NaReN

NaReN

Thursday, November 18, 2021

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు

 స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు 

జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?*

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.

✔️ *రెండు జడలు వేసుకోవడం* (రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా *చిన్నపిల్ల* అని, *పెళ్లికాలేదని అర్ధం.* అంటే ఆ అమ్మాయిలో *జీవ + ఈశ్వర* సంబంధం విడివిడిగా ఉందని అర్ధము).

✔️ *ఒక జడ వేసుకోవడం* (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం).

✔️ *ముడి పెట్టుకోవడం* (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం).

✔️ అయితే *ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా* కూడా *జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు.* ఈ మూడు పాయలకు అర్ధాలు ఏందిరా అంటే!!

1. *తానూ, భర్త, తన సంతానం* అని ఈ మూడు పాయలకు అర్ధం.

2. *సత్వ, రజ, తమో గుణాలు,*

3. *జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి* అని అర్ధములు.

*అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం.*

😡 జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం. ...😡


Tuesday, November 16, 2021

గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు..

 గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు


రాజారామ్ కు గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు..

వెంటనే ఫామిలీ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు..అన్ని టెస్టులు చేయించారు.."ఇప్పుడిపుడే కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చెయ్యాలి, నేను చెప్పే ఈ డైట్ లో అస్సలు ఉప్పు వాడకూడదు" అని dr చాలా గట్టిగా హెచ్చరించాడు..🤷


ఈ నా డైటు, మందులు వాడితే ఇక లైఫ్ లో గుండెపోటు రాదు అని బల్లగుద్ది మరీ చెప్పాడు.😃


ఇక వీళ్ళు ఇంటికి వచ్చి ఆయన చెప్పిన డైట్ చాలా కచ్చితంగా పాటిస్తున్నారు. ఉప్పు అస్సలు వాడటం లేదు.🤷


ఒక ఆరు నెలల తరువాత మళ్ళీ గుండెపోటు వచ్చింది.

వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి dr ని నిలదీశారు..😎


మీరు చెప్పిన డైటు తూ చ తప్పకుండా పాటించాము, ఉప్పు అస్సలు వాడటం లేదు.. అయినా ఎందుకొచ్చింది అని గట్టిగానే అడిగారు..👍


Dr కు మతిపోయింది.. అంత మంచి మందులు, ఆ డైటు చేస్తే మళ్ళీ వచ్చే చాన్స్ హే లేదు ఎందుకోచిందబ్బా అని తెగ ఆలోచించాడు..అయినా కారణం దొరకలేదు..


ఇలా కాదని అమెరికా నుండి సైటిస్తులను పిలిపించి రాజారామ్ పై పరిశోధన చేయించాడు...


వాళ్ళు నెలరోజుల తరువాత తేల్చి చెప్పింది ఏమిటంటే..


"అతను వాడే కోల్గేట్ పేస్ట్ లో ఉప్పు0ది, అందుకే అతనికి మళ్ళీ గుండెపోటు వచ్చిoది" అని.


🤣🤣🤣🤣😍😍😍😍🤷🤷🤷🤗🤗🤗🙈

ప్రతి భారతీయ ఓటరు ఆలోచించాల్సిందే

 

ప్రతి భారతీయ ఓటరు ఆలోచించాల్సిందే

ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మీ జ్ఞానం పెరుగుతుంది.


  ?


  VVV ముఖ్యమైనది ...

   ఇది భారతదేశ వ్యవస్థ

   సాధారణ ప్రజలను మోసం చేస్తున్నారా?


 మీరే చూడండి ....

    

1- నాయకుడు కావాలనుకుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ ....

     మీరు రెండు చోట్ల ఓటు వేయలేరు,


2- మీరు జైలులో ఉంటే మీరు ఓటు వేయలేరు .. కానీ

     నాయకుడు జైలులో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.


3-మీరు ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే

    ఇప్పుడు మీకు జీవితకాలం ఉంది

     ప్రభుత్వ ఉద్యోగం రాదు,

కానీ,

హత్య లేదా అత్యాచారానికి పాల్పడిన నాయకుడు ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, అతను ఇంకా ప్రధాని లేదా రాష్ట్రపతి కావచ్చు, తనకు కావలసిన వారు.



4- బ్యాంకులో నిరాడంబరమైన ఉద్యోగం పొందడానికి

మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ..


కానీ,

నాయకుడికి బొటనవేలు ముద్ర ఉన్నప్పటికీ, అతను భారతదేశ ఆర్థిక మంత్రి కావచ్చు.


5-మీరు సైన్యంలో మైనర్ అయి ఉండాలి

సైనికుడి ఉద్యోగం పొందడానికి, మీరు 10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.


కానీ ....

నాయకుడు నిరక్షరాస్యుడు-పిరికివాడు మరియు లూలా-కుంటివాడు అయితే

అప్పుడు కూడా అతను ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు.

 మరియు

వీరి కుటుంబం మొత్తం ఇప్పటి వరకు ఏ పాఠశాలకు వెళ్లలేదు .. ఆ నాయకుడు దేశంలోని విద్యా మంత్రి కావచ్చు.


మరియు

వేలాది కేసులు జరుగుతున్న నాయకుడు ..

ఆ నాయకుడు పోలీసు శాఖ చీఫ్ కావచ్చు, అంటే హోం మంత్రి.



ఒకవేళ

ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకుంటున్నారా?

నాయకుడు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండాలి.

కాబట్టి

దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావడానికి మీ మద్దతు ఇవ్వండి.



మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....

కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.

30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? కేవలం 5 సంవత్సరాలు మాత్రమే MLA/MP పెన్షన్ యొక్క న్యాయం ఎక్కడ ఉంది ...?


.

శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.

ముంబై .....

 ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి

తొలగించవద్దు,

మేము ఈ వ్యవస్థను మార్చడానికి నిజంగా అవసరం.

గతంలోలా మారుద్దామా...

 గతంలోలా మారుద్దామా...


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

 Dress కుట్టిస్తే..

ఎంత ఆనందమో...👗👕


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...🥳


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. 

చేతిలో రూపాయో... 

అర్ధరూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...😊


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...💞


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని  సినిమా

చూస్తే ఎంత ఆనందమో...🥰


ఇంటికొచ్చాకా 

ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...💖


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..🙄


పక్కింట్లో వాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియో లో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంట కి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...😇


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు

కబుర్లు, కధలు

చందమామలు

బాలమిత్రలు...🥰


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....🏃🏻‍♂️


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...☺️


మూడు గదుల రైలుపెట్టి

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...😴


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..🤷‍♂️


20/-రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో,  చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాని..💓


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...🥰


తీర్థం లో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?🤩


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...✈️

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..🍧


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాలనగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, 

చేతిలో ఫోన్లు... 

అరచేతిలో స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...😍


అయినా చిన్నప్పుడు

పొందిన  ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు ...?

ఎందుకు...? ఎందుకు...?🤔


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...

ఎండమావి 

అయిపోయింది..


మార్పు ఎందులో...?🤔

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో ...?

చెప్పవా తెలిస్తే....!!   

ప్రస్తుతం అందరి మనసుల్లోనూ "స్వార్థం" నిండిపోయింది.

నీకు తప్పక తెలియాల్సిన అంశాలు

 నీకు తప్పక తెలియాల్సిన అంశాలు

❤️తనవారు చేసిన తప్పులకు తాను బాధ్యత వహించేవాడు ఉత్తముడు. 💕తాను చేసిన తప్పులకు తనవారిని, అమాయకులను, తనను విశ్వసించినవారిని బాధ్యులను చేసేవాడు అధముడు.

🌺ఈ కలికాలంలో నీ, నా భేదాలు, పాపం పుణ్యం పరమార్థాలు ఉండని వైనం సర్వత్రా దర్శనీయమే. 

💕స్వప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించే తత్వంతో ఇతరులకు హానిచేసైనా తన పబ్బం గడుపుకోవాలన్న దుగ్ధతో మనిషి ఎంతకైనా దిగజారి అత్యంత అసహ్యకరమైన పరాన్నభుక్కుల ప్రవృత్తికి దిగజారి పాపాల మూటలను మరుజన్మలో అత్యంత కష్టభూయిష్టమైన బతుకుకోసం కూడబెట్టుకుంటున్న వైనం ఆత్మహత్యా సదృశం.

💕కుటుంబంలో వ్యక్తి తప్పు చేస్తే కుటుంబ యజమాని; శిష్యుడు తప్పు చేస్తే గురువు; పరివారం, ఉద్యోగులు తప్పు చేస్తే పాలకులు బాధ్యత వహించాలని భారతీయ ధర్మాలు చెబుతున్నాయి. ధర్మాన్ని ఆచరించడం మనిషి ప్రధాన కర్తవ్యం. అధర్మ వర్తన మనసుకు తోచినంత మాత్రానే సరిదిద్దుకునేవాడు వివేకి. 

❤️నిజానికి మనసే మొదటి న్యాయస్థానం. మనస్సు కచ్చితమైన నిర్ణయాన్నే ఇస్తుంది. ఆ తీర్పును శిరసావహించినవారు పుణ్యపురుషులై చరితార్థులవుతుండగా, మనసు చూపిన బాటను త్రోసిపారవేసి ఆత్మవంచన చేసుకుంటూ పరుల కష్టార్జితాన్ని అప్పణంగా భోంచేస్తూ రౌరవాదినరకాలకు రాచబాటలను వేసుకుంటున్నారు కొందరు పరమమూర్ఖశిఖామణులు.

❤️గంగా యమునలు కలిసే చోట నీటమునిగి పన్నెండు సంవత్సరాలు ఘోర తపమాచరించిన మహా రుషి చ్యవనుడు. ఒకసారి జాలర్లు వేసిన వలలో చిక్కుతాడు. ఆశ్చర్యపోతారు, భయపడతారు మత్స్యకారులు. 'చేపలతోపాటు రాజుగారికి నన్ను కూడా అమ్మేయండి' అంటాడు చ్యవనుడు. విషయం తెలుసుకున్న మహారాజు నహుషుడు వచ్చి చ్యవనుడి పాదాలపై పడి- ఇది నా తప్పుగా భావించి మన్నించమని ప్రార్థిస్తాడు. ఇది ఎవరి తప్పుకాదు. నా విలువ ఎంతో కట్టి, వారికి ఇచ్చి పంపమంటాడు. కోటి మాడలిస్తానని అంటాడు మహారాజు. 'నా విలువ అంతేనా?' అంటాడు. అయితే రాజ్యమే వారికిస్తానంటాడు మహారాజు. నవ్వుతాడు చ్యవనుడు. ఇంతేనా నా వెల అంటాడు. సర్వ సంపదలకు నెలవు గోమాత. కాబట్టి ఆ మత్స్యకారులకు గోదానం చేసి పంపుతారు మధ్యవర్తులుగా అక్కడే ఉన్న రుషులు, మంత్రులు.

🌺ఇక్కడ మనం గమనించాల్సింది- నిజానికి మత్స్యకారులు చేసిన తప్పేమీ లేదు. అది వారి వృత్తి. అంతటి మహర్షి తపోభంగమైంది కాబట్టి తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి, ఆ తప్పును తనదిగా భావించమని, రాజ్యపరిత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు నహుషుడు.

❤️శివాజీ మహారాజుకు కానుకగా సైనికులు, ఓ అద్భుత సౌందర్యవతిని అంతఃపురానికి తెస్తారు. విషయం తెలుసుకున్న ఛత్రపతి ఆ సౌందర్యవతి దగ్గరకు వెళ్ళి- తల్లీ! నా సైనికులు చేసిన ఈ అజ్ఞానపు కార్యానికి నన్ను మన్నించు. 'అమోఘ సౌందర్యవతివి తల్లీ నీవు! బిడ్డగా నీ కడుపున పుట్టే భాగ్యం నాకు లేకపోయెనే' అంటూ చేతులు జోడిస్తాడు.

💕అంతటి గొప్ప సంస్కారం ఉంది కనకనే చరిత్రలో వారి గాథలు సువర్ణాక్షర లిఖితమయ్యాయి.

అవినీతిపరుల దుశ్చర్యలతో ప్రభుత్వ బొక్కసంలోని ద్రవ్యం అపహరణకు గురైనా, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినా, దుండగుల వల్ల రాజ్యంలో శాంతి సుఖాలకు ఆటంకం ఏర్పడ్డా, ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారినా అందుకు తప్పు- బాధ్యులైన పాలకులదే కదా.

❤️తన తప్పులకు ఇతరులను బలిచేయడం, అభిశంసించడం, దోషులుగా చేయడం అమానవీయ వైఖరి. పంచతంత్ర కథలు ఇందుకు అద్దం పట్టేవిగా అనేకం కనిపిస్తాయి. 'ఇకపై అడవిలోని సాధు జంతువులను కాపాడదాం. ఇష్టం వచ్చినట్లు తినేయడం, చంపేయడం చెల్లదు' తీర్మానం చేసింది పులి. అలాగేనన్నాయి నక్క, తోడేలు, ఒంటె. నక్కకు జిహ్వచాపల్యం ఎక్కువ.

💕దొంగచాటుగా సాధు జంతువులను చంపి తింటూ ఎముకలను తోడేలు, ఒంటె సంచరించే ప్రాంతాల్లో వేసేది. పైగా పులితో ఈ రెండింటిపై చాడీలు చెప్పింది. పులి వచ్చిచూసింది. ఆగ్రహించింది. వాటిని చంపేసింది.

💕తన కడుపు నింపుకోవడంతోనే తృప్తిపడలేదు నక్క.

🌺నిప్పు కాలుస్తుంది. తప్పూ అంతే. ధర్మరాజుకు తెలియనిదా, జూద వ్యసన ఫలితం ఎలా ఉంటుందో! జూదం ఆడక తప్పలేదు. ఫలితం కురుక్షేత్ర సంగ్రామానికే దారితీసింది. తెలిసి తప్పుచేసి దిద్దుకొనే కంటే, తప్పు చెయ్యకపోవడమే మేలు కదా!

Monday, November 15, 2021

సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్

 

సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్


 1. ఒకరికి, రెండు సార్లకు మించి

     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు

     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే

     చాలా ముఖ్యమైన పని ఉందని

     అర్థం.


 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు

     అరువు తీసుకున్న డబ్బును వారికి

     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న

     మొత్తమైనాసరే! అది మీ

     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 


 3. ఎవరైనా మీకోసం పార్టీ

     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన

     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్

     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే

     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని

     అడగండి.


 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?

      మీకు పిల్లలు లేరా? 

      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"

      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను

      ఎదుటివారిని అడగవద్దు. అవి,

      వారి సమస్యలు. మీవి కావు!


 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ

      మీరే  తలుపు తెరిచి లోపలికి

      ఆహ్వానించండి. అమ్మాయి,

      అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా

      సరే. ఒకరిక పట్ల మంచిగా

      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా

      మారరు.


 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా

     మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు

     సరదాగా తీసుకోకపోతే వెంటనే

     దాన్ని ఆపివేయండి! మరలా

     చేయవద్దు.


 7. బహిరంగంగా ప్రశంసించండి,

      ప్రైవేటుగా విమర్శించండి.


 8. ఒకరి బరువు గురించి మీరు

     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.

     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

      అని చెప్పండి.  అప్పుడు బరువు

      తగ్గడం గురించి మాట్లాడా

      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 


 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో

     చూపించినప్పుడు, అదొక్కటే

     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు

      స్వైప్ చేయవద్దు. తర్వాత

      ఏముంటాయో మీకు తెలియదు

      కదా!


 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా

       వ్యవహరిస్తారో అదే గౌరవంతో

       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.

       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే

       ప్రజలు ఖచ్చితంగా దాన్ని

       గమనిస్తారు.


 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ

        సలహా ఇవ్వకండి.


 12.  సంబంధంలేని వారికి మీ

        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 


 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి

       మీకు ఆహారాన్ని ఆఫర్

       చేసినప్పుడు మర్యాదగా 'నో'

       చెప్పండి. కానీ, రుచి లేదా వాసన

       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.

       అట్లా చేస్తే మీరు వారిని

       అవమానించినట్లే! 


 14. మరో ముఖ్య విషయం! ఇతరుల

        విషయంలో అనవసరంగా జోక్యం

        చేసుకోకుండా, మీ పనేదో మీరు

        చూసుకోండి!! 


నోట్: మీకు నచ్చితే ఆచరించండి! 

         లేకపోతే వదిలేయ్యండి!

         అంతేగానీ ఏంటీ శ్రీ రంగనీతులు

         అని మాత్రం అనుకోకండి!

Saturday, November 13, 2021

10 -11 మధ్యే ఉత్తమం

 🔊10–11 మధ్యే ఉత్తమం


🔶రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తుంటే జాగ్రత్త

🔷గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికం

🔶వైద్య నిపుణులు,పరిశోధకుల హెచ్చరిక

🔷అంతకు ముందే నిద్రించినా గుండెకు ముప్పే

🔶90 వేల మందిపై అధ్యయనంలో వెల్లడి

*రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోతున్నారా? మరీ 11, 12 గంటలు కూడా దాటిపోతోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఈ అలవాటును మార్చుకోవాల్సిందే. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్న వారిలో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికమైనట్లు వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. రోజూ రాత్రి 10–11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ అలవాటుతో గుండె జబ్బులను చాలావరకు దూరం పెట్టొచ్చునని అంటున్నారు.

*🌀రాత్రి 10 గంటలకు ముందు 11 గంటల తర్వాత నిద్రించే వారిలో గుండె జబ్బులు, ఇతర సమస్యలు పెరుగుతున్నట్టుగా ఓ తాజా అధ్యయనం తేల్చింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటెర్‌ బిజినెస్‌ స్కూల్‌లో అంతర్భాగంగా ఉన్న ‘ద ఇనిషియేటివ్‌ ఇన్‌ డిజిటల్‌ ఎకానమీ ఎట్‌ ఎక్సెటెర్‌ (ఇండెక్స్‌), వివిధ దేశాల్లోని పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి.*

*💥శరీరంలో గడియారం!*

*💠మన శరీరంలో అంతర్గతంగా  24 గంటల గడియారం (సిర్కాడియన్‌ రిథమ్‌) పనిచేస్తుందని, అది శారీరక, మానసిక పనితీరు క్రమబద్ధీకరణకు ఉపకరిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీనిని బట్టి రాత్రి 10–11 గంటల మధ్యకాకుండా ఇతర సమయాల్లో నిద్రకు ఉపక్రమిస్తే ఈ శరీర గడియారం సరిగా పనిచేయక గుండె సంబంధిత ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. యూకే బయోబ్యాంక్‌లోని దాదాపు 90 వేల మందికి సంబంధించిన సమాచారం, వివరాలు ప్రాతిపదికన ఈ  పరిశీలన నిర్వహించారు.*

*🥏వారం రోజుల పాటు వారు నిద్రించిన, మేల్కొన్న సమయాలను వారి ముంజేతిపై ఉండే అక్సిలరోమీటర్‌ (రిస్ట్‌వార్న్‌ అక్సిలరోమీటర్‌) ఆధారంగా పర్యవేక్షించారు.వివిధ సామాజిక నేపథ్యాలు, జీవనశైలి, ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలు, తదితర అంశాలతో కూడిన ప్రశ్నల ఆధారంగా తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. దీనితో  పాటు గుండె జబ్బులను గుర్తించేందుకు ఒక కొత్త విధానాన్ని అవలంబించడంతో పాటు, గుండెపోటు, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక గుండెజబ్బు, తదితర అంశాలను పరిశీలించారు.*

*ఈ క్రమంలో రాత్రి 10 నుంచి 10.59 నిమిషాల మధ్యలో నిద్రపోని వారిలో అత్యధికంగా* *గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం హెచ్చుస్థాయిలో* *ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా వయసు, లింగం, నిద్రపోయే కాలం, నిద్రలో అవాంతరాలు, మధ్యలో లేవడం, త్వరగా నిద్రపోవడం, రాత్రంతా గుడ్లగూబలా* *మేల్కొనడం, పొగతాగే అలవాటు, బాడీ మాస్‌ ఇండెక్స్, డయాబెటీస్, రక్తంలో కొలస్టరాల్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా నిద్రకు ఉపక్రమణ– గుండె సంబంధిత పని విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు.*

*💥25 శాతం అధికం*

*►రాత్రి 10–11 మధ్యలో నిద్రపోయే వారితో పోల్చితే ఆ తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే వారిలో వివిధ గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్‌ డిసీజెస్‌) గురయ్యే అవకాశం 25 శాతం అధికంగా ఉండే ప్రమాదం.*

*►రాత్రి 11–12 మధ్యలో నిద్రపోయే వారు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదంలో 12 శాతం పెరుగుదల*

*►రాత్రి 10 గంటల లోపు పడుకునే వారిలోనూ 24 శాతం అధికంగా గుండెజబ్బులు పెరిగే అవకాశం*

*►మహిళల్లో ఈ ప్రమాదం మరింత అధికం* 

*►రాత్రి 10 గంటలోపు నిద్రపోయే పురుషుల్లోనూ ఇది గణనీయంగానే ఉంది.*

*►అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం మరింత ప్రమాదకరం. ఉదయమే సూర్యకాంతిని చూడడం వల్ల శరీర గడియారం ‘రీ సెట్‌’ అయ్యే అవకాశాలుండగా, అది చూడలేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం.*

💥మరణాలు నిర్ధారణ కాలేదు

*♦️అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర వల్ల తీవ్రమైన గుండెజబ్బులువచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైందే తప్ప దాని వల్ల మరణాలు సంభవిస్తాయనేది నిర్ధారణ కాలేదని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటెర్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన సీనియర్‌ లెక్చరర్‌ డాక్టర్‌ డేవిడ్‌ ప్లాన్స్‌ స్పష్టం చేశారు.* 

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE