NaReN

NaReN

Friday, April 11, 2025

నీ హక్కు తెలుసుకో...


నీ హక్కు తెలుసుకో...



*ఒక్క బాత్రూమ్ కోసం రూ.1.65 లక్షలు, ఒకే దెబ్బకు దేశం లోని అన్ని పెట్రోల్ బంకులకు గుణపాఠం నేర్పిన మహిళ*:- భారతదేశం లో పెట్రోల్ బంకులు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు లభించే ప్రదేశాలు మాత్రమే కాకుండా అక్కడ కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా పొందవచ్చు. దూర ప్రయాణాలు చేసే వారు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రెస్ట్‌రూమ్ సదుపాయం లాంటి వాటిని వాడుకోవచ్చు. ప్రభుత్వం దేశంలోని పెట్రోల్ బంకుల్లో బాత్రూమ్ వాడకాన్ని ఉచితంగా అందుబాటు లో ఉంచాలని సూచనలు చేసింది. మీరు అక్కడ పెట్రోల్ నింపినా, నింపకపోయినా, టాయిలెట్‌ ను ఉపయోగించేందుకు ఎలాంటి షరతలు ఉండకూడదు. అయితే, వాస్తవానికి కొన్ని పెట్రోల్ బంకులు ఈ నియమాన్ని పాటించకపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా, కొన్నిచోట్ల టాయిలెట్‌లను లాక్ చేసి ఉంచడం, తాళం వేసి ఉంచడం వంటి మనకు చాలా చోట్లనే కనిపిస్తుంది. ఇలాంటి ఓ సంఘటన కూడా ఇటీవల తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడి ఓ పెట్రోల్ పంపు నిర్వాహకులు దాని ఆవరణ లో టాయిలెట్‌ను సాధారణ ప్రజలకు అందుబాటు లో ఉంచక పోవడంతో, ఒక మహిళ ఈ వ్యవహారాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన కమిషన్, పెట్రోల్ పంపు యజమానులకు గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంది. ఈ వివరాల గురించి కింది కథనంలో పూర్తిగా తెలుసుకుందాం. కేరళ లో రాష్ట్రం లోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన జయకుమారి అనే మహిళ మే 8, 2024 న ఆమె తన కారులో ప్రయాణిస్తూ కోజికోడ్ ప్రాంతానికి చేరుకుంది. ప్రయాణంలో ఉన్న సమయంలో ఇంధన నింపుకోవడానికి ఓ స్థానిక పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపింది. అయితే ఆ టైం లో అత్యవసరంగా ఆమె బాత్రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఆమె పెట్రోల్ బంక్‌ లోని టాయిలెట్‌ ను ఉపయోగించాలన్న ఉద్దేశంతో సిబ్బందిని కోరింది. కానీ అక్కడి సిబ్బంది టాయిలెట్‌ను మూసివేసి ఉంచినట్టు తెలిపారు. ఇది చూసిన జయకుమారి, నిబంధనల ప్రకారం టాయిలెట్‌ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయినప్పటికి వారు ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే తిరిగి ఆమెతో అసభ్యంగా మాట్లాడినట్టు సమాచారం. పెట్రోల్ బంక్ సిబ్బంది ఆమె పట్ల నిర్వహించిన తీరును తెలియజేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అప్పటివరకు తాళం వేసి ఉన్న టాయిలెట్‌ను సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్న విచారణ చేసిన తరువాత తాళం తీశారు. జయకుమారి అంతటితో ఆగలేదు. ఆమె ఈ అంశాన్ని వినియోగదారు ల వివాదాల పరిష్కార కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. పతనం తిట్ట వినియోగదారుల కమిషన్ ఈ కేసును సీరియస్‌గా పరిగణించింది. విచారణలో, జయకుమారి చెప్పిన సంగతులన్నీ, పోలీసుల నివేదికలు, సాక్ష్యాల ఆధారంగా కమిషన్ తీర్పును ఇచ్చింది. పెట్రోల్ బంక్ యజమాని ఫాతిమా హన్నా, జయకుమారికి రూ.1.65 లక్షలు పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జయకుమారి పోరాటానికి న్యాయమూర్తులు న్యాయం చేశారు. మొత్తం రూ.1.65 లక్షలు పరిహారంలో రూ.1.50 లక్షలు ఆమెకు జరిగిన మానసిక ఇబ్బంది, అవమానం కింద పరిహారంగా ఇవ్వాలని, మిగిలిన రూ.15 వేల రూపాయలు చట్టపరమైన ఖర్చులకోసం చెల్లించాలని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలకు ప్రాథమికంగా అందించాల్సిన సేవలను నిరాకరించడం చాలా తప్పు. ఈ తీర్పు కేవలం ఒక సంఘటనకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంక్‌కు ఒక గుణపాఠంగా నిలిచేలా మారింది. రెస్ట్‌ రూమ్‌ లాంటి అవసరమైన సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచకపోతే, దాని మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఈ తీర్పు తెలుపుతోంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జయకుమారి ధైర్యాన్ని, కమిషన్ తీర్పును ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి భారతీయ పౌరుడు ఇలాంటి హక్కులు తెలుసుకోవాలనే ఆలోచనతో ఇలాంటి సంఘటనలూ ప్రాచుర్యం లోకి తీసుకువచ్చు తీసుకువస్తున్నాను. 


సదా మీ సేవలో

పసుపులేటి నరేంద్రస్వామి

Monday, April 7, 2025

Monday, March 10, 2025

Tuesday, March 4, 2025

Friday, February 28, 2025

Special test 2025

 


ప్రతి తండ్రి బిడ్డలకు ఇవ్వాల్సిన సలహా


 _*ప్రతి తండ్రి బిడ్డలకు ఇవ్వాల్సిన సలహా:*_


 _1. జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు. అందుకే ఆశలు తగ్గించుకుని, జీవితం ఎలా నడుస్తుందో అలా వెళ్లాలి._


 _2. నీ మనసులో ఉన్న జెలసీ, కోపం తగ్గించు. వాటివల్ల నీకు దక్కాల్సిన లాభం దక్కదు_


 _3. విజయవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఒకే ఒక నియమాన్ని పాటించు – నీకు నీవు అబద్ధం చెప్పుకోవద్దు._


 _4. నీ తల్లిదండ్రులు నీమీద ఆధారపడితే వారి అవసరంతో మాత్రం ఆడుకోవద్దు._


 _5. వ్యక్తులను కాదురా, లక్ష్యాలను అనుసరించు._


 _6. నీ 20వ పుట్టిన రోజు వరకూ స్వార్థం తోనే ఉండాలి, నీ జీవితం కోసం నువ్వే పోరాడు_


 _7. వదిలేయడానికి చాలా గొప్ప శక్తి కావాలి, నీ మనశ్శాంతికి అడ్డం నిలిచే దాన్ని వదిలేయి._


 _8. నీ మాటలు నీమౌనం కన్నా అందంగా ఉంటేనే మాట్లాడు._


 _9. నీ రూపాన్ని మెరుగుపరుచుకో. ఎవరి కోసమో కాదు, నీ కోసమే. బాగుంటే, మనసు కూడా హాయిగా ఉంటుంది. డబ్బుల్లేవని ఎలా పడితే అలా ఉండొద్దు._


 _10. కొంతమంది నువ్వు నాశనం కావాలని కోరుకుంటారు, ఎందుకంటే వారి జీవితం సరిగ్గా సాగడం లేదు కాబట్టి_


 _11. మంచివాళ్లను అందరూ ప్రేమించరు, కానీ ఎక్కువగా ఉపయోగించుకుంటారు._


 _12. మనుషులను వదిలేయడానికి భయపడకు, ఇలాంటి వారిని సంతోషపెట్టే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోవడం ఖాయం_


 _13. నీ ఆలోచనలను రహస్యంగా ఉంచుకో. పని పూర్తయ్యే వరకు బయటపెట్టకు. ముందుగా చెప్పడం అపశకునం లాంటిదే_


 _14. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అతిగా/ ఎక్కువగా ప్రేమించవద్దు. సైకో థెరపీ ఖర్చుతో కూడుకున్నది. ఒంటరిగా ఉన్నావని పెళ్లి మాత్రం చేసుకోవద్దు._


 _15. నీ ఆలోచనలు శక్తివంతమైనవి, అవి సానుకూలంగా ఉండేలా చూసుకో._


 _16. పుట్టినరోజుకి ఎవ్వరూ నీకు బహుమానాలు ఇవ్వరు, కష్టపడి సంపాదించు, నీకు నువ్వే బహుమతులిచ్చుకో_


 _17. భయపడుతూ వెనుకడుగు వేయకు, ఎందుకంటే అదే నీ జీవితాన్ని మార్చే నిర్ణయం కావొచ్చు._


 _18. ఎంత దాహంగా ఉన్నా, కొందరిని నీరు అడగకూడదు. తిండి విషయంలో కూడా కొందరు పిలిస్తే పోవద్దు_


 _19. నీ జీవితానికి విలువ జోడించు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో._


 _20. ఎవరినైనా ప్రేమించు, కానీ వారిని ప్రేమిస్తున్నంతవరకు నిన్ను నువ్వు గౌరవించుకో._


 _21. నీవే నీకు అసలైన మిత్రుడు. ఎప్పుడూ నిన్ను నువ్వు అవమానించుకోకు._


 _22. కొందరు నీ జీవితంలోనికి తిరిగి రావడం అంటే నువ్వు ఇంకా మూర్ఖుడిలాగే ఉన్నావా అని పరీక్షించడానికి మాత్రమే._


 _23. నీ జీవితంలో అవసరంలేని వారిని పంపించు, అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది._


 _24. పెద్ద కలలు కను, కానీ చిన్న చిన్న పనులతో మొదలు పెట్టు. స్థిరంగా ఉండి, ఎదుగుతూ వెళ్లు._


 _25. ఇతరులకు దానం/ ఖర్చు చేయడానికి ముందు నీ కుటుంబం పరిస్థితి చూసుకో._


 _26. తేలికగా వచ్చినది ఎక్కువ కాలం నిలబడదు. ఎక్కువ కాలం నిలబడేది తేలికగా రాదు._


 _27. నీ వ్యక్తిగత జీవితంపై అధికంగా ప్రశ్నలు వేసే వారికి తప్పు సమాచారం ఇవ్వడం అలవాటు చేసుకో._


 _28. మోసం చేసిన వ్యక్తులను మళ్లీ మళ్లీ నమ్మడం వల్ల ఓ రోజు నువ్వు HIV పాజిటివ్ కూడా అవ్వొచ్చు._


 _29. స్నేహితుల ఒత్తిడికి లోనవద్దు._


 _30. మహిళలను వేధించవద్దు, గౌరవించు._


 _31. పని చేసే ప్రదేశంలో అందరూ నీ స్నేహితులు కాదు._


_32.  త్వరపడుతూ , పొరపడుతూ నీ అభివృద్ధిని చెడగొట్టుకోవద్దు._


_~ నీ పనిమాత్రం నువ్వు హాయిగా చేసుకో.!_

Sunday, February 9, 2025

Thursday, January 30, 2025

ప్రేమ హత్య

 ప్రేమ హత్య




నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది..ఇవాళో రేపూ..కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని జంటను విడగొట్టింది..

వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలి .. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.కృష్ణా-రామా అనాల్సిన వయసులో పరువు..పరువు అంటూ రాత్రి పగలు కలవరించిన ఆ ముసలావిడ...తన మనవరాలిని పెళ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని హత్య చేయాలని మనవళ్లని ఆదేశించింది...అతన్ని చంపడానికి నాలుగు సార్లు ఆమెనే మనవళ్ల సాయంతో స్కెచ్ వేసింది.. మూడుసార్లు ఫెయిలైన స్కెచ్ నాలుగోసారి వర్కవుట్ అయింది..తన మనవరాలిని కులాంతర వివాహం చేసుకున్నఆ  కుర్రాడిని తన కళ్లముందే చంపాలనేది ఆ పెద్దావిడ కోరిక..నాయనమ్మ కోరిక తీర్చేందుకు నాయనమ్మ కళ్లల్లో ఆనందం చూడాలని ఆ మనవళ్లు ఇద్దరూ బావని అత్యంత క్రూరంగా చంపి నాయనమ్మకు డెడ్ బాడీని చూపించారు...నల్గొండ జిల్లాలో జరిగిందీ దారుణం.. 


తన చేతుల మీద ఆడించి పాడించిన మనవరాలు..వేరే కులానికి చెందినవాడిని ప్రేమించిందనే కారణంతో బంటీ అనే కుర్రాడిని అత్యంత దారుణంగా చంపించింది.. 

 ఇదిగో.. చంపాం చూడు’ అంటూ కార్లో మృతదేహాన్ని ఇంటికి తెచ్చి మరీ ఆ వృద్ధురాలికి చూపించారు ఆమె మనవళ్లు.. మృతదేహాన్ని చూశాక. శభాష్‌ రా...మనవళ్లూ అంటూ ఆ వృద్ధురాలు వారిని మెచ్చుకుంది.నా పరువు కాపాడారు మీరిద్దరూ అంటూ రక్తంతో తడిసిన తన మనవళ్ల చేతులు చూసి ఆ చేతుల్లో ఉన్న బంటీ రక్తాన్ని చూసి ఆనందంతో..నాట్యం చేసింది ..తన ఆఖరి కోరిక తీర్చినందుకు మనవళ్లని ముద్దాడింది..


తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్‌ మాల బంటి ... సూర్యాపేట మునిసిపల్‌ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన భార్గవి ప్రేమించుకున్నారు..మూడేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కులాలు వేరు కావడంతో భార్గవి ఇంట్లోవారు వీరి ప్రేమను అంగీకరించలేదు.ఇంట్లోవారు పెళ్లికి అంగీకరించకపోవడంతో.. గతేడాది ఆగస్టు 7న నార్కెట్‌పల్లి మండలం గోపాలాయిపల్లి గుట్ట వద్ద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో బంటి-భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన భార్గవి అన్న నవీన్, నాయనమ్మ బుచ్చమ్మ పగతో రగిలిపోయారు.. తమ మాట  కాదని వేరే కులానికి చెందిన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావని భార్గవితో గొడవకు దిగారు.వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.అయితే తాను మేజర్ ని అని..తన ఇష్టపూర్వకంగానే నవీన్ ను పెళ్లి చేసుకున్నాని భార్గవి చెప్పడంతో పోలీసులు ఆమె కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు..తర్వాత సూర్యాపేటలోని మామిళ్లగడ్డలోని తన అమ్మమ్మ పెరుమాళ్ల సాలమ్మ ఇంట్లో భార్గవితో కలిసి బంటి కాపురం పెట్టాడు.. అయితే తమ కళ్లముందే వేరు కాపురం పెట్టిన మనవరాలిని ఆమె భర్త బంటిని చూసి బుచ్చమ్మ పగతో రగిలిపోయింది.ఎలాగైనా సరే వాడిని చంపాలని మనవడు నవీన్ ని ఆదేశించింది.తన చివరి కోరిక తీర్చాలని కోరింది.. 

 

బంటీని హత్య చేయడానికి తన స్నేహితులు బైరు మహేశ్‌,వంశీ సాయాన్ని తీసుకున్ననవీన్ నాయనమ్మ బుచ్చమ్మతో కలిసి నవీన్ ను చంపడానికి స్కెచ్ వేశాడు... బంటి హత్యకు పథకం వేసిన నవీన్‌ మూడుసార్లు యత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో 26వ తేదీ సాయంత్రం ఐదింటికి బంటికి మహేశ్‌ ఫోన్‌చేసి పిలిపించుకున్నాడు. బంటి స్కూటీపైనే ఇద్దరూ కలిసి మహేశ్‌ పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే నవీన్‌ తన సోదరుడు వంశీతో కలిసి అక్కడి పరిసరాల్లో మాటు వేశారు. తిరిగి వెళ్దామంటూ బంటి స్కూటీ స్టాట్‌ చేయగా వెంటనే మహేశ్‌, నవీన్‌, వంశీ దాడికి పాల్పడ్డారు.ఐరన్ రాడ్లతో తీవ్రంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో బపంటి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. నవీన్‌, మహేశ్‌, వంశీ కలిసి కారు డిక్కీలో మృతదేహాన్ని వేసుకున్నారు. నేరుగా.. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతసూర్యాపేట గ్రామానికి వెళ్లి.. బంధువుల ఇంట్లో ఉన్న నవీన్‌ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. మృతదేహాన్ని చూసిన బుచ్చమ్మ శభాష్‌ అంటూ మనుమళ్లను అభినందించింది. చివరకు పిల్లలమర్రి శివారులో బంటి శవాన్ని పడేశారు. ఈ కేసుకు సంబంధించి భార్గవి సోదరులు నవీన్‌, వంశీ, తండ్రి సైదులు, నానమ్మ బుచ్చమ్మ, స్నేహితులు చరణ్‌, వంశీని అరెస్ట్ చేశారు


హత్య చేయించి..తర్వాత 65ఏళ్ల వయసులో అరెస్టైన తర్వాత కూడా బుచ్చమ్మ లో ఎలాంటి ప్రాశ్చాత్తాపం లేదు..భర్తని కోల్పోయి మనవరాలు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నప్పటికీ ఆమె మనసు కరగలేదు.. కులాంతర వివాహం చేసుకున్న తన మనవరాలికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అంటోంది...

Tuesday, January 28, 2025

Sunday, January 26, 2025

Saturday, January 11, 2025

Inspiration women

 Inspiration women


సామర్లకోటకు చెందిన శ్యామల హైదరాబాదులో స్థిరపడ్డారు. వ్యాపారంలో నష్టాలు రావటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన సమయంలో బయటపడేందుకు ఈత నేర్చుకున్నారు. ఏదైనా సాధించాలంటే వయసుతో పనిలేదని నిరూపించారు గోలి శ్యామల.


ఆ ఈతే సాహసంగా మార్ఛుకున్నారు. గతంలో 47 ఏళ్ల వయసులో శ్రీలంక నుంచి రామసేతు వరకు..  గతేడాది మార్చిలో పాక్‌ జలసంధి 30 కి.మీ దూరాన్ని. లక్షద్వీప్ చానల్ లో ఈతకొట్టి  రికార్డులు సాధించారు. తాజాగా 52 ఏళ్ల వయసులో విశాఖ నుంచి కాకినాడకు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈది రికార్డులకు ఎక్కారు.


విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ మొత్తం 150 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈదుతూ వచ్చారు శ్యామల. గతేడాది డిసెంబర్‌ 28న విశాఖపట్నం ఆర్కే బీచ్లో  మొదలు పెట్టిన ఈత 2025 జనవరి మూడో తేదీతో పూర్తైంది. రోజుకు 30 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని గోలీ శ్యామల ఈ రికార్డును పూర్తి చేశారు. యువత ఎంతో నేర్చుకోవాలి శ్యామల (52)గారి నుండి ..

Wednesday, January 8, 2025

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE