నెలలో కేవలం 28 రోజులు మాత్రమే
*హైద్రాబాద్లో ఓ మహిళ తన పాత పూర్వీకుల ఇంటిని PG గా మార్చింది. ఆ ఇంట్లో 10-12 గదులు ఉన్నాయి, ఒక్కో గదిలో 3 బెడ్లు ఉంటాయి. చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు అక్కడ ఉంటున్నారు*
ఆమె వాళ్లు టిఫిన్, రాత్రి భోజనం, అవసరమైనవారికి ప్యాక్డ్ లంచ్ కూడా ఇస్తారు. భోజనం ఎంతో రుచిగా ఉండటం వల్ల అందరికీ ఇష్టం.
కానీ అక్కడ ఓ ప్రత్యేకమైన నిబంధన ఉంది – నెలలో కేవలం 28 రోజులు మాత్రమే వంట చేస్తారు. మిగతా 2-3 రోజులు అందరూ బయట తినాలి. ఆ రోజుల్లో కిచెన్ కూడా మూసివేస్తారు.
ఒకసారి ఆమెని అడిగాను – “ఇలాంటీ రూల్ ఎందుకు పెట్టారు?”
ఆమె నవ్వుతూ ఇలా అన్నది: “మేము కేవలం 28 రోజులకే ఫుడ్ ఛార్జ్ చేస్తాం. అందుకే వంట కూడా 28 రోజులు మాత్రమే.”
మళ్లీ అడిగాను – “ఇలా ఎందుకు చేస్తారు?”
ఆమె అప్పుడు గట్టిగా చెప్పింది: “మొదట్లో ప్రేమతో వండేదాన్ని. కానీ ఎప్పుడూ ఫిర్యాదులే – ఒక్కోసారి ఉప్పు ఎక్కువ, ఇంకోసారి తక్కువ. ఎప్పుడూ అసంతృప్తి. అప్పుడు కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఈ 2-3 రోజుల్లో వాళ్లు బయట తినాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ వంట భోజనం విలువ అర్థమవుతుంది. తర్వాత మిగిలిన రోజుల్లో ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు.
ఎక్కువ సౌకర్యం మనిషిని అసంతృప్తిగా, అలసుగా మారుస్తుంది.
మన దేశంలో కూడా కొంతమంది ఇలా ఉంటారు – ఎప్పుడూ లోపాలే చూస్తారు. అటువంటి వాళ్లు ఓసారి పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లో కొద్దిరోజులు గడిపితే మన దేశం విలువ తెలుస్తుంది.
*ఒక సాధారణ మహిళ చెప్పిన గొప్ప జీవన సత్యమిది*
😌
No comments:
Post a Comment