NaReN

NaReN

Wednesday, November 24, 2021

 ఆకాశం-మనకోసం

  🌺 ఆకాశం-మనకోసం🌺

                 


గేటు తెరుచుకున్న 🏠చప్పుడయింది.


అప్పుడే నిద్రపడుతున్న శంకరానికి నిద్రా

భంగం అయింది.


    తలతిప్పి ⏰గడియారం వంక చూశాడు.

సమయం రాత్రి పదకొండు అయింది. “ఈ సమయంలో వచ్చింది ఎవరా? అని ఆలోచించలేదతను. వచ్చింది నాన్న కోసమే!” అని మాత్రం అనుకున్నాడు.


    అంతలో పక్కగది తలుపు తెరుచుకుంది. "నువ్వా రమణయ్యా! ఈ సమయంలో వచ్చావు. మందేమైనా కావాలా?" అని తండ్రి అడగడం శంకరానికి వినిపిస్తూనే ఉంది.


     "ఉన్నట్లుండి ఆయాసం వచ్చిపడింది. ఊపిరి సలపడం లేదు. అందుకే ఈ సమయంలో వచ్చాను. ఏమీ అనుకోకు

క్రిష్ణమూర్తీ!" అన్నాడు రమణయ్య.


 “మరేం ఫర్వాలేదు.అలా కూర్చో! మందు ఇస్తాను" అన్నాడు క్రిష్ణమూర్తి. అతనిచ్చిన మందు వేసుకుని అయిదు నిముషాల తరువాత వెళ్లిపోయాడు రమణయ్య.


  క్రిష్ణమూర్తి బయట గేటు వేసి వచ్చి మంచం మీద నడుము వాల్చాడు.నిద్రాభంగం అయిన శంకరానికి మరిక నిద్ర పట్ట

లేదు. అందుకు కారకుడైన తండ్రి మీద పీకలదాకా కోపం వచ్చింది. అది వెంటనే వెళ్లగక్కకపోతే మరిక  నిద్రపట్టదని

నిశ్చయం అయ్యాక మంచం మీద నుంచి లేచి తండ్రి గదిలోకి వెళ్లాడు.


  “ఏం శంకరం! నిద్ర పట్టలేదా?" పలకరించాడు క్రిష్ణమూర్తి.“పట్టిన నిద్ర నీ వలన పాడైంది. అయినా మందులు ఇవ్వడానికి వేళాపాళా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని వాళ్లకు చెప్పు" అన్నాడు విసుగ్గా.


“వచ్చే రోగం వేళాపాళా చూసుకుని వస్తుందా? ఏదోచేతనైన సహాయం చేస్తున్నాను. కోపగించకు" అన్నాడు

క్రిష్ణమూర్తి.


"నీ మటుకు నీవుండక ఎందుకొచ్చిన సహాయాలు? ఇంటిని సత్రం చేస్తున్నావు. ఎప్పుడూ ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు" చికాకు పడుతూ తన గదిలోకి వెళ్లిపో

యాడు శంకరం.


    కొడుకు మాటలకు క్రిష్ణమూర్తి మనసు చివుక్కు మంది. అది అతనికి కొత్తేమీ కాదు. ప్రతీసారీ బాధనిపిస్తూనే ఉంటుంది. ప్రక్కవాడికి సహాయం చేయడం తప్పా? మనిషికి మనిషి సహాయం చేయకపోతే మరెవరుచేస్తారు? మనిషి తన మటుకు తాను ఉంటే కుంచించుకుపోతాడు. పదిమందికి సహాయం చేస్తేపరిమళిస్తాడు అన్నది అతని భావన. అతను అలాగే

ఉంటాడు. అందరూ అలా ఉండాలని అనుకుంటాడు.


    శంకరానికి నిద్రపట్టలేదు. తండ్రితో అంత కటువుగా మాట్లాడకుండా ఉండ వలసింది అనుకున్నాడు.


    శంకరానికి పదేళ్ల వయసు వచ్చేసరికి

అతని తల్లి కాలం చేసింది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా క్రిష్ణమూర్తి మరలా రెండో పెళ్లి చేసుకోలేదు. శంకరాన్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. ఆ అభిమానం

శంకరానికి లేకపోలేదు. వద్దనుకుంటూనే తండ్రి మీద కోపగించుకుంటూ ఉంటాడు.


      తలతిప్పి చూసిన శంకరానికి భార్య ఇందిర, అయిదేళ్ల కొడుకు అనిల్ నిద్రపోతూ కనిపించారు.శంకరానికి కంటిమీదకు కునుకు రాలేదు.


   తెలతెలవారుతుండగా బయట గేటు తీసిన చప్పుడయింది.అప్పుడే నిద్ర పడుతున్న శంకరానికి వెంటనేమెలకువ వచ్చింది. 'ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అప్పుడే తగలడ్డారు' అని మనసులో తిట్టుకున్నాడు.


   క్రిష్ణమూర్తికి యోగాలో మంచి ప్రవేశం ఉంది.  రిటైరయ్యాక నలుగురిని పిలిచి ఆసనాలు వేయించడం, ధ్యానం

చేయించడం వంటివి నేర్పించడం మొదలు పెట్టాడు.


    ఎప్పుడూ పదిమందికి తక్కువ కాకుండా జనం అతని దగ్గరకు వస్తూనే ఉంటారు.

అది శంకరానికి నచ్చదు. ఎవరింటి దగ్గర వాళ్లుయోగా చేసుకోవచ్చు కదా! మా ఇంటి మీదకు వచ్చిపడతారెందుకు? అనుకుంటాడు. అదే విషయం తండ్రితో

వాదించాడు కూడా!


    ఎవరింటి దగ్గర వాళ్లుఅయితే

బధ్ధకిస్తారు.అదే పదిమందీ ఒక చోట చేస్తే శ్రద్ధగా చేస్తారు.మనిషి పది మందితో కలిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. నీవు కూడా వచ్చి వాళ్లతో పాటు యోగా చేయి. ఆరోగ్యానికి ఆరోగ్యం.మానవ సంబంధాలు మెరుగుపడతాయి" అని చెప్పేవాడు

క్రిష్ణమూర్తి.ఆ మాటలు శంకరానికి రుచించేవి కావు.


   సమయం అయిదు గంటలు అయింది. శంకరం మరలా నిద్రపోవడానికి ప్రయత్నించాడు గాని నిద్ర పట్టలేదు.

అతనికి త్వరగా నిద్ర పట్టదు. పట్టినా చిన్న చప్పుడుకే మెలకువ వచ్చేస్తుంది.

అది తెలుసుకున్న క్రిష్ణమూర్తి ఒకసారి 'శంకరం! నీవు ఇష్టపడే ఒంటరితనం నీలో అభద్రతా భావంపెంచింది. నీ సంతోషం హరిస్తున్నది. అది నీవు గ్రహించడం లేదు. నీ మటుకు నీవుంటే నీ సంతోషం నీది. నీ

దుఃఖం నీది. బయటకి వచ్చి పదిమందితో పంచుకుంటే నీ సంతోషం మరింత పెరుగుతుంది. దుఃఖం తగ్గుతుంది" అని సలహా ఇచ్చాడు. తండ్రి మాటలు ఛాద

స్తంగా కొట్టిపారేశాడు శంకరం.


    ఏడు గంటలకు యోగా క్లాస్ పూర్తి అయింది. వచ్చినవారు వెళ్లిపోయారు. క్రిష్ణమూర్తి డాబా మీద నుంచి కిందకు దిగాడు. అప్పటికీ శంకరం కాఫీ తాగి పేపర్ 

చదువుకుంటున్నాడు.


   “కొంచెం సేపు ధ్యానం చేయకూడదూ? ఏకాగ్రత పెరుగుతుంది" అన్నాడు క్రిష్ణమూర్తి. శంకరం పేపర్ లోంచి

తలెత్తకుండానే “అవన్నీ పనీపాటా లేనివారికి. నాకెందుకు?" అన్నాడు.


క్రిష్ణమూర్తి మౌనంగా లోనికి నడిచి అప్పుడే నిద్రలేచిన మనవడ్ని పలకరించి వాడితో సూర్యనమస్కారాలు ప్రాక్టీస్ చేయించ

సాగాడు. అది చూసిన శంకరం “ఈయనగారు ఎవరినీ వదలడు" అనుకున్నాడు.


    శంకరం స్నానం చేసి, టిఫిన్ తిని ఆఫీస్ కి బయలుదేరబోతుండగా క్రిష్ణమూర్తి అతని దగ్గరకువచ్చాడు.


  “ఏమిటి?” అడిగాడు శంకరం. అతను,

శంకరానికి అయిదు వందలు అందించి “ఈ

చిరునామాకు మనీ ఆర్డర్ పంపించు" అని

చెప్పాడు. "ఎందుకట?" వివరం అడిగాడు శంకరం.


    "ఆ అబ్బాయికి చిన్న వయసులోనే గుండెజబ్బట. ఆపరేషన్ కి ఆర్ధిక

సహాయం కోరుతూ పేపర్ ప్రకటన

ఇచ్చారు. నేను చేయగల సహాయం

చేస్తున్నాను" చెప్పాడు క్రిష్ణమూర్తి. 


"అవన్నీ దొంగ ప్రకటనలు" చెప్పాడు శంకరం."మనిషి మీద అంత అపనమ్మకం పెంచుకోకు శంకరం! మనిషి, మనిషిని నమ్మకపోతే అది మానవ మనుగడకే ముప్పు"  కొడుకును హెచ్చరించాడు క్రిష్ణమూర్తి.


    అంతలో అటు వచ్చిన ఇందిర, భరతో 'మామయ్య పెన్షన్ డబ్బు ఆయన ఇష్టం వచ్చినట్లు వాడుకోమని మీరే కదా ! చెప్పారు.

ఆయన చెప్పినట్లు మని ఆర్డర్ చేయండి.

సరిపోతుంది" అన్నది.


  కృష్ణ మూర్తికోడలి వంక ప్రేమ పూర్వకంగా చూశాడు.శంకరం ,భార్య వంక అదోలా 

చూసి బయటకు నడిచాడు.


  శంకరం స్కూటర్ స్టార్ట్ చేస్తూ "అనిల్ ని ఒకసారి బయటకు పిలువు" అని భార్యకు చెప్పాడు."అనిల్ !డాడీ పిలుస్తున్నారు" కేక వేసింది ఇందిర.


    వీడియో గేమ్ ఆడుకుంటున్న అనిల్ బయటకురాకుండానే "బై డాడీ" అని అరిచి చెప్పాడు.కొడుకు బయటకు రాక పోవడం

శంకరానికి బాధ కలిగించింది. ఆఫీస్ కి బయలుదేరిపోయాడు.


    మనవడు బయటకు రాకుండానే బై చెప్పడం గమనించిన క్రిష్ణమూర్తి "మనిషి మనసుతో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీయాంత్రికం అయిపోతున్నాయి. కొంత కాలానికి మనిషి, మనసులేని మరబొమ్మ అయిపోతాడు" అనుకున్నాడు.


   అతను మనవడి దగ్గరకు వెళ్లి 'అని ల్! నాన్న పిలిచినప్పుడు బయటకు వెళ్లి ప్రేమగా బై చెప్పాలి.అప్పుడతని మనసుకు సంతోషం కలుగుతుంది.వీడియో గేమ్ ఎప్పుడూ ఉంటుంది. డాడీ మళ్లీ

సాయంత్రానికి గాని రాడు" అని చెప్పాడు.


   “అలాగే తాతయ్యా! రేపటి నుంచి బయటకు వెళ్లి డాడీకి బై చెప్తాను" అన్నాడు అనిల్. "కొడుకు కంటే మనవడే నయం. విషయం గ్రహించాడు" అనుకున్నాడు క్రిష్ణమూర్తి.


ఆయనకు భోజనం వడ్డించే సమయంలో

“మామయ్యా! ఎల్లుండి అనిల్ పుట్టినరోజు. మీ యోగా వాళ్లను భోజనానికి పిలుద్దాం" అన్నది. ఇందిర. అతను కోడలు

వంక అపురూపంగా చూశాడు. అతనికి శంకరం ఒక్కడే కొడుకు, కూతుళ్లు లేరు. అందుకని అతను కోడలులోనే కూతురిని చూసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అంతే.

మామగారిని పన్నెత్తి మాట అనదు. గౌరవం

చూపిస్తుంది. ప్రేమ కురిపిస్తుంది.


   "వాళ్లను పిలవడం శంకరానికి ఇష్టం

ఉండదేమో!" అన్నాడు క్రిష్ణమూర్తి. “ఆయనఎవరినీ పిలవొద్దనే అన్నారు. అయినా రోజూ మన ఇంటికి వచ్చేవాళ్లకు చెప్పక పోతే ఏం బాగుంటుంది? మీరు ఆహ్వా

నించండి. మీ అబ్బాయికి నేను నచ్చ చెప్తానులెండి" అన్నది ఇందిర.

“అలాగేనమ్మా!" అన్నాడు. క్రిష్ణమూర్తి.


  ఆ సాయంత్రం శంకరం ఇంటికి వచ్చాక “మనీ ఆర్డర్ పం పావా" అని అడిగాడు క్రిష్ణమూర్తి. "పంపాను. అది చూసి మా కొలీగ్ నవ్వాడు"అని చెప్పాడు శంకరం.


  "ఎందుకు నవ్వాడు?" అడిగాడు క్రిష్ణ మూర్తి."తనకు ఉన్నదేదో మనవడికి ఇవ్వాలి గాని బయట వాళ్లకు దానం చేయడం ఏమిటి! అని కామెంట్ చేశాడు" చెప్పాడు శంకరం. “నువ్వేమన్నావు?"ఆరా తీశాడు క్రిష్ణమూర్తి. "అది నిజమే కదా! అందుకే మౌనం వహించాను" చెప్పాడుశంకరం.


    "మనవాళ్లకే ఉపయోగ పడాలి అనుకోవడం  స్వార్థం అవుతుంది.అందరూ మనవాళ్లే అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుంది. మనిషి ప్రేమించడం నేర్చుకోవాలని నీ కొలీగ్ కి చెప్పు" అన్నాడు క్రిష్ణమూర్తి.


     శంకరం తండ్రివంక విసుగ్గా చూసి ఊరుకున్నాడు.


 వ్   శంకరం కాఫీ తాగుతుండగా "అనిల్  పుట్టిన రోజుకి యోగా వాళ్లను పిలవమని మామయ్యకు చెప్పాను" అంది ఇందిర.

“నేననుకోవడం ఈ ఆలోచన నీది కాదు. మా నాన్నది" అన్నాడు శంకరం. ఇందిర కాదని చెప్పినాశంకరం వినిపించుకోలేదు.


   కాఫీ తాగడం పూర్తయ్యాక తండ్రి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో క్రిష్ణమూర్తి

మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు.

“బాబు పుట్టిన రోజుకి యోగావాళ్లను పిలుస్తానన్నావట. వాళ్లు రావడం నాకిష్టం లేదు"చెప్పాడు శంకరం.


  “అయితే మీ ఆఫీస్ స్టాఫ్ ని పిలువు. పుట్టిన రోజునాడు పదిమంది వచ్చిబాబు మీద అక్షింతలు వేసి దీవిస్తే మంచిది"

చెప్పాడు క్రిష్ణమూర్తి.


“మావాళ్లు బిజీ. రాలేరు" చెప్పాడుశంకరం. “ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవడం,

ప్రక్కింటి వాళ్లతో కూడా సెల్ ఫోన్ లో

మాట్లాడ్డం ఇదేగా మీ దృష్టిలో బిజీగా

ఉండడం?" ప్రశ్నించాడు క్రిష్ణమూర్తి.


 “అదేం కాదు. పిల్లల్ని కష్టపడి చదివిం చడం, టాలెంట్ పరీక్షలు రాయించడం వంటి

పనుల్లో వాళ్లు బిజీ" చెప్పాడు శంకరం.

“పిల్లల మనసుల్ని చదువుల పేరుతో

మీరు ఎదగనివ్వడం లేదు. మొగ్గలుగా ఉండగానే తుంచేస్తున్నారు. మానవ సంబంధాలు దెబ్బతినడానికి ఇది ఒక కారణం" అన్నాడు క్రిష్ణమూర్తి,


   అంతలో అక్కడకు వచ్చిన ఇందిర,

భర్తతో “రోజూ మన ఇంటికి వస్తున్నారు.

ఏనాడూ మనం కాఫీ ఇచ్చింది కూడా లేదు.

ఒక్క రోజైనా పిలిచి పలకరిస్తేబాగుంటుంది" అన్నది.


  శంకరం భార్య వంక గుర్రుగా చూశాడు.

ఆ రాత్రి క్రిష్ణమూర్తికి చాలాసేపు నిద్రపట్ట

లేదు. అతను తరిగిపోతున్న మానవ సంబం

ధాల గురించి ఆలోచించాడు. యంత్రాల మధ్య పడి మనిషి కూడా ఒక యంత్రంగా మారిపోతున్నాడు. మనిషికిమనసే తరగని ఆస్తి అన్న సత్యం మరచి పతనాన్ని కొని

తెచ్చుకుంటున్నాడు” అని ఆలోచించాడు. 


   అనిల్ పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం క్రిష్ణమూర్తి పిలుపు అందుకున్న యోగా బృందం వాళ్లింటికి వచ్చింది. బాబుకి నీతి కథల పుస్తకాలు, ఆటబొమ్మలు

తెచ్చిచ్చారు. తాము తెచ్చిన స్వీట్స్ బాబు చేత తినిపించారు. అక్షింతలు వేసి దీవించారు. పాటలు పాడి అనిల్ నిఆనందపరిచారు. వాడి చేత ఆడించారు, పాడించారు.

శంకరంతో కూడా కలుపుగోలుగా మాట్లాడారు.


 వ ఎందుకో తెలీదుగానీ శంకరానికి  కూడా

ఆ సాయంత్రంఆనందంగా గడిచిందనిపించింది. వాళ్లు వచ్చి ఉండకపోతే

ఆ వేడుకకు అంత నిండుదనం వచ్చి ఉండేది కాదనుకున్నాడు.


వాళ్లందరూ వెళ్లాక క్రిష్ణమూర్తి, కొడుకుతో “మావాళ్లు రావడం నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా?" అని అడిగాడు.


“అటువంటిదేం లేదు. సంతోషంగానే అనిపించింది"మనస్ఫూర్తిగా చెప్పాడు శంకరం.


“శంకరం! ఒక సత్యం చెబుతాను. నాది ఛాద

స్తంగా భావించకుండా మనసు పెట్టి అలోచించు.మొక్కను తెచ్చి గదిలో పెడితే వాడిపోతుంది. బయట పెడితే చిగురిస్తుంది. దానికి జీవం పోసేది సూర్యకిరణం. ఇదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది. ఒంటరిగా

గదిలో కూర్చుంటే మనసు చచ్చిపోతుంది. బయటకువెళ్లి పదిమందితో గడిపితే అది సేద తీరుతుంది. మనసుకు ప్రాణం పోసేది  ప్రేమ అని మరువకు" అని

చెప్పాడు క్రిష్ణమూర్తి. 


   ఎప్పటిలా ఈసారి తండ్రిమాటలు శంకరం ఖండించలేదు. మౌనం వహించాడు.

ఆ రాత్రి క్రిష్ణమూర్తికి గుండెలో నొప్పిగా అనిపించింది. కొడుకును నిద్ర లేపి విషయం చెప్పాడు.ఎప్పుడూ ఏ నొప్పీ అనని తండ్రి ఒకేసారి గుండెనొప్పి అనగానే శంకరం కంగారుపడ్డాడు. "హాస్పిటల్ కి వెళ్దాం!" అన్నాడు. 


   “ఉదయం వెళ్దాం" అంటూ క్రిష్ణమూర్తి హోమియో మందులేసుకుని కళ్లు

మూసుకుపడుకున్నాడు. శంకరం తండ్రి మంచం పక్కనే పడక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.


అర్ధరాత్రి చూస్తే తండ్రి ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించలేదు. నాడి చూసిన శంకరం తండ్రి ప్రాణం

పోయినట్లు గ్రహించి కంట తడి పెట్టుకున్నాడు.విషయం తెలుసుకున్న ఇందిర, అనిల్ పెద్దగా ఏడవ సాగారు. 


   బంధువులకు, స్నేహితులకు కబుర్లు అందాయి.అంత దుఖం లోనూ శంకరానికి

ఆశ్చర్యం కలిగించింది ఏమంటే కబురు చేసిన వారి కంటే వచ్చిన వారు పది రెట్లున్నారు.


   ఇంటి ముందున్న రోడ్డు అంతా జనంతో నిండిపోయింది. అందరూ విషాద వదనాలతో కనిపించారు.


క్రిష్ణమూర్తి మంచితనం గురించి,అతను తమకు చేసిన సహాయం గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు.


  “శంకరం! పూలదండలోని దారం బయకు కనిపించదు.కానీ అది పూలనన్నింటినీ దగ్గరకు చేరుస్తుంది.ప్రేమ కూడా అంతే! అది బయటకు కనిపించదు. కానీ

మనుషులనందరినీ దగ్గరకు చేరుస్తుంది" అన్న తండ్రిమాటలు గుర్తుకొచ్చాయి శంకరానికి.


   మధ్యాహ్నానికి శవయాత్ర మొదలయింది. పాడెమోయడానికి చాలామందిముందుకు వచ్చారు. భుజం మార్చుకుంటూ తమ అభిమానం చాటుకున్నారు. సాయంత్రానికి అంత్యక్రియలు కార్యక్రమం ముగిసింది.


  ఆ తరువాత ప్రతీరోజు ఎవరో ఒకరు వచ్చి శంకరాన్ని కలిసి అతని తండ్రి మంచితనాన్ని పొగిడి, అతనికి ఓదార్పు మాటలు చెప్పేవారు. పెద్దకర్మ కూడా జరిగిపోయింది. ఇక

అంతటితో అంతా ముగిసిపోయిందని ఇక ఎవరూ తమఇంటికి రారని ఊపిరి 

పీల్చుకున్నాడు శంకరం.ఆ రాత్రి గాఢంగా నిద్రపోయాడు. 


  తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. తండ్రి చనిపోయేవరకూ ప్రతీ రోజూ ఆ సమయానికి బయట గేటు తెరుచుకునేది. డాబా మీద తండ్రి, వచ్చినవారితో కలసి ఆసనాలు వేసేవాడు.వాళ్ల మాటలు, చిన్న చిన్న శబ్దాలు లీలగా వినిపించేవి.

అప్పట్లో వాళ్ల వలన నిద్రపాడైందని తిట్టుకునేవాడుశంకరం. ఇప్పుడా నిశ్శబ్దం అతని మనసుకు బాధను కలిగించింది.


    భోజనం చేసి ఆఫీసుకి బయలుదేరి నప్పుడు పిలవకుండానే అనిల్ బయటకు వచ్చి బై చెప్పాడు. 'పిలిచినా రానివాడివి. ఈరోజు పిలవకుండానే వచ్చి బై

 చెబుతున్నావు. ఏమిటి విశేషం?" అడిగాడు శంకరం.


   “తాతయ్య చెప్పారు. నేను బయటకు వచ్చి నీకు 'బై' చెబితే నీ మనసుకు సంతోషం కలుగుతుందట" చెప్పాడుఅనిల్. శంకరం కళ్లముందు తండ్రి రూపం కదలాడింది.

మనసును ఎవరో మెల్లగా స్పృశించినట్లు

అనిపించింది.కన్నుల్లో చెమ్మ చేరింది.

కొడుక్కు ' బై' చెప్పి బయలుదేరి పోయాడు.

 

   ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు కూరగాయల దుకాణానికి వెళ్లాడు. దుకాణం అతను ఆప్యాయంగా పలకరించి “నాన్నగారు పోయారని తెలిసింది. ఊరిలోలేక

రాలేక పోయాను. మహానుభావుడు. ఈ దుకాణం పెట్టుకోడానికి బ్యాంక్ లోన్ ఇప్పించి సహాయం చేశాడు.అతన్ని ఎప్పటికీ మరచిపోలేను" అని చెప్పాడు.


  “నాన్న కనిపించకుండా ఎంత చేశాడు?” అనుకున్నాడు శంకరం. నెల రోజుల తరువాత శంకరానికి ఒక విషయం అర్థమయింది. తను భావించినట్లు చనిపోవడంతో తండ్రి అధ్యాయం ముగిసిపోలేదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు క్రిష్ణమూర్తి సహాయాన్ని, మంచితనాన్ని, ప్రేమను శంకరం దగ్గర గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.


  ఒకరోజు శంకరం టవల్స్ కొనడానికి బట్టల కొట్టుకువెళ్లాడు. అది పేరుమోసిన బట్టల దుకాణం. ఆ దుకాణం

యజమాని శంకరాన్ని చూడగానే పలకరింపుగా నవ్వి“మీరు క్రిష్ణమూర్తిగారి అబ్బాయి కదూ!” అని కూర్చోబెట్టి మర్యాద చేశాడు.


     “అప్పుడప్పుడూ మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కూర్చునేవారు. ఒకసారి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాననిచెప్పాను. మానసిక అశాంతి వలన అయి ఉంటుంది.ధ్యానం చేయమని సలహా ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలో కూడా వివరించారు. అప్పటినుంచి ధ్యానం చేస్తున్నాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటున్నది.ఆయన చనిపోవడం దురదృష్టకరం" అని బాధపడ్డాడు

దుకాణదారు.


తండ్రి ఎందరి మనసుల్లోనో నిలిచి పోయాడు అన్న సత్యం గ్రహించేసరికి శంకరానికి దిగులుగా అనిపించింది. అటు

వంటి తండ్రిని తను ఖాతరు చేసేవాడు కాదు. ప్రేమ చూపించేవాడు కాదు. ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టేవాడు. శంకరం మనసులో తీవ్రంగా బాధపడ్డాడు.


   అతను ఇల్లు చేరగానే ఇందిర ఒక ఉత్తరం అందించింది. చనిపోయిన తండ్రి పేరున ఉన్నదా ఉత్తరం.శంకరం కవరు చింపి చదివాడు.


     "శ్రీయుతులు క్రిష్ణమూర్తి గారికి! నమస్సులు. మీవంటి వాళ్లు పంపిన విరాళం చిన్న మొత్తము కావచ్చు. కాని అది

కష్టకాలంలో నాకెంతో ధైర్యాన్నిచ్చింది. నేను ఒంటరిని కాదు.నాకు తోడుగా చాలామంది ఉన్నారన్న ఆత్మసంతృప్తిని కలిగించింది. మీకు ధన్యవాదాలు... ఇట్లు .. గోపీ

అని ఉందా ఉత్తరంలో.


   శంకరం గోడకు తగిలించిన తండ్రి ఫోటో వంకచూశాడు. “శంకరం! మనిషి- నేను, నా కుటుంబం అన్న సంకుచితత్వం నుంచి బయటపడి మనం - మన వసుధైక

కుటుంబం అన్న విశాల దృక్పథం అలవరచుకోవాలి" అని చెబుతున్నట్లు అనిపించింది.


ఆ రాత్రి శంకరానికి నిద్ర కరువయింది. తనకు,తండ్రికి తేడా ఏమిటో అతను స్పష్టంగా గ్రహించగలిగాడు.తన తండ్రి మనసున్న మనిషి. తను మనసులేని మరబొమ్మ.తనకు జీవన సౌందర్యం తెలియదు. అదెలా ఉంటుందో తండ్రి తెలియబరిచాడు.


    ఒక ఆదివారం అతను తన తండ్రి బ్రతికి ఉండగా యోగాసనాలు వేయడానికి తమ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి ఇంటికి వెదుక్కుంటూ వెళ్లాడు. “మా నాన్నగారు చనిపోయారని మీరు మా ఇంటికి రావడం మానుకోకండి. నేనూ మీతో కలుస్తాను. యోగాతో నాన్నగారికి అంజలి ఘటిద్దాం" అని ఆహ్వానించాడు. అందుకు వారందరూ

సంతోషంగా తమ సమ్మతి తెలిపారు.


     మరునాడు తెలతెలవారుతుండగా శంకరం ఇంటి బయటి గేటు తెరిచాడు. వస్తున్న వారందరికీ హృదయ పూర్వకంగా ఆహ్వానం పలికాడు. డాబా పైకి వెళ్లి వాళ్లతో

పాటు ఆసనాలు వేశాడు. ఆ తరువాత ధ్యానంలో కూర్చున్నాడు.


    మనసులో తండ్రి రూపం కనిపించింది. “శంకరం!మనిషి తలుపులు మూసుకుని ఒంటరిగా గదిలో ఉండిపోతున్నాడు. అది తప్పు. మన కోసం ఆకాశం బయట వేచి

చూస్తున్నదని తెలుసుకోవాలి. ఇంటి తలుపులే కాదు,మనసు తలుపులు కూడా తెరుచుకుని బయటకు రావాలి.అప్పుడు ప్రపంచమే అతనిదవుతుంది" తండ్రి చెప్పిన

మాటలు మనసులో ప్రతిధ్వనించాయి.


   శంకరం కళ్లు తెరిచాడు. గదిలో ఉంటే కనిపించని ఆకాశం ఎంతో అందంగా,విశాలంగా కనిపించింది.మనసు

కొత్త చిగురు తొడిగిన భావన కలిగింది 


     తొలిసారి అతని మనసుకు ఎంతో సంతోషం, ప్రశాంతత కలిగాయి.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Tuesday, November 23, 2021

అమ్మచేతి వంట.. కొన్ని ముచ్చట్లు !

 అమ్మచేతి వంట.. కొన్ని ముచ్చట్లు !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అమ్మ--  ఒక అక్షయపాత్ర...!

అమ్మ చేతిగుణమేమిటోగానీ వంట అద్భుతం!

శాఖాహార వంటలకు మా వంశంలోనే పెట్టిందిపేరు.

బెండ, కాకర, సోర, గోరుచిక్కుడు వంటి

అంటుపులుసులు అమృతతుల్యంగా చేసేది.

తియ్యబెండకాయ, కలెగూర, టమాటపప్పు,

టమాటాతో బీర, సోర, పొట్ల, కాకరవంటి

కలగలుపుకూరలు వేటికవే సాటిగా ఉండేవి.

రాములక్కాయ కూర గురించి ఎంతచెప్పినా తక్కువే.

పప్పుచారు కలవోసినా, చుక్కకూర పప్పు వండినా

వంకాయకూరవండి - పచ్చిపులుసుచేసినా

ఆ రోజున ఇంటికి పండుగ వచ్చినట్టే ఉండేది.

అనుపపప్పువేసి పచ్చిపులుసుచేస్తే...

వందవంటల్లోనైనా గుర్తుపట్టేటంత మంచిగుండేది.

పెసరుపప్పు మద్దపప్పు వేసి, చింతకాయ చారుచేస్తే

ఇక ఏ కూరగాయల అవసరమూ లేనేలేదు. 

చలికాలంలో మా చేనులో తను పండించిన

అరొక్క కాయగూరలతో వరుగులు చేసేది...

మాకు తక్కున - మందికి ఎక్కువ ఖర్చుజేసేది.

ఎండకాలంల వరుగులతో ఎన్నిరకాల పులుసులో !

అన్నిటిలో ఉల్లిగడ్డ పులుసుది  రారాణివన్నె !!

చింతపండు తొక్కునూరినా, పుంటికూర తొక్కు నూరినా

కొత్తిమీరతో టమాటపచ్చెడ చేసినా దేనికదే పసందు.

పచ్చికాయలతోటి నువ్వుల తొక్కునూరితే ఆ రుచేవేరు.

పచ్చిమిరుపకాయలు నిప్పులమీద కాల్చి 

పచ్చిపులుసు చేస్తే.. పిల్లికూనలెక్క కాళ్లలో తిరిగేవాడిని.


అమ్మకు పిండివంటల కొలతలు కొట్టినపిండి.

అరిసెలకు , లాడూలకు ఆనుకం(పాకం) పట్టాలంటే

వాడకట్టంతా అమ్మనే పిలుచుకపొయ్యేవారు.

చకినాలు చుట్టుటానికి సంక్రాంతికి వారంముందునుండే

ఇంటిచుట్టున్నవాళ్లు అమ్మ దగ్గర హామీ తీసుకునేవారు.

నువ్వుల కరిజలు చేసినా, ఉప్పుడుపిండి పోసినా

అమ్మచేతి కమ్మదనం అమ్మదే...ఇంకెక్కడా దొరుకదు.


చింతకాయ, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ,

కరక్కాయ,టమాట... ఏ ఊరగాయ పెట్టినా

మడతమాను అడుగుతేలేదాకా కాదూలేదనకుండా

పనిపాటలోళ్లకు, అచ్చెగాళ్లకు, బిచ్చగాళ్లకు

చేతికి ఎముకలేకుండా అందరికీ కన్నతల్లిగా పంచిపెట్టేది.


అమ్మది--  అరుకతిగల్ల చెయ్యి...!

మాది కాపుదనపు కుటుంబం కనుక చేనుపనికి వెళ్లేది.

చేండ్ల అరొక్కచెట్టు, కాయగూరల పంట పండించేది

పుంటికూరైతే సగం ఊరికి సరిపొయ్యేటంత...

పనికివచ్చిన కైకిలివాళ్లు ఏనాడూ వట్టిచేతులతో 

ఇంటికి తిరిగివెళ్లేవారుకాదు.కొంగునింపుక పొయ్యేవారు.

మూడు నెలలపొద్దు గుమ్మడిచెట్టుకు నీళ్లుపోసి కాపాడితే

సద్దులబతుకమ్మ నాడు పూలన్నీ పలారం పంచిపెట్టేది.

ఈ విషయమై ఎన్నిపండుగలకు ఏడ్చిగగ్గోలు పెట్టేవాడినో !

రకరకాలపూలచెట్లు, కలియామాకు చెట్లు, జామపండ్లు..

కాలాన్ని అనుసరించి కాయగూరలు, ఆక్కూరలు

అడిగినవారికి లేదనకుంట ఆత్మీయంగా పంచిపెట్టేది.

పొరుగూరివారూ, ఎవరో తెలియని బాటసారులూ

మా చేనుదగ్గర ఆగి ఆకలితీర్చుకునేవారు.

ఆడవారికైతే.. గులాబో, దాసనపువ్వో ఇచ్చిపంపేది.


అమ్మది..  పాడిగలిగిన జీవితం...!

పొద్దున గుడిలో మైకు వెయ్యకముందే లేచేది

నాలుగు పాడిబర్లనూ దుడ్డెలనూ అరుసుకునేది

బర్రె ఈనితే మొదటిజున్ను పోచమ్మతల్లికి చెల్లించి

మూడురోజులూ చుట్టుమెట్టు అందరి కుతీ తీర్చేది

ఎంత చలికాలమైనా సరే, పొద్దు ఎక్కకముందే

దాలిలో రోజూ పెద్దకుండెడు పాలుకాగబెట్టేది.

రెండుపూటలా పెరుగుదుత్తలనిండా గట్టి గడ్డపెరుగు

విసుక్కోకుండా వాడకట్టుమీద అందరికీ 

పాలు, పెరుగు ఓపికగా వాడుకలు పోసేది.

అమ్మ చేతి తీపి పెరుగంటే--- కోమట్లకు ప్రాణం

లేదన్నా వినేవారుకాదు, ప్రాణసరం పడేవారు.

బతుకమ్మ పండుగ వస్తుందంటే నెలముందునుంచే

నెయ్యికోసం ఊరంతా మా ఇంటిదారి పట్టి

ఈ రుచి మరోదగ్గర దొరుకదని తేల్చిచెప్పేవారు.

అమ్మ రోజువిడిచిరోజు పెద్దకుండలో చల్లజేసేది

శేరు సర్వెడు వెన్న, రెండు పటువలనిండ చల్ల...

అమ్మది బతికిచెడ్డ సంసారమే 

కానీ పేదసాదల బలుగానికి లోటెప్పుడూ లేదు.

గంగెడ్లవాడు, సాతాని,బుడబుక్కలవాడు

తొలుతొలుత మా ఇంటివాకిలే తొక్కేవారు 

ఊరిలో అడుగుపెట్టిన బిచ్చగాండ్లందరూ

మా ఇంటికేవచ్చి మా అరుగమీదనే వాళ్ల సామానుంచి

ఊరుతిరుగుటకు పొయ్యచ్చి.. అవ్వా దూపైతంది !

అనుడే ఆలస్యం.. అమ్మ పెద్దచెంచెడు చల్లపోసేది.

ఆ చెంబెడు చల్లత్రాగి నీ కడుపు చల్లగుండ బిడ్డ

నీ ఇంటిదీపం కలకాలం చల్లగ వెలుగనియ్యి తల్లి...

అని బీదసాదలు దీవెనార్తి ఇచ్చిపొయ్యేవారు.

ఇదంతా నిన్నటికి ఇరువైయేండ్లకు ముందు కథ !


ఇవాళ అమ్మ లేదు, అన్నపూర్ణ వంటి అమ్మ 

ఇంకెక్కడ, ఎవరి ఋణం తీర్చుకుంటున్నదో..!

రాత్రి ఎనిమిదింటికీ ఊరి అలికిడి మగ్గినంకా

మా ఇంటి కడపతొక్కి ఆకలి తీర్చుకున్న 

అన్నార్తుల దీవెనలే... నాకు కొండంత అండ...


Friday, November 19, 2021

మన ఆచారాలు

 తరతరాలుగా మనం  వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని మన ఆచారాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలీపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలీ

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి  పెరుగు వేసుకోరాడు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15.  గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ  వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాడు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న ఛాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాడు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా  పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes ధరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు  (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీడి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి

       మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి

Thursday, November 18, 2021

Happy Mens Day

 దేవుడు చాలా దుర్మార్గుడు...

ఈ రోజు మా మగాళ్ల దినోత్సవం.

అని సంతోషించే లోపే... 

మరుగుదొడ్ల దినోత్సవం కూడా  

ఉందని గుర్తు చేశాడు.😢😢😢

అయినా సరే ఏదైనా ఎంజాయ్ చేద్దామంటే ఈరోజు కార్తీక పౌర్ణమి.


మా బాధలు ఎవరు పట్టించుకుంటారు, ఏడవలేక పైకి నవ్వుతూ తిరిగే మేము మాకు మేమే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. 


ఈ క్రింది విధంగా 

మా బాధ లు ఎవరు అర్దం చేసుకుంటారు..


🙏అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు నవంబర్19.2021.🙏


⚡ నువ్వు అలిగితే... ఆడపిల్లవా... అని హేళన.


⚡నువ్వు ఏడిస్తే... ఏడ్చేవాడిని

నమ్మొద్దని హేళన.


⚡సరదాగా బయటతిరిగితే... తిరుగుబోతు అని  బిరుదు.


⚡బాధ మరిచిపోవడానికి తాగితే... తాగుబోతు అని బిరుదు.


⚡అమ్మ చెప్పినట్లు వింటే అమ్మ చాటు కొడుకు అని.


⚡భార్య చెప్పినట్లు వింటే పెళ్ళాం చాటు మొగుడని.


⚡చెల్లె, అక్క, బావ, బాబాయ్, మాట వింటే చేతకాని చవట అని.


⚡దోస్తులతో బయట తిరిగితే

జులాయి అని.


⚡ఎక్కువ మాట్లాడితే పోకిరి అని.


⚡తక్కువ మాట్లాడితే నల్లికుట్లోడు అని.


నీవు ఏమి చేసినా, ఎలా ఉన్నా తప్పు పట్టే లోకంలో.

ఇంటా-బయట అన్ని రకాల 

బాధలు భరిస్తూనే, అవమానాలు సహిస్తూనే... బాధ్యతలు మోస్తూనే... కొడుకుగా, తండ్రిగా, భర్తగా, సోదరుడిగా, మేనమామగా, అల్లుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా నిరంతరం ప్రేమ ను పంచుతూ... 


అనునిత్యం త్యాగాలు చేస్తూ...నే  ఉన్న...ఓ..."మగ"ధీరుల్లారా...


⚡విధి వంచిత, ప్రియురాలు-భార్యాభాధిత, జనబాధిత, అప్పుబాధిత...మొ'...


శోకా...తప్త హృదయుల్లారా

బాధా సర్పదష్టుల్లారా...


⚡ఏ బాధాలేకుండా ఉంటున్న మహర్జాతకుల్లారా...(కొందరు)


⚡బాధనిపిస్తే మనసారా ఏడ్వలేని నిస్సహాయ పురుషుల్లారా...


⚡బ్రతుకు సమరం లో చితికిపోయిన అభినవ గరళకంఠుల్లారా...


⚡జీవితంలో సమస్యలతో కుస్తీ పడుతున్న మల్లయోధుల్లారా...


⚡కుటుంబం కోసం గస్తీ కాస్తున్నా ఇంటి సైనికుల్లారా...


⚡కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న జీతంలేని నిరంతర శ్రామికుల్లారా...


⚡ వచ్చింది...నీ కోసం ఓ రోజు నీకూ కేటాయించారు...ఓ రోజు...ఈ రోజైనా...అన్నీ...మరిచి...నీ...కోసం...నీవు...కాసేపైనా...సమయాన్ని కేటాయించుకొని సంతోషంగా గడుపుతావని... ఆశిస్తూ...


అంతర్జాతీయ 

పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు... 

HAPPY MEN'S DAY-2021

సర్వే 'మగ' జనా సుఖినోభవంతు🙏...



స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు

 స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు 

జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?*

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.

✔️ *రెండు జడలు వేసుకోవడం* (రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా *చిన్నపిల్ల* అని, *పెళ్లికాలేదని అర్ధం.* అంటే ఆ అమ్మాయిలో *జీవ + ఈశ్వర* సంబంధం విడివిడిగా ఉందని అర్ధము).

✔️ *ఒక జడ వేసుకోవడం* (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం).

✔️ *ముడి పెట్టుకోవడం* (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం).

✔️ అయితే *ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా* కూడా *జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు.* ఈ మూడు పాయలకు అర్ధాలు ఏందిరా అంటే!!

1. *తానూ, భర్త, తన సంతానం* అని ఈ మూడు పాయలకు అర్ధం.

2. *సత్వ, రజ, తమో గుణాలు,*

3. *జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి* అని అర్ధములు.

*అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం.*

😡 జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం. ...😡


Tuesday, November 16, 2021

గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు..

 గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు


రాజారామ్ కు గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు..

వెంటనే ఫామిలీ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు..అన్ని టెస్టులు చేయించారు.."ఇప్పుడిపుడే కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చెయ్యాలి, నేను చెప్పే ఈ డైట్ లో అస్సలు ఉప్పు వాడకూడదు" అని dr చాలా గట్టిగా హెచ్చరించాడు..🤷


ఈ నా డైటు, మందులు వాడితే ఇక లైఫ్ లో గుండెపోటు రాదు అని బల్లగుద్ది మరీ చెప్పాడు.😃


ఇక వీళ్ళు ఇంటికి వచ్చి ఆయన చెప్పిన డైట్ చాలా కచ్చితంగా పాటిస్తున్నారు. ఉప్పు అస్సలు వాడటం లేదు.🤷


ఒక ఆరు నెలల తరువాత మళ్ళీ గుండెపోటు వచ్చింది.

వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి dr ని నిలదీశారు..😎


మీరు చెప్పిన డైటు తూ చ తప్పకుండా పాటించాము, ఉప్పు అస్సలు వాడటం లేదు.. అయినా ఎందుకొచ్చింది అని గట్టిగానే అడిగారు..👍


Dr కు మతిపోయింది.. అంత మంచి మందులు, ఆ డైటు చేస్తే మళ్ళీ వచ్చే చాన్స్ హే లేదు ఎందుకోచిందబ్బా అని తెగ ఆలోచించాడు..అయినా కారణం దొరకలేదు..


ఇలా కాదని అమెరికా నుండి సైటిస్తులను పిలిపించి రాజారామ్ పై పరిశోధన చేయించాడు...


వాళ్ళు నెలరోజుల తరువాత తేల్చి చెప్పింది ఏమిటంటే..


"అతను వాడే కోల్గేట్ పేస్ట్ లో ఉప్పు0ది, అందుకే అతనికి మళ్ళీ గుండెపోటు వచ్చిoది" అని.


🤣🤣🤣🤣😍😍😍😍🤷🤷🤷🤗🤗🤗🙈

ప్రతి భారతీయ ఓటరు ఆలోచించాల్సిందే

 

ప్రతి భారతీయ ఓటరు ఆలోచించాల్సిందే

ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మీ జ్ఞానం పెరుగుతుంది.


  ?


  VVV ముఖ్యమైనది ...

   ఇది భారతదేశ వ్యవస్థ

   సాధారణ ప్రజలను మోసం చేస్తున్నారా?


 మీరే చూడండి ....

    

1- నాయకుడు కావాలనుకుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ ....

     మీరు రెండు చోట్ల ఓటు వేయలేరు,


2- మీరు జైలులో ఉంటే మీరు ఓటు వేయలేరు .. కానీ

     నాయకుడు జైలులో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.


3-మీరు ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే

    ఇప్పుడు మీకు జీవితకాలం ఉంది

     ప్రభుత్వ ఉద్యోగం రాదు,

కానీ,

హత్య లేదా అత్యాచారానికి పాల్పడిన నాయకుడు ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, అతను ఇంకా ప్రధాని లేదా రాష్ట్రపతి కావచ్చు, తనకు కావలసిన వారు.



4- బ్యాంకులో నిరాడంబరమైన ఉద్యోగం పొందడానికి

మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ..


కానీ,

నాయకుడికి బొటనవేలు ముద్ర ఉన్నప్పటికీ, అతను భారతదేశ ఆర్థిక మంత్రి కావచ్చు.


5-మీరు సైన్యంలో మైనర్ అయి ఉండాలి

సైనికుడి ఉద్యోగం పొందడానికి, మీరు 10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.


కానీ ....

నాయకుడు నిరక్షరాస్యుడు-పిరికివాడు మరియు లూలా-కుంటివాడు అయితే

అప్పుడు కూడా అతను ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు.

 మరియు

వీరి కుటుంబం మొత్తం ఇప్పటి వరకు ఏ పాఠశాలకు వెళ్లలేదు .. ఆ నాయకుడు దేశంలోని విద్యా మంత్రి కావచ్చు.


మరియు

వేలాది కేసులు జరుగుతున్న నాయకుడు ..

ఆ నాయకుడు పోలీసు శాఖ చీఫ్ కావచ్చు, అంటే హోం మంత్రి.



ఒకవేళ

ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకుంటున్నారా?

నాయకుడు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండాలి.

కాబట్టి

దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావడానికి మీ మద్దతు ఇవ్వండి.



మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....

కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.

30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? కేవలం 5 సంవత్సరాలు మాత్రమే MLA/MP పెన్షన్ యొక్క న్యాయం ఎక్కడ ఉంది ...?


.

శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.

ముంబై .....

 ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి

తొలగించవద్దు,

మేము ఈ వ్యవస్థను మార్చడానికి నిజంగా అవసరం.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE