👉👉విజయవాడలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు మరణించడంతో నెల్లూరు జిల్లాకు చెందిన 19 సంవత్సరాల యువతి మానసిక వేదనతో బాధపడుతున్న ఆ యువతి, ఒంటరిగా నెల్లూరు నుంచి బస్సులో ప్రయాణించి విజయవాడ బస్టాండ్కు వచ్చింది
👉 దారి మధ్యలో ఆమె ఫోన్, పర్సు పోగొట్టుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఆకలితో, ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎవరూ లేని బాధతో ఆమె సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్లి సహాయం కోరింది.
👉నాకు ఎవరు లేరు… కొంచెం టిఫిన్ పెట్టండి… పని చేసుకుంటూ నేనే హాస్టల్లో ఉంటాను… దయచేసి నన్ను అక్కడికి చేర్చండి" అని ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంది.
👉యువతి పరిస్థితి చూసి ఆటో డ్రైవర్లు ముందుగా ఆమెకు టిఫిన్ ఏర్పాటు చేశారు. తరువాత విషయాన్ని అర్థం చేసుకున్న వారు తెలివిగా ఆలోచించి ఆ యువతిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
👉అక్కడ పోలీసులు ఆమె మాటలు విన్న వెంటనే విషయం సీఐ గారికి పోలీస్ సిబ్బంది తెలియజేశారు. సీఐ గారు తక్షణమే స్పందించి వాసవ్య మహిళా మండలికి ఫోన్ చేసి, ఆ యువతి పూర్తిగా సురక్షితంగా ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
👉ఆమె బంధువులు వచ్చే వరకు ఆమెను వాసవ్య సంరక్షణలో ఉంచి, అన్ని విధాలుగా సహాయం అందించాలని పోలీసుల సూచన మేరకు చర్యలు వేగంగా తీసుకున్నారు.
👉కాలుష్యంతో నిండిన ఈ కాలంలో ఇలాంటి మానవత్వం చూపిన ఆటో డ్రైవర్లపై, అలాగే వెంటనే స్పందించి రక్షణ కల్పించిన కృష్ణలంక పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మానవత్వం చూపిన ఆటో డ్రైవర్ అందరమూ మేచుకోక తప్పదు


No comments:
Post a Comment