటే పాదం మీద కండ బయటకు వచ్చేలా.. హరికృష్ణ ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగా అమ్మా అని అరిచి బూటు ను విదిల్చాడు.

సరిగ్గా అప్పుడే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాషా గారు తన బైక్ లో పాఠశాల లోనికి ప్రవేశించాడు. హరికృష్ణ అరుపు విని బైక్ అక్కడే పడేసి పరుగున వచ్చాడు దగ్గరకు. నాగుపాము బూటు దగ్గరనుండి వెళ్ళడం గమనించి దానిని చంపేశాడు.. కాలు చూడగానే అర్థమైంది ఆయనకు పాము కాటేసింది అని. అందులోనూ విషపురుగు. ఆలస్యం చేస్తే ప్రాణం పోతుంది.

చుట్టూ చూశాడు..
ఇద్దరు విద్యార్థులు అప్పుడే లోపలకు వస్తున్నారు. వారిలో ఒకరిని రమ్మని తాను బైక్ స్టార్ట్ చేసి హరికృష్ణ ను కూర్చోమని ఆ తర్వాత ఇంకో పిల్లాడిని కూర్చోమన్నాడు. ఇంకో విద్యార్థికి హరికృష్ణ తల్లిదండ్రులకు విషయం తెలుపమని చెప్పాడు. 

క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరు విద్యార్థులను వెనకాల కూర్చొబెట్టుకొని బైకు ను ముందుకు దూకించాడు బాషా సర్.

పాఠశాల ఉన్నది చిన్న గ్రామమైన నగరూరు. హాస్పిటల్ ఉన్నది అక్కడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రి పట్టణంలో... అందులోనూ మూడు కిలోమీటర్లు రోడ్ సరిగాలేదు. నిమిషాల్లో హాస్పిటల్ కు చేరాలి. కాటు బాగా లోతుగా పడింది కాబట్టి విషప్రభావం వేగంగా ఉంటుందని అర్థమైంది. 

వెనక కూర్చున్న అబ్బాయికి తన మొబైల్ ఇచ్చి విద్యార్థులను కన్నబిడ్డలలా చూసుకునే  గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు Sana Sreenivasulu  గారికి కాల్ చేసి విషయం తెలుపమని చెప్పాడు. హరికృష్ణకు ధైర్యం చెపుతూనే బైక్ వంద కిలోమీటర్ల వేగంతో నడిపి పదిహేను నిమిషాల్లో తాడిపత్రి ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే శ్రీనివాసులు సారు తెలిసిన వారిద్వారా హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వలన వారు అప్రమత్తమై విద్యార్థికి వైద్యం అందించి ప్రమాదం నుంచి కాపాడారు.

కొన్ని నిమిషాలు ఆలస్యమైనా ప్రాణం పోయేదని బాషా సర్ సమయస్ఫూర్తిని, సాహసాన్ని కొనియాడారు వైద్య సిబ్బంది. కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, సహచర ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుని బాషా సర్ ను అభినందించారు.

15.08.2023 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల సిబ్బంది నన్ను అతిథిగా పిలవడంతో నాకు విషయం తెలిసింది. వెంటనే  శ్రీనివాసులు సర్ సహకారంతో బాషా సర్ ను సన్మానించడం జరిగింది. ధైర్యానికి ప్రతీక అయిన స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహూకరించాము.

స్వాతంత్ర్యాన్ని తెచ్చిన వీరులను మనం చూడలేదు కానీ చరిత్ర ద్వారా తెలుసుకొని అభినందిస్తున్నాము.సమయస్ఫూర్తి తో  విద్యార్థికి ప్రాణం పోసిన బాషా సర్ కూడా వీరుడే అని విద్యార్థులకు వివరించాను.

ఉపాధ్యాయుడు...విద్య మాత్రమే కాదు, విలువలు కూడా నేర్పాలి అని ప్రాక్టికల్ గా చూపించారు.

బాషా సర్.... 🙏

ఉపాధ్యాయుల గురించి నీచంగా, నిర్లక్ష్యంగా ఊహించుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని తెలియజేయాలనే తలంపుతో ఈ పోస్ట్ పెట్టాను. 
షేర్ చేసి పదిమందికి తెలుపగలరు. 

✍️....

👍👍👍👏👏👏👏

Tuesday, August 15, 2023

ఇలాంటి అధికారులు ఎంతమంది ఉన్నారు?

 #ఇలాంటి #అధికారులు ఎంతమంది ఉన్నారు?



తిరుపతి లోని *స్విమ్స్* ఆసుపత్రి  మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్ లోకి మీరు వెళ్తే టేబుల్ మీద కనిపించే దృశ్యం ఇది...

కానీ చాలామంది అధికారులు లెక్కకు మించి

అహంకారం చూపిస్తుంటారు..


వయస్సు 40 ఏళ్ళ లోపే ఉన్న చాలామంది

Ias, ips,irs అధికారులు ఇంకా బ్రిటిష్ కాలపు

నాటి బుద్ధులు పోనిచ్చుకోవడం లేదు..

మీరు ప్రజాలకోసమే పనిచెయ్యాలి అంతేగాని

మీ దర్పం అహంకారం మీ ఇంట్లో చుపించుకోండి

కనీసం వయస్సులో పెద్దవారినైనా కూర్చోపెట్టి

మాట్లాడే సంస్కారం నేర్చుకోండి


" *మీరు* *కూర్చున్నందుకు* *ధన్యవాదాలు* ... *ఇది* *మీ* *హక్కు* " అని ఇంగ్లీషులో టేబుల్ పై ఓ బోర్డు మనకు కనిపిస్తుంది... #కూర్చున్నందుకు ధన్యవాదాలు ఇది మీ #హక్కు అని ఎంత మంది అధికారులు చెప్పగలరు... చాలా కార్యాలయాల్లో 20 30 కుర్చీలు ఉన్నా కూర్చోమనడానికి అధికారులకు మనసొప్పదు... పేదవాళ్ళని నిలబెట్టి మాట్లాడటం... మహిళలను నిలబెట్టి మాట్లాడటం... తన కిందిస్థాయి వారిని నిలబెట్టి మాట్లాడటం ... తన హక్కులాగా భావిస్తూ ఉంటారు చాలామంది... వీటికతీతంగా డాక్టర్ రామ్ గారు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ మనకు కనిపిస్తారు ... అన్ని కార్యాలయాల్లో ఇలాంటి వాతావరణం రావడానికి అధికారులు ప్రయత్నించాలి...

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE